Political News

నాడు ఇందిర.. నేడు మోదీ

భారత సైనిక సత్తా ఏనాడూ.. ఏ దేశానికి కూడా తీసిపోని విధంగా ధృడంగానే సాగుతోంది. నిన్నటిదాకా అగ్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యాల స్థాయిలో సైనిక పాటవం భారత్ కు లేకపోవచ్చు. కాని ఇప్పుడలా కాదు. ఏ ఒక్క దేశానికి కూడా తీసిపోని రీతిని భారత సైనిక సత్తాను కేంద్ర ప్రభుత్వం అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా భారత సైన్యానికి అత్యధిక ప్రోత్సాహం లభించిన పాలనల్లో రెండింటిని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. వాటిలో తొలిది అలనాటి దివంగత ప్రదాన మంత్రి ఇందిరా గాంధీ నడిపిన ప్రభుత్వం కాగా… ఇప్పుడు అదికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోది.

రాజకీయ కారణాలు చూపి… ఇతరత్రా కొన్ని అసంబద్ధ నిర్ణయాలను చూపించి ఇందిరా గాంధీ పాలనను తక్కువ చేసి మాట్లాడినా… ఇందిరా గాంధీ హయాంలో భారత సైన్యం తన సత్తాను చాటింది. అంతేనా భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది కూడా ఇందిర హయాంలోనే. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లోని సైనిక స్థావరాలకు వెళ్లిన ఇందిర… భారత సైనికుల్లో ఉత్సాహాన్ని నింపేవారు. భారత రక్షణ రంగానికి కూడా ఆమె ఇతోదికంగా నిధులు కేటాయించారు. భారత సైనిక సత్తాను ఎప్పటికప్పుడు ఇనుమడించేలా కీలక చర్యలు చేపట్టారు.

ఇక తాజాగా నరేంద్ర మోదీ సర్కారు విషయానికి వస్తే… ఇందిర తర్వాత భారత సైన్యానికి ఆ స్థాయి… ఇంకా చెప్పాలంటే ఇందిర పాలన కంటే కూడాభారత సైన్యానికి అత్యధిక ప్రాధాన్యం దక్కుతోన్న కాలమిది. ఏ చిన్న అవకాశం చిక్కినా ఎంచక్కా సరిహద్దులకు వెళుతున్న మోదీ… భారత సైనికులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ పర్యటనలతో సైనికుల్లో ఆయన నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. సైనిక పాటవాన్ని పెంచే దిశగా మోదీ సర్కారు వేలాది కోట్ల నిధులను కేటాయించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఆయా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ తరహా పర్యటనల్లో బాగంగా మంగళవారం ఉదయం నరేంద్ర మోదీ పంజాబ్ లోని నియంత్రణ రేఖ వెంట ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఇటీవల కొనసాగిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ భూభాగంపైకి దూసుకెళ్లిన భారత వాయుసేన విమానాలన్నీ కూడా ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచే గాల్లోకి ఎగిరాయి. ఖచ్చితమైన లక్ష్యాలతో దూసుకు వెళ్లిన వాయుసేన విమానాలు పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలతో పాటు పాక్ సైనిక స్థావరాలను తుత్తునీయలు చేశాయి. అంతేకాకుండా భారత్ పైకి దూసుకువచ్చిన పాక్ డ్రోన్లు, షెల్ లను మన సైనికులు గాల్లోనే పేల్చేశారు. ఈ సైనికుల్లో నూతన ఉత్సాహం నింపే దిశగా ఆదంపూర్ వెళ్లిన మోదీ అక్కడ పండగ వాతావరణాన్ని నెలకొల్పారు.

This post was last modified on May 13, 2025 5:02 pm

Share

Recent Posts

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

52 minutes ago

నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…

1 hour ago

ప్యారడైజ్ దుస్తులకు ఖరీదు ఎక్కువే

సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…

3 hours ago

దర్శకుడిని దాచి పెడుతున్న దేవరాయ

ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…

4 hours ago

అర్జున్ రెడ్డిపై వంగది ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ అంటే…?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…

5 hours ago

జైలర్ వస్తున్నాడు… మరి ఆదర్శం మాటేమిటి

అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…

5 hours ago