Political News

నాడు ఇందిర.. నేడు మోదీ

భారత సైనిక సత్తా ఏనాడూ.. ఏ దేశానికి కూడా తీసిపోని విధంగా ధృడంగానే సాగుతోంది. నిన్నటిదాకా అగ్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యాల స్థాయిలో సైనిక పాటవం భారత్ కు లేకపోవచ్చు. కాని ఇప్పుడలా కాదు. ఏ ఒక్క దేశానికి కూడా తీసిపోని రీతిని భారత సైనిక సత్తాను కేంద్ర ప్రభుత్వం అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా భారత సైన్యానికి అత్యధిక ప్రోత్సాహం లభించిన పాలనల్లో రెండింటిని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. వాటిలో తొలిది అలనాటి దివంగత ప్రదాన మంత్రి ఇందిరా గాంధీ నడిపిన ప్రభుత్వం కాగా… ఇప్పుడు అదికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోది.

రాజకీయ కారణాలు చూపి… ఇతరత్రా కొన్ని అసంబద్ధ నిర్ణయాలను చూపించి ఇందిరా గాంధీ పాలనను తక్కువ చేసి మాట్లాడినా… ఇందిరా గాంధీ హయాంలో భారత సైన్యం తన సత్తాను చాటింది. అంతేనా భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది కూడా ఇందిర హయాంలోనే. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లోని సైనిక స్థావరాలకు వెళ్లిన ఇందిర… భారత సైనికుల్లో ఉత్సాహాన్ని నింపేవారు. భారత రక్షణ రంగానికి కూడా ఆమె ఇతోదికంగా నిధులు కేటాయించారు. భారత సైనిక సత్తాను ఎప్పటికప్పుడు ఇనుమడించేలా కీలక చర్యలు చేపట్టారు.

ఇక తాజాగా నరేంద్ర మోదీ సర్కారు విషయానికి వస్తే… ఇందిర తర్వాత భారత సైన్యానికి ఆ స్థాయి… ఇంకా చెప్పాలంటే ఇందిర పాలన కంటే కూడాభారత సైన్యానికి అత్యధిక ప్రాధాన్యం దక్కుతోన్న కాలమిది. ఏ చిన్న అవకాశం చిక్కినా ఎంచక్కా సరిహద్దులకు వెళుతున్న మోదీ… భారత సైనికులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ పర్యటనలతో సైనికుల్లో ఆయన నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. సైనిక పాటవాన్ని పెంచే దిశగా మోదీ సర్కారు వేలాది కోట్ల నిధులను కేటాయించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఆయా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ తరహా పర్యటనల్లో బాగంగా మంగళవారం ఉదయం నరేంద్ర మోదీ పంజాబ్ లోని నియంత్రణ రేఖ వెంట ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఇటీవల కొనసాగిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ భూభాగంపైకి దూసుకెళ్లిన భారత వాయుసేన విమానాలన్నీ కూడా ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచే గాల్లోకి ఎగిరాయి. ఖచ్చితమైన లక్ష్యాలతో దూసుకు వెళ్లిన వాయుసేన విమానాలు పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలతో పాటు పాక్ సైనిక స్థావరాలను తుత్తునీయలు చేశాయి. అంతేకాకుండా భారత్ పైకి దూసుకువచ్చిన పాక్ డ్రోన్లు, షెల్ లను మన సైనికులు గాల్లోనే పేల్చేశారు. ఈ సైనికుల్లో నూతన ఉత్సాహం నింపే దిశగా ఆదంపూర్ వెళ్లిన మోదీ అక్కడ పండగ వాతావరణాన్ని నెలకొల్పారు.

This post was last modified on May 13, 2025 5:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 minutes ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

5 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

5 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

5 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

6 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

8 hours ago