ఏపీ సీఎం చంద్రబాబు.. హిందువుల చిరకాల కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా హిందువులకు చెందిన ధార్మిక సంస్థలు.. తమకు నామినేషన్ పద్ధలితో వనరులు కల్పించాలని కోరుతున్నాయి. అయితే.. ఇది న్యాయపరమైన వివాదాలకు దారి తీస్తుందన్న ఉద్దేశంతో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. పైగా.. ఎవరూ సాహసం కూడా చేయలేదు. ఇతర మతాలవారు కూడా ఇలానే డిమాండ్ చేస్తారన్న ఉద్దేశం కూడా ఉంది.
దీంతో హిందూ ధార్మిక సంస్థలు, మఠాలకు చెందిన వారు కూడా.. మౌనంగా ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. హిందువులను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో ప్రధానంగా భూముల కేటాయింపు ఉంది. మఠాలు, ధార్మిక, స్వచ్ఛంద హిందూ సంస్థలు.. తమకు భూములు కల్పించాలని.. నామినేషన్ విధానంలో ఇవ్వాలని కోరుతున్నాయి. కానీ, ఇది సాకారం కావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కొందరు ప్రతిపాదించారు.
తమకు భూములు కేటాయించాలని.. తాము స్వచ్ఛంగా హిందూ వర్గాలకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం చేయించిన పవన్ కల్యాణ్.. ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా… 20సంవత్సరాలుగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు… బహిరంగ వేలం ద్వారా కాకుండా… నేరుగా లీజు /లైసెన్స్ ద్వారా భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది.
దీనికి సంబంధించిన జీవోను మంగళవారం విడుదల చేశారు. ధార్మిక సంస్థలు, మఠాలు 20 ఏళ్లుగా ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉండాలని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందించాలని దానిలో పేర్కొన్నారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో సాయం అందించిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. కాగా, ఈ నిబంధనల సవరణలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే… జూన్ 1వ తేదీ లోపు దేవాదాయశాఖ కార్యదర్శికి తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చునని జీవో లో పేర్కొన్నారు.
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…