భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసంలో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ ఫ్యామిలీ శనివారం సరదాగా గడిపింది. స్వయంగా మోదీ పలుమార్లు పిలవగా…లోేకేశ్ తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి శనివారం ఢిల్లీ వెళ్లారు. మోదీ తన అదికారిక నివాసం వేదికగా లోకేశ్ ఫ్యామిలీకి అదిరిపోయే విందు ఇచ్చారు. ప్రదాని నివాసంలో లోకేశ్ ఫ్యామిలీ దాదాపుగా గంటన్నర నుంచి రెండు గంటల పాటు గడిపింది.
ఈ సందర్భంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు లోకేశ్ యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 3 వేల కిలోమీటర్లకుపైగా సాగిన ఈ యాత్రలో లోకేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. ప్రజల కష్టసుఖాలను పంచుకున్నారు. వైసీపీ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడతానని శపథం చేశారు. అనుకున్నట్లు గానే బీజేపీ, జనసేనలతో కూడిన కూటమితో లోకేశ్ వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ లెక్కన లోకేశ్ రాజకీయ గమనంలో యువగళానికి ఓ కీలక అధ్యాయం ఉందని చెప్పాలి.
అలాంటి యువగళానికి సంబంధించి ఓ కాపీ టేబుల్ బుక్ రూపొందగా…దానిని మోదీతో ఆవిష్కరింపజేయించిన లోకేశ్… తొలి కాపీని మోదీకే అందజేశారు. ఈ కాపీని అందుకున్న మోదీ… అందులోని వివరాలను ఆసక్తిగా తిలకించారు. వాటి గురించి ఆయా వివరాలను లోకేశ్ ను అడిగి మరీ తెలుసుకున్నారు. లోకేశ్ పాదయాత్ర కారణంగానే ఏపీలో కూటమి రికార్డు విక్టరీని సాధించిందని కూడా మోదీ పేర్కొన్నట్లు సమాచారం. యువగళం గురించి మోదీకి వివరిస్తూ లోకేశ్ తన్మయత్వానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తన ఆహ్వానం మేరకు ఫ్యామిలీతో తన ఇంటికి వచ్చిన లోకేశ్ కు మోదీ అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. లోకేశ్, బ్రాహ్మణిని ఆత్మీయంగా పలకరించిన మోదీ…దేవాన్ష్ ను అయితే తనపై కూర్చోబెట్టుకుని ముద్దు చేశారు. ఇలా మోదీ ఇంట లోకేశ్ గంటన్నరకు పైగా అలా ఉండిపోయారు. రాష్ట్రానికి కేంద్రం సహకారాన్ని లోకేశ్ కోరగా…ఆ విషయాన్ని తనకు వదిలేయాలని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. మోదీ ఇంట లోకేశ్ ఫ్యామిలీ ఆతిథ్యానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on May 18, 2025 7:09 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…