Political News

‘నీళ్లు లేని ఫైరింజ‌న్లు.. ఆక్సిజ‌న్‌లేని అంబులెన్సులు’

హైద‌రాబాద్‌లోని చార్మినార్ స‌మీపంలో ఉన్న‌ గుల్జార్ హౌస్‌లో ఆదివారం జ‌రిగిన ఘోర అగ్ని ప్ర‌మాదం లో ఒకే కుటుంబంలోని 17 మంది మృతి చెంద‌గా.. మ‌రింత మంది గాయ‌ప‌డ్డారు. అదేవిధంగా ప‌లువ‌రు మృతి చెందారు. ఈ ఘ‌ట‌నా ప్రాంతాన్ని తాజాగా తెలంగాణ మాజీ మంత్ర కేటీఆర్ ప‌రిశీలించారు. రాష్ట్రం లో గ‌త ప‌దేళ్ల‌లో జ‌రిగిన అతి పెద్ద అగ్ని ప్ర‌మాదం ఇదేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌తో అయినా.. ప్ర‌భుత్వం మేల్కోవాల‌ని సూచించారు.

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం.. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద అగ్ని ప్ర‌మాదం జ‌రిగితే.. ప్ర‌భుత్వం స్పందించిన తీరు ఏమాత్రం బాగోలేద‌న్నారు. తాను ఏం మాట్లాడినా రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని విమ‌ర్శ‌లు చేస్తార‌ని.. కానీ, జ‌రిగిన ఘ‌ట‌న‌.. ప్ర‌భుత్వ స్పంద‌న‌ను పోల్చి చూస్తే.. ఖ‌చ్చితంగా ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని కాపాడ‌డంలో స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. అగ్ని ప్ర‌మాదాన్ని నివారించేందుకు పంపించిన ఫైర్ ఇంజ‌న్ల‌లో నీళ్లు లేవ‌ని కేటీఆర్ చెప్పారు. ఇక‌, బాధితుల‌ను ఆదుకునేందుకు వ‌చ్చిన అంబులెన్సుల్లో ఆక్సిజ‌న్ మాస్కులు, సిలిండ‌ర్లు కూడా లేవ‌న్నారు. వీటి వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం అని ప్ర‌శ్నించారు. జ‌రిగిన ఘ‌ట‌నలో అనేక మంది ప్రాణాలు కోల్పోయార‌ని.. వారికి స‌కాలంలో వైద్యం అంది ఉంటే బ్ర‌తికి ఉండేవార‌ని చెప్పారు.

కానీ, ప్ర‌భుత్వం కూడా అచేత‌నంగా వ్య‌వ‌హ‌రించింద‌ని విమ‌ర్శించారు. అందుకే.. ఇంత మంది చ‌నిపో యార‌న్నారు. తాను రాజ‌కీయాలు చేయ‌డానికి రాలేద‌ని.. బాధితుల‌ను, వారి కుటుంబాల‌ను ఓదార్చేందు కు వ‌చ్చాన‌ని కేటీఆర్ మీడియాకు చెప్పారు. త‌మ హ‌యాంలో ఇలాంటి అగ్ని ప్ర‌మాదాలు ఎప్పుడూ చోటు చేసుకోలేద‌న్నారు.

Satya

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

2 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

2 hours ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

3 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

4 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

4 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

5 hours ago