Political News

జ‌గ‌న్‌ వర్క్ స్టైల్ ఇలా వుంటదా?

జ‌గ‌న్ గురించి తెలిసిన వారు ఆయ‌న ‘ర్యాపిడ్ యాక్ష‌న్’ గురించి ప్ర‌స్తావిస్తున్నారు. ఏ నిర్ణ‌య‌మైనా.. జ‌గ‌న్ చాలా వేగంగా తీసుకుంటార‌ని.. దీనిలో ఎవ‌రి సూచ‌న‌లు.. స‌ల‌హాలు కూడా ఆయ‌న పాటించ‌ర‌ని చెబుతున్నారు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పుకొచ్చారు. “జ‌గ‌న్ ర్యాపిడ్ యాక్ష‌న్ వ‌ల్లే.. ఆయన చాలా న‌ష్ట‌పోయారు” అని వ్యాఖ్యానించారు.

మ‌ద్యం నుంచి ఇసుక వ‌ర‌కు వైసీపీ హ‌యాంలో వివాదాలు త‌లెత్తాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు ఉచిత ఇసుక విధానం కొన‌సాగింది. అయితే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తూనే ఉచితాన్నిర‌ద్దు చేశారు. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున ప‌డ్డారు. ఫ‌లితంగా చాలా మంది ఆక‌లి చావులు ఎదుర్కొన్నారు. కుటుంబాలు కూడా నీరుగారిపోయాయి. ఇక‌, మ‌ద్యం విధానంలోనూ స‌మూల మార్పులు చేశారు. కొత్త డిస్టిల‌రీల‌ పేరుతో త‌న వారిని ఎంపిక చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఇది పెను వివాదంగా మారింది. అయినా.. జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. పైగా ఈ విధానాలు వ‌ద్ద‌ని చెప్పినా విన ల్లేద‌ని.. ఎల్వీ చెప్పుకొచ్చారు. “అన్నా దానిపై నిర్ణ‌యం అయిపోయింది. ఇంక వేరేదేదైనా చెప్పండి” అనే వార‌ని వెల్ల‌డించేవార‌ని చెప్పుకొచ్చారు. దీంతో అధికారులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిపా రు. అంతేకాదు.. సీఎం పోస్టును కేవ‌లం ప్ర‌భుత్వ ఉద్యోగంగా ఆయ‌న చూసిన‌ట్టు తెలిపారు. ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌చ్చి.. సాయంత్రం 6 అయ్యే స‌రికి పైకి వెళ్లిపోయేవార‌ని ఎల్వీ చెప్పుకొచ్చారు.

ఒక్క అధికారుల‌తోనే కాదు.. నాయ‌కుల‌తోనూ జ‌గ‌న్ ఇదే విధంగా వ్య‌వ‌హరించార‌ని ఎల్వీ చెప్పుకొచ్చారు. రాజ‌కీయంగా త‌న ముందుకు ఒక స‌మ‌స్య వ‌చ్చింద‌ని తెలిపారు. అప్ప‌ట్లో ఓ నియోజ‌క‌వ‌ర్గంలో(పేరు చెప్ప‌లేదు) స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు.. జ‌గ‌న్ ప‌రిష్క‌రించాల‌ని అక్కడి నాయ‌కులు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని తెలిపారు. త‌ను ఆశ్చ‌ర్య‌పోయాన‌ని.. రాజ‌కీయంగా త‌ను ఆ స‌మ‌స్య ఎలా ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌శ్నిస్తే.. జ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నార‌న్నారు.

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న మీరే ప‌రిష్క‌రించాల‌ని సూచించార‌ని వారు కోర‌డం త‌న‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింద‌న్నారు. అయితే.. జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని తాను అర్ధం చేసుకుని అక్క‌డి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన‌ట్టు తెలిపారు. ఇవ‌న్నీ.. జ‌గ‌న్‌కు మంచి అనిపించినా.. జ‌నాల్లో నెగిటివిటీని బాగా పెంచాయ న్నారు. డ‌బ్బులు ఇస్తే.. ఏదో త‌న‌కు మేలు జ‌రుగుతుంద‌ని జ‌గ‌న్ అనుకున్నార‌ని.. కానీ, దూరదృష్టి లేని రాజ‌కీయం, స్థితిమతం లేద‌ని పాల‌న కార‌ణంగా ఇబ్బందులు ప‌డ్డార‌ని తెలిపారు.

Satya

Recent Posts

జానీ మాస్ట‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇటీవ‌ల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌రిగి అది మీడియా దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ…

54 minutes ago

తమన్నా నుంచి బోల్డ్ ట్రీట్

బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…

2 hours ago

మా ఇంటి బంగారం… వివాదానికి తెర?

గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…

2 hours ago

20వ రోజుకు చేరిన దీక్ష… సోనమ్ పరిస్థితేంటి?

భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…

3 hours ago

మరోసారి హామీల ప్రస్తావన తెచ్చిన సీఎం

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి పాలన చేస్తున్నామ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. గత ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ హ‌యాంలో రాష్ట్రం…

3 hours ago

స్థానికంలో లెక్కలు వేరుగా ఉంటాయి: జనసేన

త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీలోని ఆశావ‌హుల‌కు అంద‌రికీ పోటీ చేసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని జ‌న‌సేన ముఖ్య…

4 hours ago