ఏపీలోని పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర.. ఇక్కడి ఎమ్మార్వో(తహసీల్దార్)కు వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తనను బూతులు తిట్టాడని పేర్కొంటూ.. తహసీల్దార్ జయలక్ష్మి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వాట్సాప్ కాల్ చేసి.. బండ బూతులు తిట్టాడని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే.. ఇలా ఎందుకు తిట్టాల్సి వచ్చింది? అసలు తెరవెనుక ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం ఎమ్మార్వో చెప్పలేదు.
ఇక, శనివారం ఉదయం మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే విజయచంద్ర.. విషయం చెప్పుకొచ్చారు. రైతుల నుంచి ఎమ్మార్వో లంచాలు తీసుకున్నారని.. ఇద్దరే రైతుల నుంచి 10 లక్షల చొప్పున డిమాండ్ చేశారని తెలిపారు. అయితే.. ఇంత పెద్ద మొత్తం లంచాలు తీసుకుని కూడా ఆమె పనులు చేయకుండా రైతులను వేధిస్తున్నారన్నారు. దీనికి సంబంధించి రైతులు తనకు ఫిర్యాదు చేశారని, అందుకే ఎమ్మార్వో కు పోన్ చేసి మందలించానన్నారు. ఈ క్రమంలో తిట్టిన మాట వాస్తవమేనని చెప్పారు.
అంతేకాదు.. అసలు ఎమ్మార్వోకు మతిస్థిమితం లేదని, ఆమెను తక్షణం విశాఖపట్నం ఆసుపత్రిలో చే ర్పించాలని .. ఉద్యోగం నుంచి తీసేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే.. ఎమ్మార్వో వర్సెస్ ఎమ్మెల్యే వివాదంపై పరిష్కారం చూపించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో జిల్లా మంత్రి గుమ్మిడి సుధారాణి ఈ విషయాన్ని పరిశీలించేలా సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా.. ఎమ్మెల్యేనే లంచాలు తీసుకుంటున్నారని జయలక్ష్మి ఆరోపించడం గమనార్హం.
ఇదిలావుంటే.. మండలస్థాయి అధికారి లంచాలు తీసుకుంటున్నట్టు ఆరోపిస్తున్న ఎమ్మెల్యే… అసలు ఇప్పటి వరకు ఏం చేశారన్నది ప్రశ్నగా మారింది. ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఎక్కడా రూపాయి కూడా తీసుకోకుండా పనులు చేయాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కానీ, స్వయంగా ఎమ్మెల్యేనే లంచాలు తీసుకుంటున్నారని.. ఎమ్మార్వో, కాదు ఎమ్వార్వోనే లంచావతారం గా మారారని ఎమ్మెల్యే పరస్పరం ఆరోపించుకోవడం ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది.
This post was last modified on May 17, 2025 3:35 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…