Political News

ఎమ్మార్వో 10 ల‌క్ష‌లు తీసుకుంది.. అందుకే తిట్టా: ఎమ్మెల్యే

ఏపీలోని పార్వ‌తీపురం ఎమ్మెల్యే బోనేల విజ‌య‌చంద్ర‌.. ఇక్క‌డి ఎమ్మార్వో(త‌హ‌సీల్దార్‌)కు వివాదం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యే త‌న‌ను బూతులు తిట్టాడ‌ని పేర్కొంటూ.. త‌హ‌సీల్దార్ జ‌య‌ల‌క్ష్మి నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌కు వాట్సాప్ కాల్ చేసి.. బండ బూతులు తిట్టాడ‌ని.. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. అయితే.. ఇలా ఎందుకు తిట్టాల్సి వ‌చ్చింది? అస‌లు తెర‌వెనుక ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని మాత్రం ఎమ్మార్వో చెప్ప‌లేదు.

ఇక‌, శ‌నివారం ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన ఎమ్మెల్యే విజ‌య‌చంద్ర‌.. విష‌యం చెప్పుకొచ్చారు. రైతుల నుంచి ఎమ్మార్వో లంచాలు తీసుకున్నార‌ని.. ఇద్ద‌రే రైతుల నుంచి 10 ల‌క్ష‌ల చొప్పున డిమాండ్ చేశార‌ని తెలిపారు. అయితే.. ఇంత పెద్ద మొత్తం లంచాలు తీసుకుని కూడా ఆమె ప‌నులు చేయ‌కుండా రైతుల‌ను వేధిస్తున్నార‌న్నారు. దీనికి సంబంధించి రైతులు త‌న‌కు ఫిర్యాదు చేశార‌ని, అందుకే ఎమ్మార్వో కు పోన్ చేసి మంద‌లించాన‌న్నారు. ఈ క్ర‌మంలో తిట్టిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు.

అంతేకాదు.. అస‌లు ఎమ్మార్వోకు మ‌తిస్థిమితం లేద‌ని, ఆమెను త‌క్ష‌ణం విశాఖ‌ప‌ట్నం ఆసుప‌త్రిలో చే ర్పించాల‌ని .. ఉద్యోగం నుంచి తీసేయాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలావుంటే.. ఎమ్మార్వో వ‌ర్సెస్ ఎమ్మెల్యే వివాదంపై ప‌రిష్కారం చూపించాల‌ని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయ‌కులు ప్ర‌భుత్వాన్ని కోరారు. దీంతో జిల్లా మంత్రి గుమ్మిడి సుధారాణి ఈ విష‌యాన్ని ప‌రిశీలించేలా సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. కాగా.. ఎమ్మెల్యేనే లంచాలు తీసుకుంటున్నార‌ని జ‌య‌ల‌క్ష్మి ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే.. మండ‌ల‌స్థాయి అధికారి లంచాలు తీసుకుంటున్న‌ట్టు ఆరోపిస్తున్న ఎమ్మెల్యే… అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేశార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న నేప‌థ్యంలో ఎక్క‌డా రూపాయి కూడా తీసుకోకుండా ప‌నులు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. కానీ, స్వ‌యంగా ఎమ్మెల్యేనే లంచాలు తీసుకుంటున్నార‌ని.. ఎమ్మార్వో, కాదు ఎమ్వార్వోనే లంచావ‌తారం గా మారార‌ని ఎమ్మెల్యే ప‌ర‌స్ప‌రం ఆరోపించుకోవడం ప్ర‌భుత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది.

This post was last modified on May 17, 2025 3:35 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago