Political News

మహానాడు ఆపమని మాస్క్ లు వేసుకుని వచ్చారు

ఏపీ అధికార కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే మ‌హానాడుకు మ‌రో మూడురోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది. ఈ నెల 27 నుంచి 29 మ‌ధ్య మూడు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు పార్టీ నాయ‌కులు ఏర్పాట్ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేస్తున్నారు. అది కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకా.. క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తున్నారు. క‌డ‌ప‌లోని జ‌గ‌న్ సొంత మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం క‌మ‌లాపురంలో మూడు రోజుల ప‌సుపు పండ‌గ‌కు స‌న్నాహాలు సాగుతున్నాయి. అయితే.. ఇంత‌లోనే వైసీపీ ఈ మ‌హానాడుపై విషం చిమ్మే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

తాజాగా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ అదితి సింగ్‌కు.. మాజీ ఎమ్మెల్యే, జ‌గ‌న్ మేన‌మామ‌ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి స‌హా ప‌లువురు నాయ‌కులు భారీ విన‌తి ప‌త్రం ఇచ్చారు. “టీడీపీ నిర్వ‌హిస్తున్న‌.. మ‌హానాడును అడ్డుకోండి. జ‌ర‌గ‌కుండా ఆదేశాలు ఇవ్వండి. ఇప్ప‌టికే ఇచ్చిన అనుమ‌తులు త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయండి..” అని స‌ద‌రు విన‌తి ప‌త్రంలో పేర్కొన్నారు. అంతేకాదు.. మ‌హానాడు కు వ‌చ్చే వాహ‌నాల‌ను కూడా అనుమ‌తించ‌రాద‌ని.. ఇప్ప‌టికే ఇచ్చిన లైసెన్సుల‌ను ర‌ద్దు చేయాల‌ని కూడా కోరారు. మ‌హానాడు నిర్వ‌హిస్తే.. మ‌హా ప్రమాదం కొని తెచ్చుకున్న‌ట్టేన‌ని కూడా వ్యాఖ్యానించారు. దీనిని జాయింట్‌ క‌లెక్ట‌ర్ స్వీక‌రించారు.

ఎందుకు యాగీ?

వైసీపీ వాద‌న ప్ర‌కారం.. రాష్ట్రంలోను, దేశంలోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పుడు మ‌హానాడు నిర్వ‌హిస్తే.. ఈ కేసుల తీవ్ర‌త మ‌రింత పెరుగుతుంద‌ని.. త‌ద్వారా.. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని అంటున్నా రు. ఇదే విష‌యాన్ని విన‌తి ప‌త్రంలోనూ పేర్కొన్నారు. అయితే.. వాస్త‌వానికి ప్ర‌స్తుతం క‌రోనా కేసులు ఒక‌టి అరా క‌నిపించినా.. దేశ‌వ్యాప్తంగా ఎలాంటి అలెర్ట్ ప్ర‌క‌టించ‌లేదు. పైగా ఇదేమీ అత్యంత ప్ర‌మాద‌క‌ర వైర‌స్ అని ఎవ‌రూ చెప్ప‌లేదు. కేంద్రం కూడా.. దీనిని సీరియ‌స్ ఎఫెక్టెడ్ వైర‌స్‌గా ప్ర‌క‌టించ‌లేదు.

అయినా కూడా.. వైసీపీ నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా మ‌హానాడుకు మోకాల‌డ్డే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే క‌రోనా బూచిని చూపిస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ పుంజుకుంటుంద‌న్న భ‌యంతోనే వైసీపీ నాయ‌కులు యాగీ చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే.. తాము హైకోర్టులో కూడా ఈ విష‌యంపై పిటిష‌న్ వేస్తామ‌ని వైసీపీ నాయ‌కులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 24, 2025 9:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

1 hour ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

9 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

10 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

10 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

12 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

12 hours ago