ఆంధ్రుల హక్కు… విశాఖ ఉక్కు అన్న నినాదాన్ని కూటమి సర్కారు సజీవంగా నిలిపింది. అప్పటిదాకా మార్కెట్లో అంగడి సరుకులా నిలిచిన విశాఖ ఉక్కును పరిరక్షించుందామని హామీ ఇచ్చిన కూటమి సర్కారు…అదికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీని అమలు చేసి తన మాటను నిలబెట్టుకుంది. విశాఖ ఉక్కును అమ్మేద్దామని ప్రణాళికలు రచించి వడివడిగా సాగిన కేంద్ర ప్రభుత్వం చేత అదే విశాఖ ఉక్కుకు ఊపిరి ఊదే బాధ్యతను భుజానికెత్తింది. ఇదంతా బాగానే ఉన్నా. ఇలా విశాఖ ఉక్కుకు ఊపిరి వచ్చే వేళ… ఫ్యాక్టరీలో ఆదివారం ఓ భారీ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశమే అయినా… కేంద్రం ఊపిరి ఊదుతున్న ఇలాంటి తరుణంలో దాదాపుగా 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైన అంశం మాత్రం అందరినీ షాక్ కు గురి చేసిందని చెప్పాలి. అంతేకాకుండా ఒక్కసారి లైనింగ్ వేస్తే… 1,050 హీట్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయాల్సిన టర్బో ల్యాడిల్ కార్ (టీఎల్సీ) కేవలం 500 హీట్లకే రంద్రం పడిపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. అంటే టీఎల్సీకి లైనింగ్ పనులను ఏదో అలా చేశారు తప్పించి… అందులో లేశమాత్రం కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న మాట.
ఇక ఆదివారం జరిగిన ప్రమాదం గురించిన వివరాల్లోకి వెళితే… బ్లాస్ట్ ఫర్నేస్ 2లో ఫర్నేస్ నుంచి ద్రవ ఉక్కును టీఎల్సీ లోకి నింపే కార్యక్రమం పూర్తి అయ్యింది. మరికాసేపు ఉంటే… ఆ ద్రవ ఉక్కు టీఎల్సీ ద్వారా ఎస్ఎంఎస్ కు తరలి వెళ్లేదే. అదే జరిగి ఉంటే… ఎలాంటి ప్రమాదం లేదు. టీఎల్సీ అక్కడి నుంచి కదలకముందే… దాని అడుగు భాగాన రంద్రం పడిపోయింది. టీఎల్సీలో ఉన్న ద్రవ ఉక్కు అంతా నేలపాలైంది. ద్రవ ఉక్కు పడటంతో కేబుల్స్, టీఎల్సీ రవాణా కోసం ఏర్పాటు చేసిన ట్రాక్ కాలిపోయాయి. ఈ సందర్బంగా అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగ అలముకున్నాయి.. అయితే కార్మికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘జైలర్’ సినిమాకు సీక్వెల్ మొదలై రెండేళ్లు కావస్తోంది. కానీ ఎంతకీ…
దర్శకులు నటులుగా మారినంత తేలిగ్గా.. నటులు దర్శకులు కాలేరు. ఎందుకంటే 24 విభాగాలనూ కోఆర్డినేట్ చేస్తూ సినిమా తీయడం అన్నది…
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…