Political News

అదిరిపోయేలా ‘మ‌హానాడు’.. ఈ ద‌ఫా మార్పు ఇదే!

టీడీపీకి ప్రాణ స‌మాన‌మైన కార్య‌క్ర‌మం ఏదైనా ఉంటే.. అది మ‌హానాడే. దివంగ‌త ముఖ్య‌మంత్రి, తెలుగువారిఅన్న‌గారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని.. దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా ఈ మ‌హానాడును నిర్విరామంగా నిర్వ‌హిస్తున్నారు. ఒక్క క‌రోనా స‌మ‌యంలోనే వ‌ర్చువ‌ల్‌గా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇక‌, పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మ‌హానాడుకు భారీ ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. కాగా.. ఈ సారి నిర్వ‌హించే మ‌హానాడుకు రెండు ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయ‌ని పార్టీనాయ‌కులు చెబుతున్నారు. దీంతో మ‌హానాడును మ‌రింత సంబ‌రంగా నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు.

1) పార్టీ అధినేత చంద్ర‌బాబుకు 75 వ‌సంతాలుపూర్తి అయిన నేప‌థ్యంలో జ‌రుగుతున్న మ‌హానాడు కావ‌డం. 2) కూట‌మి స‌ర్కారుకు బ‌ల‌మైన మ‌ద్ద‌తు ద‌క్క‌డం.. మ‌రో ప‌దేళ్ల‌పాటు అధికారంపై ఎలాంటి సందేహాలు లేక‌పోవ‌డం. ఈ రెండు అంశాలు బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో మ‌హానాడుకు ఈ ద‌ఫా ప్రాధాన్యం మ‌రింత పెరిగింద‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ హిస్ట‌రీలో మ‌రీ ముఖ్యంగా మ‌హానాడు చ‌రిత్ర‌లో తొలిసారి క‌డ‌ప‌లో నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో దీనిని మ‌రింత ప్ర‌తిష్టా త్మ‌కంగా తీసుకోనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర జిల్లాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. క‌డ‌ప‌లో పార్టీ వీక్‌గానే ఉంది.

అలాంటిది గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ పుంజుకుని..క‌డ‌ప‌లోనూ కొంత మేర‌కు చొచ్చుకుపోయింది. కీల‌మైన క‌మ‌లాపురం, క‌డ‌ప స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైకిల్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రింత‌గా పార్టీని బ‌లోపేతం చేసేందుకు.. ముఖ్యంగా క‌డ‌ప‌లో వైసీపీ హ‌వాకు బ్రేకులు వేసేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇలా.. ప‌లు కార‌ణాల నేప‌థ్యంలో ఈ సారి మ‌హానాడుకు మ‌రింత ప్రాధాన్యం ఏర్ప‌డింద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు. ఇక‌, మ‌హానాడు ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తే.. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించేవారు. పార్టీ త‌ర‌ఫున కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించే అవ‌కాశం ఇచ్చారు.

కానీ, ఈ సారి మాత్రం మండ‌ల స్థాయి నుంచి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను మొబిలైజ్ చేస్తున్నారు. సుమారు 5 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇక‌, మ‌హానాడుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు 7 సార్లు చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హించారు. ఐటీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కుప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదేవిధంగా క‌డ‌ప ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఏ ర్పాట్లు చేసే బాధ్య‌త భుజాన పెట్టారు. అయితే.. మ‌రిన్నిక‌మిటీల‌ను వేయాల్సి ఉంది. భోజ‌నాలు, అతిథుల‌ను ఆహ్వానించ‌డం, వ‌స‌తి ఏర్పాట్లు చేయ‌డం, కార్య‌క‌ర్త‌లకు సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డం వంటి కీల‌క బాధ్య‌త‌ల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

36 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago