భాగ్యనగరం హైదరాబాద్లో జరుగుతున్న 74వ ప్రపంచ అందాల సుందరుల(మిస్ వరల్డ్) పోటీలు కొనసాగుతున్నాయి. అంగ రంగ వైభవంగా సాగుతున్న ఈ పోటీల్లో పలు దేశాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే గత 15 రోజులుగా ఈ పోటీలకు వచ్చిన సుందరాంగులు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. ఆహూతులకు ఆనందాన్ని పంచుతున్నా రు. అదేసమయంలో పోటీని కూడా రసరమ్యం చేస్తున్నారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం కూడా.. ఈ పోటీలకు ప్రత్యేక భద్రతను కల్పించింది. ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది.
ఇలా సాగుతున్న ఈ పోటీల్లో అనూహ్యమైన ఆరోపణలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. బ్రిటన్కు చెందిన 24 ఏళ్ల వయసున్న మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ.. సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరో వారంలో ఫైనల్ పోటీ ఉందనగా ఆమె అనూహ్యంగా ఈ పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. వెంటనే తాను పోటీకి దూరంగా ఉంటున్నట్టు అధికారికంగా కూడా వెల్లడించింది. సరే.. దీని వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె తాజాగా కీలక ఆరోపణలు చేస్తూ.. అందుకే నేను పోటీ నుంచి తప్పుకొన్నానని వెల్లడించడం సంచలనంగా మారింది.
ఇంగ్లండ్ సుందరి మిల్లా చెప్పి కారణాలు ఇవీ..
నైట్ డ్రెస్సులతోనే ఉండాల్సి వస్తోంది.మేల్ స్పాన్సర్లతో రాసుకుని.. పూసుకుని కూర్చోమంటున్నారు.ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…