Political News

‘నీళ్లు లేని ఫైరింజ‌న్లు.. ఆక్సిజ‌న్‌లేని అంబులెన్సులు’

హైద‌రాబాద్‌లోని చార్మినార్ స‌మీపంలో ఉన్న‌ గుల్జార్ హౌస్‌లో ఆదివారం జ‌రిగిన ఘోర అగ్ని ప్ర‌మాదం లో ఒకే కుటుంబంలోని 17 మంది మృతి చెంద‌గా.. మ‌రింత మంది గాయ‌ప‌డ్డారు. అదేవిధంగా ప‌లువ‌రు మృతి చెందారు. ఈ ఘ‌ట‌నా ప్రాంతాన్ని తాజాగా తెలంగాణ మాజీ మంత్ర కేటీఆర్ ప‌రిశీలించారు. రాష్ట్రం లో గ‌త ప‌దేళ్ల‌లో జ‌రిగిన అతి పెద్ద అగ్ని ప్ర‌మాదం ఇదేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌తో అయినా.. ప్ర‌భుత్వం మేల్కోవాల‌ని సూచించారు.

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం.. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద అగ్ని ప్ర‌మాదం జ‌రిగితే.. ప్ర‌భుత్వం స్పందించిన తీరు ఏమాత్రం బాగోలేద‌న్నారు. తాను ఏం మాట్లాడినా రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని విమ‌ర్శ‌లు చేస్తార‌ని.. కానీ, జ‌రిగిన ఘ‌ట‌న‌.. ప్ర‌భుత్వ స్పంద‌న‌ను పోల్చి చూస్తే.. ఖ‌చ్చితంగా ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని కాపాడ‌డంలో స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. అగ్ని ప్ర‌మాదాన్ని నివారించేందుకు పంపించిన ఫైర్ ఇంజ‌న్ల‌లో నీళ్లు లేవ‌ని కేటీఆర్ చెప్పారు. ఇక‌, బాధితుల‌ను ఆదుకునేందుకు వ‌చ్చిన అంబులెన్సుల్లో ఆక్సిజ‌న్ మాస్కులు, సిలిండ‌ర్లు కూడా లేవ‌న్నారు. వీటి వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం అని ప్ర‌శ్నించారు. జ‌రిగిన ఘ‌ట‌నలో అనేక మంది ప్రాణాలు కోల్పోయార‌ని.. వారికి స‌కాలంలో వైద్యం అంది ఉంటే బ్ర‌తికి ఉండేవార‌ని చెప్పారు.

కానీ, ప్ర‌భుత్వం కూడా అచేత‌నంగా వ్య‌వ‌హ‌రించింద‌ని విమ‌ర్శించారు. అందుకే.. ఇంత మంది చ‌నిపో యార‌న్నారు. తాను రాజ‌కీయాలు చేయ‌డానికి రాలేద‌ని.. బాధితుల‌ను, వారి కుటుంబాల‌ను ఓదార్చేందు కు వ‌చ్చాన‌ని కేటీఆర్ మీడియాకు చెప్పారు. త‌మ హ‌యాంలో ఇలాంటి అగ్ని ప్ర‌మాదాలు ఎప్పుడూ చోటు చేసుకోలేద‌న్నారు.

Satya

Recent Posts

పట్టపగలే కారు చీకట్లోకి బికనీర్!

సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…

2 hours ago

వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

రెండు బెనిఫిట్ షోలు సేఫా రిస్కా

పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…

3 hours ago

తేడా అంటూనే డబుల్ సెంచరీ కొట్టింది

దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…

4 hours ago

పవన్ అంతే… ఏదైనా పూర్తిగా తెలియాల్సిందే!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…

4 hours ago

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…

6 hours ago