ఏపీ సీఎం చంద్రబాబు.. హిందువుల చిరకాల కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా హిందువులకు చెందిన ధార్మిక సంస్థలు.. తమకు నామినేషన్ పద్ధలితో వనరులు కల్పించాలని కోరుతున్నాయి. అయితే.. ఇది న్యాయపరమైన వివాదాలకు దారి తీస్తుందన్న ఉద్దేశంతో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. పైగా.. ఎవరూ సాహసం కూడా చేయలేదు. ఇతర మతాలవారు కూడా ఇలానే డిమాండ్ చేస్తారన్న ఉద్దేశం కూడా ఉంది.
దీంతో హిందూ ధార్మిక సంస్థలు, మఠాలకు చెందిన వారు కూడా.. మౌనంగా ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. హిందువులను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో ప్రధానంగా భూముల కేటాయింపు ఉంది. మఠాలు, ధార్మిక, స్వచ్ఛంద హిందూ సంస్థలు.. తమకు భూములు కల్పించాలని.. నామినేషన్ విధానంలో ఇవ్వాలని కోరుతున్నాయి. కానీ, ఇది సాకారం కావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కొందరు ప్రతిపాదించారు.
తమకు భూములు కేటాయించాలని.. తాము స్వచ్ఛంగా హిందూ వర్గాలకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం చేయించిన పవన్ కల్యాణ్.. ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా… 20సంవత్సరాలుగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు… బహిరంగ వేలం ద్వారా కాకుండా… నేరుగా లీజు /లైసెన్స్ ద్వారా భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది.
దీనికి సంబంధించిన జీవోను మంగళవారం విడుదల చేశారు. ధార్మిక సంస్థలు, మఠాలు 20 ఏళ్లుగా ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉండాలని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందించాలని దానిలో పేర్కొన్నారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో సాయం అందించిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. కాగా, ఈ నిబంధనల సవరణలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే… జూన్ 1వ తేదీ లోపు దేవాదాయశాఖ కార్యదర్శికి తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చునని జీవో లో పేర్కొన్నారు.
This post was last modified on May 6, 2025 2:13 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…