Political News

ప‌ది నెల్ల‌లో మూడు సార్లు ఏపీకి మోడీ.. మ‌రి జ‌గ‌న్‌.. !

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మూడు సార్లు ఏపీకి వచ్చారు. అంటే.. కేవ‌లం ప‌ది మాసాల వ్య‌వధిలోనే ప్ర‌ధాని మూడు సార్లు.. రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఇదేమీ చిన్న విజ‌యం కాదు. సొంతగా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల‌కే ఆయ‌న ఐదేళ్ల‌లో రెండు నుంచి మూడు సార్లు మాత్ర‌మే ప‌ర్య‌టిస్తున్నారు. అలాంటిది.. ఏపీలో ప‌ది మాసాలు కాకుండానే మూడు సార్లు వ‌చ్చారు. తొలిసారి చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న‌ప్పుడు వ‌చ్చారు.

రెండోసారి విశాఖప‌ట్నంలో ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించేందుకు వ‌చ్చారు. ఇప్పుడు మూడోసారి అమరావ‌తిలో రాజ‌ధాని ప‌నులు తిరిగి ప్రారంభించేందుకు వ‌చ్చారు. ఇదంతా.. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల ఖాతాలోనే ప‌డింది. వారి చొర‌వ‌, మోడీ ద‌గ్గ‌ర వారికి ఉన్న అనుబంధం కార‌ణంగానే ప్ర‌ధాని ఇలా కేవ‌లం 10 నెల‌ల కాలంలో ఏపీకి వ‌చ్చార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ.. జ‌గ‌న్ హ‌యాంలో ఐదేళ్ల కాలంలో ఒక్క‌సారి మాత్ర‌మే మోడీ వ‌చ్చారు.

దీనికి కార‌ణాలేంటి? అనేది స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తున్న ప్ర‌శ్న‌. పాల‌న పరంగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణ‌యాలేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. నిజానికి కేంద్రం నుంచి మంత్రులు , ప్ర‌ధాని ఒక రాష్ట్రానికి రావాలంటే.. వ్య‌క్తిగ‌తంగా వారికి అవ‌స‌రాలు ఉండాలి. అది ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్ప‌.. దీనికి ముందు.. త‌ర్వాత‌.. వారికి ఉండ‌వు. ఇక‌, రెండోది.. పాల‌న ప‌రంగా రాష్ట్రంలో కొంత మెరుగైన తీరు క‌నిపించాలి. ఇదే ఇప్పుడు ఏపీకి ప్ర‌ధానిని వ‌చ్చేలా చేసింద‌ని అంటున్నారు.

జ‌గ‌న్ పాల‌న‌ను తీసుకుంటే.. జాతీయ స్థాయి వ‌ర‌కు.. ఆయ‌న తీసుకున్న మిడిమేళ‌పు నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం అయ్యాయి. మూడు రాజ‌ధానులు.. ఎస్సీల‌పై దాడులు చేసి.. వారిపైనే ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్ట‌డం.. అప్పులు చేసి సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసి అదే గొప్ప అని భావించ‌డం.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాకుండా.. తాడేప‌ల్లికే ప‌రిమితం కావ‌డం వంటివి ప్ర‌ధాని మోడీకి కూడా చిరాకు తెప్పించాయి.

అయితే.. ఆయ‌న ఎక్క‌డా నేరుగా విమ‌ర్శించ‌క‌పోయినా.. మ‌న‌సు మాత్రం పెట్ట‌లేక పోయారు. అందుకే జ‌గ‌న్ హ‌యాంలో కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే వ‌చ్చి.. వెళ్లిపోయార‌ని.. కానీ.. కూట‌మి స‌ర్కారు చేస్తున్న పాల‌న‌, పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌,జ‌వాబుదారీ తనం వంటివి మోడీని ఆక‌ర్షిస్తున్నాయ‌ని.. అందుకే.. ఆయ‌న ఇన్ని సార్లు ఏపీలో ప‌ర్య‌టించార‌ని చెబుతున్నారు.

This post was last modified on May 4, 2025 2:36 pm

Share
Show comments

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago