Political News

చంద్రబాబును ఫాలో కావాలన్న మోదీ

ఏపీ సీఎంగా చంద్రబాబు, భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసింది మొదలు వికసిత్ భారత్-2047 కోసం నిర్విరామంగా శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు దశాబ్దాల కాలంలో సాధించవలసిన ప్రగతి, అందుకు సంబంధించి ఇప్పటి నుంచే రూపొందించాల్సినా కార్యచరణపై ఈ ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ కోసం సీఎం చంద్రబాబు ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సిందూర్ ను ప్రశంసిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ హయాంలో ఇటు దేశంలో, అటు ఏపీలో సాధించిన ప్రగతిని ప్రస్తావించారు. ఏపీలో 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తన ప్రజెంటేషన్ లో వివరించారు.

వికసిత్ భారత్-2047 కల సాకారమయ్యేలాగా స్వర్ణాంధ్ర వికసించేలాగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం, వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో వివరించారు. విశాఖకు అంతర్జాతీయ హంగులు దిద్దుతున్నామని, నాలుగు జోన్ లుగా విభజించాలన్న యోచనలో ఉన్నామని తెలిపారు. అమరావతి, కర్నూలు, తిరుపతిలు కూడా విశాఖ మోడల్ ను పరిశీలిస్తున్నామని అన్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రజెంటేషన్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ప్రజెంటేషన్ లో విషయాలు వికసిత్ భారత్-2047 లక సాకారమయ్యేందుకు దోహదం చేసేలా ఉన్నాయని కితాబిచ్చారు. అంతేకాదు, మిగతా రాష్ట్రాలు కూడా చంద్రబాబు చెప్పిన ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు.

This post was last modified on May 24, 2025 3:08 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

2 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

4 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

5 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

5 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

6 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

6 hours ago