హెడ్డింగ్ చూడగానే రెండు సంబంధం లేని విషయాలను లింక్ పెట్టారేంటి అనుకోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. మే 30 విడుదల కాబోతున్న భైరవం మీద ప్రేక్షకుల అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. తమిళ గరుడన్ రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ మన ఆడియన్స్ ఎక్కువ చూడకపోవడంతో ఆ అడ్వాంటేజ్ తమకు ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోంది. అందులోనూ బాగా గ్యాప్ తీసుకుని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసిన సినిమా కావడంతో మాస్ మద్దతు ఓపెనింగ్స్ కు ఉపయోగపడుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే సీతారామరాజు రూపంలో మే 30 ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది.
ఖలేజా అదే రోజు రీ రిలీజ్ అవుతోంది. అందులో మహేష్ బాబు పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు. నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో 60 వేలకు పైగా టికెట్లు ముందస్తుగా అమ్ముడుపోవడం కొత్త రికార్డు. వారం ముందుగానే ఇంత ట్రెండింగ్ లో వచ్చిన పాత సినిమా టాలీవుడ్ లో లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు భైరవం బుకింగ్స్ ఓపెన్ చేసినా పది వేల నెంబర్ నమోదవుతుందనే గ్యారెంటీ లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మే 30 నాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి ఖలేజాకు ఎక్కువ స్క్రీన్లు, షోలు ఇచ్చే సిచువేషన్ రావొచ్చని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదే కనక జరిగితే ఫస్ట్ డే భైరవంకు ఇబ్బంది తప్పదు. ఖలేజాకు ఈ రెస్పాన్స్ ఆశించిందే కానీ మరీ ఇంత భీభత్సంగా కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సాధారణ జనంలో దీన్ని థియేటర్ లో అనుభూతి చెందాలనే కోరిక బలంగా కనిపిస్తోంది. అందుకే టికెట్లు ఇంత వేగంగా అమ్ముడుపోతున్నాయి ఈ మధ్య కొన్నిసార్లు రీ రిలీజుల వల్ల కొత్త సినిమాలు ప్రభావితం చెందాయి. ఇప్పుడు ఖలేజా వల్ల అదే జరిగితే భైరవంకు టెన్షన్ తప్పదు. ఒకవేళ కంటెంట్ యూనానిమస్ గా ఉంటే మాత్రం ఆందోళన అక్కర్లేదు. మరి ఆ స్థాయిలో దర్శకుడు విజయ్ కనకమేడల మేజిక్ చేశారో లేదో ఇంకో వారం రోజుల్లో తేలనుంది.
This post was last modified on May 24, 2025 5:21 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…