Political News

ఎస్సీ-ఎస్టీ కేసులు.. ఇకపై అలా చెల్లవు

దళితులకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ఎస్పీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండటంపై ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. నిజంగా ఈ చట్టం అసలైన బాధితులకు ఏమేర ఉపయోగపడుతోందన్న ప్రశ్న తరచుగా తలెత్తుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు ఎస్సీ, ఎస్టీలను ఉపయోగించుకుని కేసులు పెట్టించిన సందర్భాలు ఎన్నో.

అలాగే ఈ చట్టం కింద కేసులు పెట్టి కొందరు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సమాజంలో బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించాలన్న మంచి ఉద్దేశంతో తెచ్చిన ఈ చట్టాన్ని ఉపయోగించుకుని పెట్టే కేసుల్లో తప్పుడువే ఎక్కువ ఉంటున్నాయన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

నాలుగు గోడల మధ్య సాక్షులెవరూ లేని చోట ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తిని అవమానించారని, బెదిరించారని చేసే ఆరోపణలను ఎస్సీ-ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తికి, ఓ దళిత మహిళకు ఆస్తి విషయంలో గొడవలున్నాయి. దానికి సంబంధించిన కేసు నడుస్తుండగానే.. అతను తనను కులం పేరుతో దూషించాడంటూ ఎస్సీ-ఎస్టీ చట్టం కింద ఆ మహిళ కేసు పెట్టింది. ఐతే ఆస్తి గొడవ నడుస్తుండగా.. ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసు పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అక్కడ అతడికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లాడు. ఈ కేసును దృష్టిలో ఉంచుకుని సర్వోన్నత న్యాయస్థానం ఈ చట్టం విషయంలో కీలక తీర్పు వెలువరించింది.

బహిరంగ ప్రదేశాల్లో వేరే వ్యక్తులు ఉన్నపుడు దూషిస్తే, వేధిస్తేనే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టొచ్చని.. అలా కాకుండా నాలుగు గోడల మధ్య సాక్షులు లేనపుడు తమను దూషించారని, వేధించారని ఆ చట్టం కింద కేసులు పెడితే చెల్లవని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ఈ చట్టం దుర్వినియోగం తగ్గుతుందని భావిస్తున్నారు.

This post was last modified on November 6, 2020 5:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

55 minutes ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

3 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

4 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

6 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

7 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago