Political News

ఆ యూట్యూబర్ అమాయకురాలు కాదు

పాకిస్థాన్‌కు దేశ రహస్యాలు అందజేస్తోందంటూ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్‌ను తాజాగా హరియాణా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ మధ్య గత కొన్ని వారాలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని చిన్నపాటి యుద్ధం కూడా జరిగిన నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. డానిష్ అనే పాకిస్థాన్ హై కమిషన్‌కు చెందిన అధికారితో జ్యోతి సంబంధాలు కలిగి ఉందని.. ఆమె దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంతర్గత సమాచారాన్ని అందజేసిందని ఆరోపణలు వచ్చాయి.

ఐతే ఒక యూట్యూబర్ అంత పని ఎందుకు చేస్తుందని.. దేశ రహస్యాలను పంచుకునే స్థాయికి ఆమెకు ఉంటుందా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. మన వాళ్లు పాకిస్థాన్ వాళ్లతో స్నేహం చేయడం.. ఆ దేశానికి వెళ్లడం కొత్తేమీ కాదని.. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఇది నేరంగా అనిపిస్తుండొచ్చని వీళ్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ జ్యోతి గత ఏడాదిగా ఏం చేసిందో తెలిస్తే ఆమె అమాయకురాలు కాదని అర్థమవుతుంది. నిన్నట్నుంచి వైరల్ అవుతున్న పాత ట్వీట్‌ను గమనిస్తే జ్యోతి వ్యవహారం అంత తేలికైందేమీ కాదని తెలుస్తుంది. తను ఐఎస్ఐ ఏజెంట్ అనే ఆరోపణల్లో నిజం లేకపోలేదనే అనిపిస్తుంది.

ఏడాది కిందట కపిల్ జైన్ అనే వ్యక్తి జ్యోతిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశాడు. ఆమె పది రోజుల కిందటే పాకిస్థాన్ ఎంబసీ ఫంక్షన్లో పాల్గొందని, అలాగే పాకిస్థాన్‌కు కూడా వెళ్లి వచ్చిందని.. ఇప్పుడు కశ్మీర్‌కు వెళ్తోందని.. ఈమె మీద ఒక కన్నేసి ఉంచాలని ఏఐఏకు అతను సూచించాడు. యూట్యూబ్‌లో 3 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగిన జ్యోతి తాను ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇండియాలో పాకిస్థాన్ దౌత్య అధికారులతో వేడుకల్లో పాల్గొన్న వీడియో, అలాగే పాకిస్థాన్‌ను సందర్శించినప్పటి వీడియోలు, అలాగే కశ్మీర్‌ పర్యటన తాలూకు వీడియోలను పంచుకుంది. ఈ వీడియోలన్నింటినీ కనెక్ట్ చేసి చూస్తే ఆమె తీరు అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. పోలీసులు ఆషామాషీగా ఏమీ ఆమెను అరెస్ట్ చేయలేదని అర్థమవుతోంది.

This post was last modified on May 18, 2025 2:53 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

15 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

26 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago