Movie News

భైరవంని ఇబ్బంది పెడుతున్న సీతారామరాజు

హెడ్డింగ్ చూడగానే రెండు సంబంధం లేని విషయాలను లింక్ పెట్టారేంటి అనుకోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. మే 30 విడుదల కాబోతున్న భైరవం మీద ప్రేక్షకుల అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. తమిళ గరుడన్ రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ మన ఆడియన్స్ ఎక్కువ చూడకపోవడంతో ఆ అడ్వాంటేజ్ తమకు ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోంది. అందులోనూ బాగా గ్యాప్ తీసుకుని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసిన సినిమా కావడంతో మాస్ మద్దతు ఓపెనింగ్స్ కు ఉపయోగపడుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే సీతారామరాజు రూపంలో మే 30 ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది.

ఖలేజా అదే రోజు రీ రిలీజ్ అవుతోంది. అందులో మహేష్ బాబు పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు. నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో 60 వేలకు పైగా టికెట్లు ముందస్తుగా అమ్ముడుపోవడం కొత్త రికార్డు. వారం ముందుగానే ఇంత ట్రెండింగ్ లో వచ్చిన పాత సినిమా టాలీవుడ్ లో లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు భైరవం బుకింగ్స్ ఓపెన్ చేసినా పది వేల నెంబర్ నమోదవుతుందనే గ్యారెంటీ లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మే 30 నాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి ఖలేజాకు ఎక్కువ స్క్రీన్లు, షోలు ఇచ్చే సిచువేషన్ రావొచ్చని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదే కనక జరిగితే ఫస్ట్ డే భైరవంకు ఇబ్బంది తప్పదు. ఖలేజాకు ఈ రెస్పాన్స్ ఆశించిందే కానీ మరీ ఇంత భీభత్సంగా కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సాధారణ జనంలో దీన్ని థియేటర్ లో అనుభూతి చెందాలనే కోరిక బలంగా కనిపిస్తోంది. అందుకే టికెట్లు ఇంత వేగంగా అమ్ముడుపోతున్నాయి ఈ మధ్య కొన్నిసార్లు రీ రిలీజుల వల్ల కొత్త సినిమాలు ప్రభావితం చెందాయి. ఇప్పుడు ఖలేజా వల్ల అదే జరిగితే భైరవంకు టెన్షన్ తప్పదు. ఒకవేళ కంటెంట్ యూనానిమస్ గా ఉంటే మాత్రం ఆందోళన అక్కర్లేదు. మరి ఆ స్థాయిలో దర్శకుడు విజయ్ కనకమేడల మేజిక్ చేశారో లేదో ఇంకో వారం రోజుల్లో తేలనుంది.

This post was last modified on May 24, 2025 5:21 pm

Share
Show comments

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago