Political News

సేఫ్ హౌస్ లోకి పారిపోయిన పాక్ ప్రధాని

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం తన అధికారిక నివాసాన్ని వదిలి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. ఇటీవల పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను బుధవారం తెల్లవారుజామున చేపట్టిన సంగతి తెలిసిందే. తొలుత పాక్ భూభాగంలోకి ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. అయితే బుధవారం పాక్ కవ్వింపు చర్యలు మొదలెట్టింది.

పాక్ కవ్వింపు చర్యలకు దీటుగా సమాధానం చెప్పిన భారత్.. పాక్ మిస్సైళ్లతో పాటుగా ఫైటర్ జెట్లను ఆకాశంలోనూ పేల్చేసింది. అంతేకాకుండా ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్ వంటి కీలక నగరాల్లోని పాక్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ దాడులతో పాక్ నిజంగానే భీతిల్లిపోయిందనే చెప్పాలి. గురువారం కూడా పాక్ పలు దాడులు చేసేందుకు యత్నించిన భారత్ వాటిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్ తోనే పాక్ కు బుద్ధి రాదన్న భావనతో భారత్ తాజాగా అటాక్ ను కూడా షురూ చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో గురువారం రాత్రి పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పేలాయి. వాటిలో ఓ బాంబు ప్రదాని అధికారిక నివాసానికి అత్యంత సమీపంలో పేలింది. ఈ పేలుడు శబ్ధం పాక్ అదికార యంత్రాంగాన్ని తీవ్రమైన కలవరపాటుకు గుచి చేసింది. ఆ వెంటనే అదికార యంత్రాంగం సూచన మేరకు పాక్ ప్రధాని షరీఫ్ తన సేఫ్ హౌస్ కు మారిపోయారన్న కథనాలు వినిపిస్తున్నాయి. భారత్ తన యుద్ధాన్ని పూర్తి స్థాయిలో మొదలెట్టక ముందే పాక్ లో ఈ తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on May 9, 2025 10:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

46 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

1 hour ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

1 hour ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago