Political News

ఇకపై ప్రజలకు తెలిసేలా న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు

భారత న్యాయవ్యవస్థలో పారదర్శకత పెంపొందించేందుకు సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఇకపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో నిరంతరం అప్‌డేట్ చేస్తూ ప్రజల ఆంతర్యానికి అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు 2025 ఏప్రిల్ 1 ఫుల్ కోర్ట్ సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని తాజాగా మీడియాకు వెల్లడించింది.

ఈ నిర్ణయంతో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా, న్యాయమూర్తులపై అనవసర ఆరోపణలకు చెక్ వేయవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 21 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను ఇప్పటికే సమర్పించగా, మిగతా న్యాయమూర్తుల వివరాలను అందిన వెంటనే అప్‌లోడ్ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు.

ఇది పూర్తిగా తప్పనిసరిగా మార్చిన మొదటి చారిత్రాత్మక నిర్ణయంగా నిలవనుంది. గతంలోనూ ఇదే అంశంపై తీర్మానాలు చేసినా అవి స్వచ్ఛంద పద్ధతిలో కొనసాగాయి. 1997లో మొదటిసారి న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను గోప్యంగా ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలన్న నియమం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత 2009లో స్వచ్ఛందంగా వెబ్‌సైట్‌లో పొందుపర్చే అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియను కట్టుబాటుగా మార్చారు.

ఇదొక వినూత్న మార్గదర్శక నిర్ణయంగా భావించబడుతోంది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ విశ్వాసానికి బలమివ్వాలంటే, ఈ విధంగా పారదర్శక చర్యలు తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ విధానం ఇతర న్యాయస్థానాలకూ స్ఫూర్తిగా మారే అవకాశం ఉంది.

This post was last modified on May 7, 2025 4:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 minutes ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

5 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

5 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

5 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

6 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

8 hours ago