ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి బహిరంగ వేదికపై స్వల్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాటలు చెప్పొద్దు.. చేతలకు రండి!’ అని ఆయన పిలుపునిచ్చారు. తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం.. సీమకు వరదాయినిగా పేర్కొనే హంద్రీనీవా పనులను పరిశీలించారు. మండు టెండలో దాదాపు గంటన్నర పాటు ప్రాజెక్టు వద్దే ఆయన ఉన్నారు. అధికారులు, ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో పూడిక తీత పనులను స్వయంగా పరిశీలించారు. వీటిని వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదిరకంగా ఎక్కువగా ఉందని.. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే కుదరదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పీ-4 పథకాన్ని తీసుకువచ్చామన్నారు. అందరూ సమాజం వల్లే పైకి వచ్చారని చెప్పారు. ‘ఇప్పుడు ఉన్నత చదువులు చదివి బాగుపడిన వారంతా.. పేదల కష్టం నుంచే ఎదిగారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ-4కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో మాటలు చెప్పుకోవడానికి ఎంతో మంది ఉన్నారని.. కానీ, చేతలకు దిగాలని సూచించారు.
రాష్ట్రంలో 2 లక్షల మంది పేదలను ఉన్నతవర్గాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. వీరంతా పేదరికంలోనే ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలను పైకి తీసుకురావడం.. ఉన్నత వర్గాలుగా ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. ‘పేదరికంలో ఉన్న 20శాతం మందికి అండగా నిలుద్దాం. సూచనలు, సలహాలే కాదు.. అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేయండి’ అని ఒకింత ఆగ్రహం ప్రదర్శిస్తూ.. వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పేదలు.. వచ్చే నాలుగేళ్ల తర్వాత.. ధనవంతులు కావాలనేదే తమ సంకల్పమని పేర్కొన్నారు.
2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని భావిస్తున్నామని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో పీ4ను ఆవిష్కరించామని.. ఇప్పటికే చాలా మందిని సంప్రదించామన్నారు. డేటాను కూడా రెడీ చేశామని చెప్పారు. త్వరలోనే మరింత పారదర్శకంగా పేదలను ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తనవంతు సాయంగా గ్రామాలను దత్తత తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత వర్గాలకు అండగా ఉంటుందని.. పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
This post was last modified on May 10, 2025 10:14 am
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…