టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్కు.. ప్రమోషన్ ఇస్తున్నారా? ఆయనకు మహానాడు వేదికగా కీలక పార్టీ పదవిని కట్టబెట్టనున్నారా? ఇదీ.. ఇప్పుడు ఏ ఇద్దరు టీడీపీ నాయకులు కలుసుకున్నా జరుగుతున్న చర్చ. అంతేకాదు.. ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ నాయకులు దీనిపైనే చర్చిస్తున్నారు. మరి ఏం జరిగింది? దీని వెనుక జరుగుతున్న చర్చకు కారణమేంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడు కావడం.. చంద్రబాబుకు 75 వసంతా లు పూర్తయ్యాక నిర్వహిస్తున్న మహానాడు కావడంతో దీనికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు.. తొలిసారి తమ ప్రత్యర్థి జగన్ ఇలాకాలో మహానాడును నిర్వహించడం కూడామరింత ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు యువగళం పాదయాత్ర ద్వారా తన శక్తిని ధారపోసిన నారా లోకేష్ వ్యవహారం కూడా చర్చనీయాంశం అయింది.
పార్టీలో ప్రస్తుతం నారా లోకేష్.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అయితే.. సమీప భవిష్యత్తులో పార్టీలో యువరక్తాన్ని మరింత పెంచాలన్నది పార్టీ వ్యూహాత్మక నిర్ణయం.. వచ్చేదంతా .. యువ నాయకత్వమేనని చెబుతున్నారు. ఇక, కొన్నాళ్లుగా నారా లోకేష్ కు కీలక పదవిని ఇవ్వాలన్న చర్చ కూడా నడుస్తోంది. దీనిపై ఎప్పటికప్పుడు చంద్రబాబు దాట వేత ధోరణినే అవలంబిస్తున్నారు. అయితే.. ఇప్పుడు సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకు 79 సంవత్సరాలు వస్తాయి.(వయసు ఎవరికైనా ఆగదు కదా!). సో.. అప్పటికి పార్టీలో మరింత ఉత్తేజంగా వ్యవహరించే నాయకుడు… అవసరం ఉంది. సో.. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు నేరుగా జాతీయ అధ్యక్షుడి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఒకవైపు చర్చ సాగుతోంది. అలా కాదు.. పార్టీలో మరో కీలక పదవిని సృష్టించి(వర్కింగ్ ప్రెసిడెంట్) దానిని అప్పగిస్తారని అంటున్నారు.
ప్రస్తుతం దీనికి మహానాడు వేదిక కానుందన్నది తమ్ముళ్ల మధ్య జోరుగా జరుగుతున్న చర్చ. తాజాగా చంద్రబాబు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి.. ఈ విషయాన్ని చెప్పారని కూడా పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on May 15, 2025 2:51 pm
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…