హెడ్డింగ్ చూడగానే రెండు సంబంధం లేని విషయాలను లింక్ పెట్టారేంటి అనుకోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. మే 30 విడుదల కాబోతున్న భైరవం మీద ప్రేక్షకుల అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. తమిళ గరుడన్ రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ మన ఆడియన్స్ ఎక్కువ చూడకపోవడంతో ఆ అడ్వాంటేజ్ తమకు ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోంది. అందులోనూ బాగా గ్యాప్ తీసుకుని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసిన సినిమా కావడంతో మాస్ మద్దతు ఓపెనింగ్స్ కు ఉపయోగపడుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే సీతారామరాజు రూపంలో మే 30 ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది.
ఖలేజా అదే రోజు రీ రిలీజ్ అవుతోంది. అందులో మహేష్ బాబు పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు. నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో 60 వేలకు పైగా టికెట్లు ముందస్తుగా అమ్ముడుపోవడం కొత్త రికార్డు. వారం ముందుగానే ఇంత ట్రెండింగ్ లో వచ్చిన పాత సినిమా టాలీవుడ్ లో లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు భైరవం బుకింగ్స్ ఓపెన్ చేసినా పది వేల నెంబర్ నమోదవుతుందనే గ్యారెంటీ లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మే 30 నాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి ఖలేజాకు ఎక్కువ స్క్రీన్లు, షోలు ఇచ్చే సిచువేషన్ రావొచ్చని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదే కనక జరిగితే ఫస్ట్ డే భైరవంకు ఇబ్బంది తప్పదు. ఖలేజాకు ఈ రెస్పాన్స్ ఆశించిందే కానీ మరీ ఇంత భీభత్సంగా కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సాధారణ జనంలో దీన్ని థియేటర్ లో అనుభూతి చెందాలనే కోరిక బలంగా కనిపిస్తోంది. అందుకే టికెట్లు ఇంత వేగంగా అమ్ముడుపోతున్నాయి ఈ మధ్య కొన్నిసార్లు రీ రిలీజుల వల్ల కొత్త సినిమాలు ప్రభావితం చెందాయి. ఇప్పుడు ఖలేజా వల్ల అదే జరిగితే భైరవంకు టెన్షన్ తప్పదు. ఒకవేళ కంటెంట్ యూనానిమస్ గా ఉంటే మాత్రం ఆందోళన అక్కర్లేదు. మరి ఆ స్థాయిలో దర్శకుడు విజయ్ కనకమేడల మేజిక్ చేశారో లేదో ఇంకో వారం రోజుల్లో తేలనుంది.
This post was last modified on May 24, 2025 5:21 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…