Movie News

భైరవంని ఇబ్బంది పెడుతున్న సీతారామరాజు

హెడ్డింగ్ చూడగానే రెండు సంబంధం లేని విషయాలను లింక్ పెట్టారేంటి అనుకోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. మే 30 విడుదల కాబోతున్న భైరవం మీద ప్రేక్షకుల అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. తమిళ గరుడన్ రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ మన ఆడియన్స్ ఎక్కువ చూడకపోవడంతో ఆ అడ్వాంటేజ్ తమకు ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోంది. అందులోనూ బాగా గ్యాప్ తీసుకుని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసిన సినిమా కావడంతో మాస్ మద్దతు ఓపెనింగ్స్ కు ఉపయోగపడుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే సీతారామరాజు రూపంలో మే 30 ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది.

ఖలేజా అదే రోజు రీ రిలీజ్ అవుతోంది. అందులో మహేష్ బాబు పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు. నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో 60 వేలకు పైగా టికెట్లు ముందస్తుగా అమ్ముడుపోవడం కొత్త రికార్డు. వారం ముందుగానే ఇంత ట్రెండింగ్ లో వచ్చిన పాత సినిమా టాలీవుడ్ లో లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు భైరవం బుకింగ్స్ ఓపెన్ చేసినా పది వేల నెంబర్ నమోదవుతుందనే గ్యారెంటీ లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మే 30 నాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి ఖలేజాకు ఎక్కువ స్క్రీన్లు, షోలు ఇచ్చే సిచువేషన్ రావొచ్చని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదే కనక జరిగితే ఫస్ట్ డే భైరవంకు ఇబ్బంది తప్పదు. ఖలేజాకు ఈ రెస్పాన్స్ ఆశించిందే కానీ మరీ ఇంత భీభత్సంగా కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సాధారణ జనంలో దీన్ని థియేటర్ లో అనుభూతి చెందాలనే కోరిక బలంగా కనిపిస్తోంది. అందుకే టికెట్లు ఇంత వేగంగా అమ్ముడుపోతున్నాయి ఈ మధ్య కొన్నిసార్లు రీ రిలీజుల వల్ల కొత్త సినిమాలు ప్రభావితం చెందాయి. ఇప్పుడు ఖలేజా వల్ల అదే జరిగితే భైరవంకు టెన్షన్ తప్పదు. ఒకవేళ కంటెంట్ యూనానిమస్ గా ఉంటే మాత్రం ఆందోళన అక్కర్లేదు. మరి ఆ స్థాయిలో దర్శకుడు విజయ్ కనకమేడల మేజిక్ చేశారో లేదో ఇంకో వారం రోజుల్లో తేలనుంది.

This post was last modified on May 24, 2025 5:21 pm

Share
Show comments

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

3 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

5 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

6 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago