Political News

ప‌వ‌న్ సిఫార‌సు ఓకె చెప్పిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. హిందువుల చిర‌కాల కోరిక‌ను తీర్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాదాపు ఐదు ద‌శాబ్దాల‌కు పైగా హిందువుల‌కు చెందిన ధార్మిక సంస్థ‌లు.. త‌మ‌కు నామినేష‌న్ ప‌ద్ధ‌లితో వ‌న‌రులు క‌ల్పించాలని కోరుతున్నాయి. అయితే.. ఇది న్యాయ‌ప‌ర‌మైన వివాదాల‌కు దారి తీస్తుంద‌న్న ఉద్దేశంతో ఏ ప్ర‌భుత్వం కూడా ప‌ట్టించుకోలేదు. పైగా.. ఎవ‌రూ సాహ‌సం కూడా చేయ‌లేదు. ఇత‌ర మ‌తాలవారు కూడా ఇలానే డిమాండ్ చేస్తార‌న్న ఉద్దేశం కూడా ఉంది.

దీంతో హిందూ ధార్మిక సంస్థ‌లు, మ‌ఠాల‌కు చెందిన వారు కూడా.. మౌనంగా ఉన్నారు. అందుకే ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడ‌ల్లా.. హిందువుల‌ను ప‌ట్టించుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో ప్ర‌ధానంగా భూముల కేటాయింపు ఉంది. మ‌ఠాలు, ధార్మిక‌, స్వ‌చ్ఛంద హిందూ సంస్థ‌లు.. త‌మ‌కు భూములు క‌ల్పించాల‌ని.. నామినేష‌న్ విధానంలో ఇవ్వాల‌ని కోరుతున్నాయి. కానీ, ఇది సాకారం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కొంద‌రు ప్ర‌తిపాదించారు.

త‌మ‌కు భూములు కేటాయించాల‌ని.. తాము స్వ‌చ్ఛంగా హిందూ వ‌ర్గాల‌కు సేవ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. దీనిపై అధ్య‌య‌నం చేయించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా… 20సంవత్సరాలుగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు… బహిరంగ వేలం ద్వారా కాకుండా… నేరుగా లీజు /లైసెన్స్ ద్వారా భూములు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది.

దీనికి సంబంధించిన జీవోను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ధార్మిక సంస్థ‌లు, మ‌ఠాలు 20 ఏళ్లుగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో నిమ‌గ్న‌మై ఉండాల‌ని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ‌లు అందించాల‌ని దానిలో పేర్కొన్నారు. ముఖ్యంగా విప‌త్తుల స‌మ‌యంలో సాయం అందించిన వారికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. కాగా, ఈ నిబంధనల సవరణలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే… జూన్ 1వ తేదీ లోపు దేవాదాయశాఖ కార్యదర్శికి తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చున‌ని జీవో లో పేర్కొన్నారు.

This post was last modified on May 6, 2025 2:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

20 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago