Political News

చంద్రబాబును ఫాలో కావాలన్న మోదీ

ఏపీ సీఎంగా చంద్రబాబు, భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసింది మొదలు వికసిత్ భారత్-2047 కోసం నిర్విరామంగా శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు దశాబ్దాల కాలంలో సాధించవలసిన ప్రగతి, అందుకు సంబంధించి ఇప్పటి నుంచే రూపొందించాల్సినా కార్యచరణపై ఈ ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ కోసం సీఎం చంద్రబాబు ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సిందూర్ ను ప్రశంసిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ హయాంలో ఇటు దేశంలో, అటు ఏపీలో సాధించిన ప్రగతిని ప్రస్తావించారు. ఏపీలో 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తన ప్రజెంటేషన్ లో వివరించారు.

వికసిత్ భారత్-2047 కల సాకారమయ్యేలాగా స్వర్ణాంధ్ర వికసించేలాగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం, వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో వివరించారు. విశాఖకు అంతర్జాతీయ హంగులు దిద్దుతున్నామని, నాలుగు జోన్ లుగా విభజించాలన్న యోచనలో ఉన్నామని తెలిపారు. అమరావతి, కర్నూలు, తిరుపతిలు కూడా విశాఖ మోడల్ ను పరిశీలిస్తున్నామని అన్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రజెంటేషన్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ప్రజెంటేషన్ లో విషయాలు వికసిత్ భారత్-2047 లక సాకారమయ్యేందుకు దోహదం చేసేలా ఉన్నాయని కితాబిచ్చారు. అంతేకాదు, మిగతా రాష్ట్రాలు కూడా చంద్రబాబు చెప్పిన ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు.

This post was last modified on May 24, 2025 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేని కాజల్.. తెలుగులో వెబ్ సిరీస్

కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…

3 hours ago

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

6 hours ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

9 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

9 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

10 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

11 hours ago