Political News

ఎస్-400: మరో రెండిటి కోసం రంగంలోకి అజిత్ దోవల్

అత్యాధునిక రక్షణ వ్యవస్థలలో ఒకటైన ఎస్-400 ట్రయంఫ్, గగనతల భద్రతకు అగ్రశ్రేణి కవచంలా నిలుస్తోంది. ఇది 400 కిలోమీటర్ల దూరం వరకు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధవిమానాలను గుర్తించి ధ్వంసం చేయగలదు. శత్రు రేడార్‌ జామింగ్ వ్యవస్థలను ఎదుర్కొని పనిచేసే సామర్థ్యం ఇందులో ఉంది. భారత వైమానిక దళం పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు ఎస్-400 వ్యవస్థలను మోహరించింది.

ఇక మిగిలిన రెండు యూనిట్ల డెలివరీపై భారత్ దృష్టి సారించింది. 2018లో రూ.35 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న భారత్-రష్యాల మధ్య ఇప్పటివరకు మూడు వ్యవస్థలు చేరాయి. కానీ ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి మిగిలిన డెలివరీ ఆలస్యమవుతోంది. ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం 2026 లోగా భారత్‌కు అందించాల్సి ఉంది.

అయితే ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత ఎస్-400 వ్యవస్థలు పాకిస్తాన్ వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, డెలివరీని వేగవంతం చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ నెల 27 నుంచి 29 వరకు మాస్కో పర్యటనకు వెళ్లనున్నారు.

మాస్కోలో జరిగే భద్రతా ప్రతినిధుల అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనాల్సిన దోవల్, అక్కడ రష్యా అధికారులతో ఎస్-400 వ్యవస్థల విషయంలో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. త్వరిత డెలివరీకి అవసరమైన సహకారం కోరే అవకాశం ఉంది. త్వరగా మిగతా రెండు యూనిట్లు భారత్‌కు చేరితే, సరిహద్దు రక్షణ మరింత గట్టిగా బలపడనుంది.

Kumar

Recent Posts

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

22 minutes ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

46 minutes ago

హోమంత్రి కట్టుబొట్టుపై వ్యాఖ్యలు.. ఎవరూ సహించరు

రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…

2 hours ago

హ్యాపీ దెబ్బకు ఆర్య బయటికి వస్తున్నాడు

మన హీరోల పాత రీ రిలీజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడటం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చూశాం. పోకిరి, ఖుషి…

2 hours ago

నీట్ రీ ఎగ్జామ్… ఆ యాప్ బ్యాన్!

నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది…

2 hours ago

చికిరిని చూసే కోణం మారిపోయింది

గత ఏడాది పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ విడుదల చేశాక సోషల్ మీడియా ఊగిపోయింది. మిలియన్లలో వ్యూస్,…

2 hours ago