భారత సైనిక సత్తా ఏనాడూ.. ఏ దేశానికి కూడా తీసిపోని విధంగా ధృడంగానే సాగుతోంది. నిన్నటిదాకా అగ్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యాల స్థాయిలో సైనిక పాటవం భారత్ కు లేకపోవచ్చు. కాని ఇప్పుడలా కాదు. ఏ ఒక్క దేశానికి కూడా తీసిపోని రీతిని భారత సైనిక సత్తాను కేంద్ర ప్రభుత్వం అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా భారత సైన్యానికి అత్యధిక ప్రోత్సాహం లభించిన పాలనల్లో రెండింటిని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. వాటిలో తొలిది అలనాటి దివంగత ప్రదాన మంత్రి ఇందిరా గాంధీ నడిపిన ప్రభుత్వం కాగా… ఇప్పుడు అదికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోది.
రాజకీయ కారణాలు చూపి… ఇతరత్రా కొన్ని అసంబద్ధ నిర్ణయాలను చూపించి ఇందిరా గాంధీ పాలనను తక్కువ చేసి మాట్లాడినా… ఇందిరా గాంధీ హయాంలో భారత సైన్యం తన సత్తాను చాటింది. అంతేనా భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది కూడా ఇందిర హయాంలోనే. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లోని సైనిక స్థావరాలకు వెళ్లిన ఇందిర… భారత సైనికుల్లో ఉత్సాహాన్ని నింపేవారు. భారత రక్షణ రంగానికి కూడా ఆమె ఇతోదికంగా నిధులు కేటాయించారు. భారత సైనిక సత్తాను ఎప్పటికప్పుడు ఇనుమడించేలా కీలక చర్యలు చేపట్టారు.
ఇక తాజాగా నరేంద్ర మోదీ సర్కారు విషయానికి వస్తే… ఇందిర తర్వాత భారత సైన్యానికి ఆ స్థాయి… ఇంకా చెప్పాలంటే ఇందిర పాలన కంటే కూడాభారత సైన్యానికి అత్యధిక ప్రాధాన్యం దక్కుతోన్న కాలమిది. ఏ చిన్న అవకాశం చిక్కినా ఎంచక్కా సరిహద్దులకు వెళుతున్న మోదీ… భారత సైనికులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ పర్యటనలతో సైనికుల్లో ఆయన నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. సైనిక పాటవాన్ని పెంచే దిశగా మోదీ సర్కారు వేలాది కోట్ల నిధులను కేటాయించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఆయా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ తరహా పర్యటనల్లో బాగంగా మంగళవారం ఉదయం నరేంద్ర మోదీ పంజాబ్ లోని నియంత్రణ రేఖ వెంట ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఇటీవల కొనసాగిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ భూభాగంపైకి దూసుకెళ్లిన భారత వాయుసేన విమానాలన్నీ కూడా ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచే గాల్లోకి ఎగిరాయి. ఖచ్చితమైన లక్ష్యాలతో దూసుకు వెళ్లిన వాయుసేన విమానాలు పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలతో పాటు పాక్ సైనిక స్థావరాలను తుత్తునీయలు చేశాయి. అంతేకాకుండా భారత్ పైకి దూసుకువచ్చిన పాక్ డ్రోన్లు, షెల్ లను మన సైనికులు గాల్లోనే పేల్చేశారు. ఈ సైనికుల్లో నూతన ఉత్సాహం నింపే దిశగా ఆదంపూర్ వెళ్లిన మోదీ అక్కడ పండగ వాతావరణాన్ని నెలకొల్పారు.
This post was last modified on May 13, 2025 5:02 pm
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…