వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (కొడాలి నాని) ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే గుండె సంబంధిత సమస్యలతో సతమతమైన నాని..ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. ఇందుకోసం ముంబైలో చాలారోజులే ఉన్న నాని…ఇటివలే తిరిగివచ్చారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన ఇప్పుడు అమెరికా వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గుండె వ్యాధులకు చికిత్స తర్వాత రెస్ట్ మోడ్ లో ఉన్న నాని… తనకు అత్యంత సన్నిహితులను తప్పించి ఏ ఒక్కరిని కూడా తన దగ్గరకు కూడా అనుమతించడం లేదట. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత గుడివాడకు దాదాపుగా దూరం అయిపోయిన నాని… గుడివాడలోని తన అనుచరులకు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఎక్కడ తనపై కేసులు నమోదు అవుతాయోనన్న భయం నానిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం గమనార్హం.
అయితే వైసీపీ అదికారంలో ఉండగా… తొలి రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కొనసాగిన నాని… టీడీపీ పై ప్రత్యేకించి ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. నోటికి ఎంతమాట వస్తే అంత మాట అనేశారు. ఈ క్రమంలో బూతులు కూడా ఆయన నోట నుంచి అలా జాలువారిపోయాయి. ఇక మంత్రి హోదాలో గుడివాడలో ఆయన లెక్కలేనన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూటమి సర్కారు ఆరోపిస్తోంది. వాటిపై ఇప్పుడు ఏకంగా విజిలెన్స్ విచారణ జరుగుతోంది.
ఈ విచారణలు ముగిసి కేసులు నమోదు అయ్యేలోగానే అమెరికా వెళ్లిపోయేలా నాని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే నాని కదలికలపై గట్టి నిఘా పెట్టిన కూటమి సర్కారు… ఆయనను అంత ఈజీగా అమెరికా వెళ్లనిస్తుందా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకే చికిత్సల పేరిట నాని అమెరికా వెళ్లే దిశగా కదులున్నారని వాదనల నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on May 18, 2025 10:47 am
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…