Political News

మా దేశం ధ‌ర్మ‌స‌త్రం కాదు: సుప్రీంకోర్టు

“నేను శ్రీలంకకు చెందిన వ్య‌క్తినే. కానీ, అక్క‌డ నాప్రాణాల‌కు ముప్పుంది. కాబ‌ట్టి.. ఇక్క‌డే త‌ల‌దాచుకుంటాను. ఇక్క‌డే ఉండిపో తాను. దేశాన్ని గౌర‌విస్తాను. నాకు ఇక్క‌డ శాశ్వ‌త ఆశ్ర‌యం క‌ల్పించండి” అని కోరిన వ్య‌క్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. “మా దేశం ఎవ‌రికి ప‌డితే వారికి ఆశ్ర‌యం క‌ల్పించేందుకు.. ధ‌ర్మ‌స‌త్రం కాదు. ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌చ్చి.. ఇక్క‌డ త‌ల దాల్చుకోవ‌డానికి శ‌ర‌ణార్థి శిబిరం కూడా కాదు. కాబ‌ట్టి.. ద‌య‌చేయండి” అని తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. అంతేకాదు.. స‌ద‌రు వ్య‌క్తిని శిక్ష పూర్త‌యిన త‌ర్వాత‌..(ఒక‌వేళ ఇప్ప‌టికే పూర్త‌యి ఉంటే) త‌క్ష‌ణ‌మే దేశం నుంచి పంపేయాల‌ని అధికారుల‌ను ఆదేశించింది.

ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వ‌స్తున్నార‌ని.. మ‌రో దేశంలో దాడులు జ‌రుగుతున్నాయ‌ని (ప‌రోక్షంగా పాకిస్తాన్‌, అఫ్గాన్‌) ఇక్క‌డ‌కు వ‌చ్చేస్తున్నారని.. ఇలా ఎంత మందికి ఈ దేశం ఆశ్ర‌యం క‌ల్పిస్తుంద‌ని ప్ర‌శ్నించింది. దేశం అంటే.. పుష్ప‌క విమానం కాదు.. ఎంత మంది వ‌చ్చినా.. మ‌రొక‌రికి చోటు ఉండ‌డానికి అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దేశ భ‌క్తి అంటే.. పుట్టిన దేశంపై ఉండాల‌ని.. పొరుగు దేశంపై కాద‌ని వ్యాఖ్యానించింది. భార‌త దేశంలోనే 140 కోట్ల మందికిపైగా ప్ర‌జ‌లు ఉన్నార‌ని.. ఇక్క‌డి వారితోనే దేశం విల‌సిల్లుతుంద‌ని.. పొరుగు దేశాల పౌరుల‌తో ప్ర‌యోజ‌నం లేద‌ని వ్యాఖ్యానించింది.

విష‌యం ఏంటి?

శ్రీలంక‌కు చెందిన ఓ వ్య‌క్తి(42) అక్క‌డి నిషేధిత ఎల్‌టీటీఈలో ప‌నిచేశాడు. దీంతో అత‌ను శ్రీలంక నుంచి పారిపోయి త‌మిళ‌నాడు కు చేరుకున్నాడు. ఇక్క‌డి అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. అయితే.. కొన్నాళ్ల‌కు గుట్టు బ‌య‌ట ప‌డి.. పోలీసులు అరెస్టు చేశారు. దీంతో త‌మిళ‌నాడు స్థానిక కోర్టు.. అత‌నికి ప‌దేళ్ళ క‌ఠిన కారాగారం విధించింది. దీనిని అత‌ను హైకోర్టులో స‌వాల్ చేయ‌గా.. ఈ శిక్ష‌ను ఏడేళ్ల‌కు కుదించింది. అయితే.. శిక్ష పూర్త‌యిన త‌ర్వాత దేశం విడిచి వెళ్లాల‌ని ష‌ర‌తు విధించింది. దీనిని స‌వాల్ చేస్తూ.. స‌ద‌రు వ్య‌క్తి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు. దీనిపై సుదీర్ఘ విచార‌ణ జ‌రిగిన త‌ర్వాత‌.. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువ‌రించింది.

ఇత‌ర దేశాల పౌరుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించేందుకు భార‌త్ ధ‌ర్మ స‌త్రం కాద‌ని.. ఎవ‌రి పౌరులు వారి దేశంలోనే ఉండాల‌ని అంత‌కు మించి వారికి సొంత దేశాల్లో ప్రాణ భ‌యం ఉంద‌ని తెలిస్తే.. వేరే ఏదైనా దేశానికి వెళ్లిపోవాల‌ని తేల్చి చెప్పింది. భార‌త దేశంలో ఇప్ప‌టికే జ‌నాభా పెరిగింద‌ని.. ఇత‌ర దేశాల‌కు చెందిన వారు ఇక్క‌డ ఆశ్ర‌యం పొంద‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఒక‌రికి ఆశ్ర‌యం క‌ల్పిస్తే.. దీనినే అదునుగా తీసుకుని ప్ర‌పంచం మొత్తం భార‌త్‌నే ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంటుంద‌ని వ్యాఖ్యానించింది. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు వ్య‌క్తిని ఏడేళ్ల శిక్షాకాలం పూర్త‌య్యాక శ్రీలంక అధికారుల‌కు అప్ప‌గించాల‌ని ఆదేశించింది.

This post was last modified on May 20, 2025 8:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పుల కష్టాల నుండి ఐపీఎల్ హీరో వరకు..

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సెన్సేషన్ ముకుల్ చౌదరి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. కేకేఆర్ పై అతను…

4 hours ago

ఆ రెడ్ల మౌనం వెనుక రహస్యం..?

వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక…

4 hours ago

ఎమ్మెల్సీ సీటుకి 30 కోట్లా?

రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా...ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క…

5 hours ago

అతిథి చాలా పెద్ద రిస్కు చేస్తున్నాడు

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి…

6 hours ago

ప్రేక్షకుల పట్ల బాధ్యత లేదా?

గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే…

6 hours ago

జన నాయగన్ పైరసీ వెనుక శత్రువులెవరు

నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్…

7 hours ago