భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసంలో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ ఫ్యామిలీ శనివారం సరదాగా గడిపింది. స్వయంగా మోదీ పలుమార్లు పిలవగా…లోేకేశ్ తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి శనివారం ఢిల్లీ వెళ్లారు. మోదీ తన అదికారిక నివాసం వేదికగా లోకేశ్ ఫ్యామిలీకి అదిరిపోయే విందు ఇచ్చారు. ప్రదాని నివాసంలో లోకేశ్ ఫ్యామిలీ దాదాపుగా గంటన్నర నుంచి రెండు గంటల పాటు గడిపింది.
ఈ సందర్భంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు లోకేశ్ యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 3 వేల కిలోమీటర్లకుపైగా సాగిన ఈ యాత్రలో లోకేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. ప్రజల కష్టసుఖాలను పంచుకున్నారు. వైసీపీ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడతానని శపథం చేశారు. అనుకున్నట్లు గానే బీజేపీ, జనసేనలతో కూడిన కూటమితో లోకేశ్ వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ లెక్కన లోకేశ్ రాజకీయ గమనంలో యువగళానికి ఓ కీలక అధ్యాయం ఉందని చెప్పాలి.
అలాంటి యువగళానికి సంబంధించి ఓ కాపీ టేబుల్ బుక్ రూపొందగా…దానిని మోదీతో ఆవిష్కరింపజేయించిన లోకేశ్… తొలి కాపీని మోదీకే అందజేశారు. ఈ కాపీని అందుకున్న మోదీ… అందులోని వివరాలను ఆసక్తిగా తిలకించారు. వాటి గురించి ఆయా వివరాలను లోకేశ్ ను అడిగి మరీ తెలుసుకున్నారు. లోకేశ్ పాదయాత్ర కారణంగానే ఏపీలో కూటమి రికార్డు విక్టరీని సాధించిందని కూడా మోదీ పేర్కొన్నట్లు సమాచారం. యువగళం గురించి మోదీకి వివరిస్తూ లోకేశ్ తన్మయత్వానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తన ఆహ్వానం మేరకు ఫ్యామిలీతో తన ఇంటికి వచ్చిన లోకేశ్ కు మోదీ అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. లోకేశ్, బ్రాహ్మణిని ఆత్మీయంగా పలకరించిన మోదీ…దేవాన్ష్ ను అయితే తనపై కూర్చోబెట్టుకుని ముద్దు చేశారు. ఇలా మోదీ ఇంట లోకేశ్ గంటన్నరకు పైగా అలా ఉండిపోయారు. రాష్ట్రానికి కేంద్రం సహకారాన్ని లోకేశ్ కోరగా…ఆ విషయాన్ని తనకు వదిలేయాలని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. మోదీ ఇంట లోకేశ్ ఫ్యామిలీ ఆతిథ్యానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on May 18, 2025 7:09 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…