Political News

ప‌వ‌న్ సిఫార‌సు ఓకె చెప్పిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. హిందువుల చిర‌కాల కోరిక‌ను తీర్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాదాపు ఐదు ద‌శాబ్దాల‌కు పైగా హిందువుల‌కు చెందిన ధార్మిక సంస్థ‌లు.. త‌మ‌కు నామినేష‌న్ ప‌ద్ధ‌లితో వ‌న‌రులు క‌ల్పించాలని కోరుతున్నాయి. అయితే.. ఇది న్యాయ‌ప‌ర‌మైన వివాదాల‌కు దారి తీస్తుంద‌న్న ఉద్దేశంతో ఏ ప్ర‌భుత్వం కూడా ప‌ట్టించుకోలేదు. పైగా.. ఎవ‌రూ సాహ‌సం కూడా చేయ‌లేదు. ఇత‌ర మ‌తాలవారు కూడా ఇలానే డిమాండ్ చేస్తార‌న్న ఉద్దేశం కూడా ఉంది.

దీంతో హిందూ ధార్మిక సంస్థ‌లు, మ‌ఠాల‌కు చెందిన వారు కూడా.. మౌనంగా ఉన్నారు. అందుకే ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడ‌ల్లా.. హిందువుల‌ను ప‌ట్టించుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో ప్ర‌ధానంగా భూముల కేటాయింపు ఉంది. మ‌ఠాలు, ధార్మిక‌, స్వ‌చ్ఛంద హిందూ సంస్థ‌లు.. త‌మ‌కు భూములు క‌ల్పించాల‌ని.. నామినేష‌న్ విధానంలో ఇవ్వాల‌ని కోరుతున్నాయి. కానీ, ఇది సాకారం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కొంద‌రు ప్ర‌తిపాదించారు.

త‌మ‌కు భూములు కేటాయించాల‌ని.. తాము స్వ‌చ్ఛంగా హిందూ వ‌ర్గాల‌కు సేవ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. దీనిపై అధ్య‌య‌నం చేయించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా… 20సంవత్సరాలుగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు… బహిరంగ వేలం ద్వారా కాకుండా… నేరుగా లీజు /లైసెన్స్ ద్వారా భూములు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది.

దీనికి సంబంధించిన జీవోను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ధార్మిక సంస్థ‌లు, మ‌ఠాలు 20 ఏళ్లుగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో నిమ‌గ్న‌మై ఉండాల‌ని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ‌లు అందించాల‌ని దానిలో పేర్కొన్నారు. ముఖ్యంగా విప‌త్తుల స‌మ‌యంలో సాయం అందించిన వారికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. కాగా, ఈ నిబంధనల సవరణలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే… జూన్ 1వ తేదీ లోపు దేవాదాయశాఖ కార్యదర్శికి తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చున‌ని జీవో లో పేర్కొన్నారు.

This post was last modified on May 6, 2025 2:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

2 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

6 hours ago

అమ‌రావ‌తి ఆగ‌ద‌ని తెలిసీ.. జ‌గ‌న్ `రాజ‌కీయం`

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…

8 hours ago

జగిత్యాల టాక్: జీవన్ రెడ్డి రాంగ్ స్టెప్..!

జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…

8 hours ago

ఆ క‌మెడియ‌న్ కోసం వెతుకుతున్న‌ మెగా ఫ్యాన్స్

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి దూరితే.. ప‌రిణామాలు ఎలా ఉంటాయో చెప్ప‌డానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ‌. హైద‌రాబాద్‌కు…

9 hours ago

వెయ్యి కోట్ల ఒప్పందం… ముస్లిం ఓట్ల కోస‌మేనా?

దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…

9 hours ago