Political News

సేఫ్ హౌస్ లోకి పారిపోయిన పాక్ ప్రధాని

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం తన అధికారిక నివాసాన్ని వదిలి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. ఇటీవల పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను బుధవారం తెల్లవారుజామున చేపట్టిన సంగతి తెలిసిందే. తొలుత పాక్ భూభాగంలోకి ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. అయితే బుధవారం పాక్ కవ్వింపు చర్యలు మొదలెట్టింది.

పాక్ కవ్వింపు చర్యలకు దీటుగా సమాధానం చెప్పిన భారత్.. పాక్ మిస్సైళ్లతో పాటుగా ఫైటర్ జెట్లను ఆకాశంలోనూ పేల్చేసింది. అంతేకాకుండా ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్ వంటి కీలక నగరాల్లోని పాక్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ దాడులతో పాక్ నిజంగానే భీతిల్లిపోయిందనే చెప్పాలి. గురువారం కూడా పాక్ పలు దాడులు చేసేందుకు యత్నించిన భారత్ వాటిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్ తోనే పాక్ కు బుద్ధి రాదన్న భావనతో భారత్ తాజాగా అటాక్ ను కూడా షురూ చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో గురువారం రాత్రి పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పేలాయి. వాటిలో ఓ బాంబు ప్రదాని అధికారిక నివాసానికి అత్యంత సమీపంలో పేలింది. ఈ పేలుడు శబ్ధం పాక్ అదికార యంత్రాంగాన్ని తీవ్రమైన కలవరపాటుకు గుచి చేసింది. ఆ వెంటనే అదికార యంత్రాంగం సూచన మేరకు పాక్ ప్రధాని షరీఫ్ తన సేఫ్ హౌస్ కు మారిపోయారన్న కథనాలు వినిపిస్తున్నాయి. భారత్ తన యుద్ధాన్ని పూర్తి స్థాయిలో మొదలెట్టక ముందే పాక్ లో ఈ తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

22 minutes ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

33 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

2 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

3 hours ago