రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు సార్లు ఏపీకి వచ్చారు. అంటే.. కేవలం పది మాసాల వ్యవధిలోనే ప్రధాని మూడు సార్లు.. రాష్ట్రంలో పర్యటించారు. ఇదేమీ చిన్న విజయం కాదు. సొంతగా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలకే ఆయన ఐదేళ్లలో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే పర్యటిస్తున్నారు. అలాంటిది.. ఏపీలో పది మాసాలు కాకుండానే మూడు సార్లు వచ్చారు. తొలిసారి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వచ్చారు.
రెండోసారి విశాఖపట్నంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వచ్చారు. ఇప్పుడు మూడోసారి అమరావతిలో రాజధాని పనులు తిరిగి ప్రారంభించేందుకు వచ్చారు. ఇదంతా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఖాతాలోనే పడింది. వారి చొరవ, మోడీ దగ్గర వారికి ఉన్న అనుబంధం కారణంగానే ప్రధాని ఇలా కేవలం 10 నెలల కాలంలో ఏపీకి వచ్చారన్న చర్చ జరుగుతోంది. కానీ.. జగన్ హయాంలో ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే మోడీ వచ్చారు.
దీనికి కారణాలేంటి? అనేది సహజంగానే తెరమీదికి వస్తున్న ప్రశ్న. పాలన పరంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలేనని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి కేంద్రం నుంచి మంత్రులు , ప్రధాని ఒక రాష్ట్రానికి రావాలంటే.. వ్యక్తిగతంగా వారికి అవసరాలు ఉండాలి. అది ఎన్నికల సమయంలో తప్ప.. దీనికి ముందు.. తర్వాత.. వారికి ఉండవు. ఇక, రెండోది.. పాలన పరంగా రాష్ట్రంలో కొంత మెరుగైన తీరు కనిపించాలి. ఇదే ఇప్పుడు ఏపీకి ప్రధానిని వచ్చేలా చేసిందని అంటున్నారు.
జగన్ పాలనను తీసుకుంటే.. జాతీయ స్థాయి వరకు.. ఆయన తీసుకున్న మిడిమేళపు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. మూడు రాజధానులు.. ఎస్సీలపై దాడులు చేసి.. వారిపైనే ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం.. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అదే గొప్ప అని భావించడం.. ప్రజల మధ్యకు రాకుండా.. తాడేపల్లికే పరిమితం కావడం వంటివి ప్రధాని మోడీకి కూడా చిరాకు తెప్పించాయి.
అయితే.. ఆయన ఎక్కడా నేరుగా విమర్శించకపోయినా.. మనసు మాత్రం పెట్టలేక పోయారు. అందుకే జగన్ హయాంలో కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చి.. వెళ్లిపోయారని.. కానీ.. కూటమి సర్కారు చేస్తున్న పాలన, పెట్టుబడుల ఆకర్షణ,జవాబుదారీ తనం వంటివి మోడీని ఆకర్షిస్తున్నాయని.. అందుకే.. ఆయన ఇన్ని సార్లు ఏపీలో పర్యటించారని చెబుతున్నారు.
This post was last modified on May 4, 2025 2:36 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…