Political News

నాడు ఇందిర.. నేడు మోదీ

భారత సైనిక సత్తా ఏనాడూ.. ఏ దేశానికి కూడా తీసిపోని విధంగా ధృడంగానే సాగుతోంది. నిన్నటిదాకా అగ్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యాల స్థాయిలో సైనిక పాటవం భారత్ కు లేకపోవచ్చు. కాని ఇప్పుడలా కాదు. ఏ ఒక్క దేశానికి కూడా తీసిపోని రీతిని భారత సైనిక సత్తాను కేంద్ర ప్రభుత్వం అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా భారత సైన్యానికి అత్యధిక ప్రోత్సాహం లభించిన పాలనల్లో రెండింటిని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. వాటిలో తొలిది అలనాటి దివంగత ప్రదాన మంత్రి ఇందిరా గాంధీ నడిపిన ప్రభుత్వం కాగా… ఇప్పుడు అదికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోది.

రాజకీయ కారణాలు చూపి… ఇతరత్రా కొన్ని అసంబద్ధ నిర్ణయాలను చూపించి ఇందిరా గాంధీ పాలనను తక్కువ చేసి మాట్లాడినా… ఇందిరా గాంధీ హయాంలో భారత సైన్యం తన సత్తాను చాటింది. అంతేనా భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది కూడా ఇందిర హయాంలోనే. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లోని సైనిక స్థావరాలకు వెళ్లిన ఇందిర… భారత సైనికుల్లో ఉత్సాహాన్ని నింపేవారు. భారత రక్షణ రంగానికి కూడా ఆమె ఇతోదికంగా నిధులు కేటాయించారు. భారత సైనిక సత్తాను ఎప్పటికప్పుడు ఇనుమడించేలా కీలక చర్యలు చేపట్టారు.

ఇక తాజాగా నరేంద్ర మోదీ సర్కారు విషయానికి వస్తే… ఇందిర తర్వాత భారత సైన్యానికి ఆ స్థాయి… ఇంకా చెప్పాలంటే ఇందిర పాలన కంటే కూడాభారత సైన్యానికి అత్యధిక ప్రాధాన్యం దక్కుతోన్న కాలమిది. ఏ చిన్న అవకాశం చిక్కినా ఎంచక్కా సరిహద్దులకు వెళుతున్న మోదీ… భారత సైనికులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ పర్యటనలతో సైనికుల్లో ఆయన నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. సైనిక పాటవాన్ని పెంచే దిశగా మోదీ సర్కారు వేలాది కోట్ల నిధులను కేటాయించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఆయా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ తరహా పర్యటనల్లో బాగంగా మంగళవారం ఉదయం నరేంద్ర మోదీ పంజాబ్ లోని నియంత్రణ రేఖ వెంట ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఇటీవల కొనసాగిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ భూభాగంపైకి దూసుకెళ్లిన భారత వాయుసేన విమానాలన్నీ కూడా ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచే గాల్లోకి ఎగిరాయి. ఖచ్చితమైన లక్ష్యాలతో దూసుకు వెళ్లిన వాయుసేన విమానాలు పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలతో పాటు పాక్ సైనిక స్థావరాలను తుత్తునీయలు చేశాయి. అంతేకాకుండా భారత్ పైకి దూసుకువచ్చిన పాక్ డ్రోన్లు, షెల్ లను మన సైనికులు గాల్లోనే పేల్చేశారు. ఈ సైనికుల్లో నూతన ఉత్సాహం నింపే దిశగా ఆదంపూర్ వెళ్లిన మోదీ అక్కడ పండగ వాతావరణాన్ని నెలకొల్పారు.

This post was last modified on May 13, 2025 5:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago