Political News

కశ్మీర్ లోని ఏపీ విద్యార్థుల భద్రతపై ఫోకస్

భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు. పలు కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు.. ప్రత్యేకించి పాక్ తో సరిహద్దు ప్రాంతంలోని రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు మరింతగా ఇబ్బంది పడుతున్నారని చెప్పక తప్పదు. ఇలాంటి వారిలో విద్యార్థులదే అదిక శాతమని చెప్పాలి. ప్రస్తుతం కశ్మీర్ కు విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లిన వారు తీవ్ర భయాందోళనలో కూరుకుపోయారు. వారిలో ఏపీకి చెందిన వారూ ఉన్నారు.

ఈ విషయంపై ఇప్పటికే ఏపీలోని కూటమి సర్కారు తనదైన శైలి వేగవంతమైన చర్యలు చేపట్టింది. జమ్మ, కశ్మీర్ లోని పలు ప్రాంతాలకు చెందిన విద్యా సంస్థల్లో ఏపీకి చెందిన చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు. మొన్నటిదాకా పరిస్థితి బాగానే ఉన్నా… పాక్ ఉగ్రవాద ప్రేరేపిత దాడులు, అంతకుముందు పహల్ గాం ఉగ్రదాడి, తాజాగా ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు…అంతిమంగా ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకున్న నేపథ్యంలో అక్కడి మన విద్యార్థులు, ఇక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి కశ్మీర్ లోని మన విద్యార్థులను సురక్షితంగా రప్పించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఈ పనిని నంద్యాల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ యువ మహిళా నేత బైరెడ్డి శబరికి అప్పగించారు. లోకేశ్ ఆదేశాలతో నేరుగా రంగంలోకి దిగిన శబరి ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అదికారి లవ్ అగర్వాల్ కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సమన్వయం చేసుకుని విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చాలని అగర్వాల్ కు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ మొత్తం పరిస్థితిని వివరిస్తూ శుక్రవారం ఉదయం లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ కు విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లి.. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుబడిపోయిన పిల్లల గురించి వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆ ప్రకటనలో లోకేశ్ తెలిపారు. కశ్మీర్ లోని ప్రతి విద్యార్థిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. దీనికి సంబందించి జరుగుతున్న చర్యలను అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు.

This post was last modified on May 9, 2025 1:17 pm

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

2 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

2 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

2 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

3 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

3 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

3 hours ago