వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (కొడాలి నాని) ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే గుండె సంబంధిత సమస్యలతో సతమతమైన నాని..ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. ఇందుకోసం ముంబైలో చాలారోజులే ఉన్న నాని…ఇటివలే తిరిగివచ్చారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన ఇప్పుడు అమెరికా వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గుండె వ్యాధులకు చికిత్స తర్వాత రెస్ట్ మోడ్ లో ఉన్న నాని… తనకు అత్యంత సన్నిహితులను తప్పించి ఏ ఒక్కరిని కూడా తన దగ్గరకు కూడా అనుమతించడం లేదట. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత గుడివాడకు దాదాపుగా దూరం అయిపోయిన నాని… గుడివాడలోని తన అనుచరులకు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఎక్కడ తనపై కేసులు నమోదు అవుతాయోనన్న భయం నానిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం గమనార్హం.
అయితే వైసీపీ అదికారంలో ఉండగా… తొలి రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కొనసాగిన నాని… టీడీపీ పై ప్రత్యేకించి ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. నోటికి ఎంతమాట వస్తే అంత మాట అనేశారు. ఈ క్రమంలో బూతులు కూడా ఆయన నోట నుంచి అలా జాలువారిపోయాయి. ఇక మంత్రి హోదాలో గుడివాడలో ఆయన లెక్కలేనన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూటమి సర్కారు ఆరోపిస్తోంది. వాటిపై ఇప్పుడు ఏకంగా విజిలెన్స్ విచారణ జరుగుతోంది.
ఈ విచారణలు ముగిసి కేసులు నమోదు అయ్యేలోగానే అమెరికా వెళ్లిపోయేలా నాని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే నాని కదలికలపై గట్టి నిఘా పెట్టిన కూటమి సర్కారు… ఆయనను అంత ఈజీగా అమెరికా వెళ్లనిస్తుందా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకే చికిత్సల పేరిట నాని అమెరికా వెళ్లే దిశగా కదులున్నారని వాదనల నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on May 18, 2025 10:47 am
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…