Political News

వెండితెర పై పవన్.. ప్రజల కోసం

సినిమాల్లో పవన్ కల్యాణ్ ది ఓ డిఫరెంట్ స్టైల్. ఆ స్టైలే ఆయనను పవర్ స్టార్ గా నిలబెట్టింది. లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. సినిమాల మాదిరే ఇప్పుడు రాజకీయాల్లోనూ పవన్ తనదైన శైలి డిఫరెంట్ స్టైల్ లో దూసుకుపోతున్నారు. టీడీపీ, బీజేపీలతో జనసేనను కలిపి కూటమి కట్టి వైసీపీని గద్దె దించే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిన పవన్… జనసేనకు వంద శాతం విజయాలను అందించారు. ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. పల్లెలంటే తనకెంత ఇష్టమో చెప్పడమే కాకుండా పల్లె ప్రగతికి సంబందించిన శాఖలను తీసుకున్న పవన్… పల్లె ప్రగతికి తనదైన శైలి నూతన పద్ధతులతో పట్టం కడుతున్నారు. అందులో బాగంగానే ఇప్పుడు పవన్ మన ఊరు మాటా మంతి పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.

గురువారం (ఈ నెల 22 నుంచి) నుంచి అమలు కానున్న ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచే ఎంపిక చేసిన గ్రామాల ప్రజలతో మాట్లాడతారు. వారి సమస్యలను వింటారు. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అదికారులకు దిశానిర్దేశం చేస్తారు. అంటే… మన నేతలు పల్లెలకు వెళ్లి అక్కడ రచ్చబండ అనో, ప్రజల వద్దకు పాలన అనో పేర్లు పెట్టేసి సమస్యల పరిష్కారం కోసం వేసే టూర్లను పవన్ ఎక్కడికీ కదలకుండానే… తానున్న చోటు నుంచే ఎంపిక చేసిన గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరంచడం అన్నమాట. ఇందుకు ఆయా ప్రాంతాల్లోని సినిమా థియేటర్ స్క్రీన్లను వినియోగించుకుంటారు. థియేటర్ స్క్రీన్ ఎదుట ప్రజలు కూర్చుంటే… మంగళగిరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ ముందు పవన్ కూర్చుని వారితో నేరుగా ముచ్చటిస్తారు. అంటే… వెండితెర వేదికగా రచ్చబండ అన్నమాట.

సరే… కార్యక్రమం ఏదైనా ప్రజా సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యంగా పవన్ సాగుతున్నారు కదా. అయితే ఈ వెండితెర గ్రీవెన్స్ మాత్రం వాటన్నింటిలోనూ ప్రత్యేకమని చెప్పాలి. తనకున్న వెండితెర అనుభవాన్ని ప్రజలకు కూడా అనుభవం కలిగేలా పవన్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లుగా అనిపిస్తున్నా…పవన్ లక్ష్యం వేరని తెలుస్తోంది. గ్రీవెన్స్ కోసం తాను వెళ్లడం, లేదంటే ప్రజలు తన వద్దకు రావడం… రెండూ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే. అదే ఇలా వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో గ్రీవెన్స్ చేపడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో ఈ వెండితెర గ్రీవెన్స్ రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిదిలోని రావివలస గ్రామస్తులతో పవన్ సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పవన్ జాయిన్ అయితే,.. రావివలస గ్రామానికి చెందిన 300 మంది టెక్కలిలోని భవాని థియేటర్ ద్వారా పవన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పవన్ రావివలస గ్రామస్తులతో చర్చిస్తారు. వారి సమస్యలపై ఆరా తీస్తారు. ఆ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తారు. ఈ దిశగా ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి ఈ వెండి తెర గ్రీవెన్ష్ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. గురువారం దాకా ఆగాల్సిందే మరి.

This post was last modified on May 21, 2025 10:30 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

3 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

3 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

3 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

3 hours ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

5 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

7 hours ago