Political News

సుజనాకు బాబు పరామర్శ… ఏం జరిగింది?

టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ లో బీజేపీ కీలక నేత, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా శరీరాన్ని శాలువాతో కప్పుకుని వచ్చిన సుజనాను బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబు అడగడంతో తన శాలువాను కుడి చేతిపైకి ఎత్తి చూపుతున్న సుజనా అందులో కనిపిస్తున్నారు.

పూర్వాశ్రమంలో సుజనా కూడా టీడీపీ నేతగానే ఉన్నారు. అసలు ఆయన టీడీపీతోనే రాజకీయం మొదలుపెట్టారు. ఫక్తు వ్యాపార వేత్త అయిన సుజనా… చంద్రబాబు అడుగులో అడుగులు వేస్తూ రాజకీయాల్లో ఎదిగారు. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో తన లెక్కలేవో తాను వేసుకున్న సుజనా… టీడీపీకి చెందిన మరో ముగ్గురు ఎంపీలతో కలిసి బీజేపీలో చేరిపోయారు. అయితే బీజేపీలో చేరినా ఆయన నిత్యం బాబుతో టచ్ లోనూ ఉంటున్నారు..

అయినా ఇప్పుడు సుజనాను బాబు ఎందుకు పరామర్శించాల్సి వచ్చిందంటే.. వ్యాపార పనులో, వ్యక్తిగత పనులో తెలియదు గానీ… ఇటీవలే సుజనా లండన్ వెళ్లారు. ఆ టూర్ లో ఓ షాపింగ్ మాల్ కు వెళ్లిన సుజనా… పట్టుతప్పి కింద పడిపోయారు. ఈ కిందపడటంలో ఆయన కుడి భుజానికి తీవ్ర గాయమే అయ్యింది. అయితే ఈ గాయానికి లండన్ లో ప్రాథమిక చికిత్స తీసుకున్న సుజనా… పూర్తి స్థాయి చికిత్స కోసం ఉన్నపళంగా హైదరాబాద్ లో వాలిపోయారు.

ఇదంతా జరిగి చాలా రోజులే అవుతోంది. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో సుజనా తన కుడి భుజానికి ఏకంగా సర్జరీనే చేయించుకున్నారు. అనంతరం ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన సుజనా కోలుకుంటున్నారు. ఈ విషయం ఇదివరకే తెలిసిన చంద్రబాబు శనివారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సుజనాను ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

13 minutes ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

45 minutes ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

51 minutes ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

1 hour ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

2 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

4 hours ago