Political News

సేఫ్ హౌస్ లోకి పారిపోయిన పాక్ ప్రధాని

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం తన అధికారిక నివాసాన్ని వదిలి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. ఇటీవల పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను బుధవారం తెల్లవారుజామున చేపట్టిన సంగతి తెలిసిందే. తొలుత పాక్ భూభాగంలోకి ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. అయితే బుధవారం పాక్ కవ్వింపు చర్యలు మొదలెట్టింది.

పాక్ కవ్వింపు చర్యలకు దీటుగా సమాధానం చెప్పిన భారత్.. పాక్ మిస్సైళ్లతో పాటుగా ఫైటర్ జెట్లను ఆకాశంలోనూ పేల్చేసింది. అంతేకాకుండా ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్ వంటి కీలక నగరాల్లోని పాక్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ దాడులతో పాక్ నిజంగానే భీతిల్లిపోయిందనే చెప్పాలి. గురువారం కూడా పాక్ పలు దాడులు చేసేందుకు యత్నించిన భారత్ వాటిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్ తోనే పాక్ కు బుద్ధి రాదన్న భావనతో భారత్ తాజాగా అటాక్ ను కూడా షురూ చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో గురువారం రాత్రి పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పేలాయి. వాటిలో ఓ బాంబు ప్రదాని అధికారిక నివాసానికి అత్యంత సమీపంలో పేలింది. ఈ పేలుడు శబ్ధం పాక్ అదికార యంత్రాంగాన్ని తీవ్రమైన కలవరపాటుకు గుచి చేసింది. ఆ వెంటనే అదికార యంత్రాంగం సూచన మేరకు పాక్ ప్రధాని షరీఫ్ తన సేఫ్ హౌస్ కు మారిపోయారన్న కథనాలు వినిపిస్తున్నాయి. భారత్ తన యుద్ధాన్ని పూర్తి స్థాయిలో మొదలెట్టక ముందే పాక్ లో ఈ తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on May 9, 2025 10:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 minutes ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

5 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

5 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

5 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

6 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

8 hours ago