వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (కొడాలి నాని) ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే గుండె సంబంధిత సమస్యలతో సతమతమైన నాని..ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. ఇందుకోసం ముంబైలో చాలారోజులే ఉన్న నాని…ఇటివలే తిరిగివచ్చారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన ఇప్పుడు అమెరికా వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గుండె వ్యాధులకు చికిత్స తర్వాత రెస్ట్ మోడ్ లో ఉన్న నాని… తనకు అత్యంత సన్నిహితులను తప్పించి ఏ ఒక్కరిని కూడా తన దగ్గరకు కూడా అనుమతించడం లేదట. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత గుడివాడకు దాదాపుగా దూరం అయిపోయిన నాని… గుడివాడలోని తన అనుచరులకు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఎక్కడ తనపై కేసులు నమోదు అవుతాయోనన్న భయం నానిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం గమనార్హం.
అయితే వైసీపీ అదికారంలో ఉండగా… తొలి రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కొనసాగిన నాని… టీడీపీ పై ప్రత్యేకించి ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. నోటికి ఎంతమాట వస్తే అంత మాట అనేశారు. ఈ క్రమంలో బూతులు కూడా ఆయన నోట నుంచి అలా జాలువారిపోయాయి. ఇక మంత్రి హోదాలో గుడివాడలో ఆయన లెక్కలేనన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూటమి సర్కారు ఆరోపిస్తోంది. వాటిపై ఇప్పుడు ఏకంగా విజిలెన్స్ విచారణ జరుగుతోంది.
ఈ విచారణలు ముగిసి కేసులు నమోదు అయ్యేలోగానే అమెరికా వెళ్లిపోయేలా నాని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే నాని కదలికలపై గట్టి నిఘా పెట్టిన కూటమి సర్కారు… ఆయనను అంత ఈజీగా అమెరికా వెళ్లనిస్తుందా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకే చికిత్సల పేరిట నాని అమెరికా వెళ్లే దిశగా కదులున్నారని వాదనల నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on May 18, 2025 10:47 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…