ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి బహిరంగ వేదికపై స్వల్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాటలు చెప్పొద్దు.. చేతలకు రండి!’ అని ఆయన పిలుపునిచ్చారు. తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం.. సీమకు వరదాయినిగా పేర్కొనే హంద్రీనీవా పనులను పరిశీలించారు. మండు టెండలో దాదాపు గంటన్నర పాటు ప్రాజెక్టు వద్దే ఆయన ఉన్నారు. అధికారులు, ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో పూడిక తీత పనులను స్వయంగా పరిశీలించారు. వీటిని వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదిరకంగా ఎక్కువగా ఉందని.. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే కుదరదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పీ-4 పథకాన్ని తీసుకువచ్చామన్నారు. అందరూ సమాజం వల్లే పైకి వచ్చారని చెప్పారు. ‘ఇప్పుడు ఉన్నత చదువులు చదివి బాగుపడిన వారంతా.. పేదల కష్టం నుంచే ఎదిగారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ-4కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో మాటలు చెప్పుకోవడానికి ఎంతో మంది ఉన్నారని.. కానీ, చేతలకు దిగాలని సూచించారు.
రాష్ట్రంలో 2 లక్షల మంది పేదలను ఉన్నతవర్గాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. వీరంతా పేదరికంలోనే ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలను పైకి తీసుకురావడం.. ఉన్నత వర్గాలుగా ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. ‘పేదరికంలో ఉన్న 20శాతం మందికి అండగా నిలుద్దాం. సూచనలు, సలహాలే కాదు.. అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేయండి’ అని ఒకింత ఆగ్రహం ప్రదర్శిస్తూ.. వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పేదలు.. వచ్చే నాలుగేళ్ల తర్వాత.. ధనవంతులు కావాలనేదే తమ సంకల్పమని పేర్కొన్నారు.
2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని భావిస్తున్నామని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో పీ4ను ఆవిష్కరించామని.. ఇప్పటికే చాలా మందిని సంప్రదించామన్నారు. డేటాను కూడా రెడీ చేశామని చెప్పారు. త్వరలోనే మరింత పారదర్శకంగా పేదలను ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తనవంతు సాయంగా గ్రామాలను దత్తత తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత వర్గాలకు అండగా ఉంటుందని.. పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
This post was last modified on May 10, 2025 10:14 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…