Political News

చంద్ర‌బాబు ‘పీ-4’ కోసం ప‌ని చేస్తారా? అయితే రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌పిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుక‌దా! పేద‌ల‌ను ధ‌నికులుగా చేయాలన్నది ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం. ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్స్‌-పార్ట‌న‌ర్ షిప్‌గా పేర్కొనే ‘పీ-4’ ద్వారా వ‌చ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని 20 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను ధ‌నికులుగా చేయాల‌ని చంద్ర‌బాబు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. గ‌త నెల‌లో విస్తృతంగా ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌చారం కూడా క‌ల్పించారు.

స‌మాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు.. పేద‌ల కుటుంబాల‌కు సాయం చేయ‌డం ద్వారా రా ష్ట్రంలో పేద‌రికాన్ని త‌గ్గించ‌వ‌చ్చ‌న్న‌ది చంద్ర‌బాబు సంక‌ల్పం. సాయం పొందే కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా, సాయం చేసేవారిని ‘మార్గ‌ద‌ర్శ‌కులు’గా చంద్ర‌బాబు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా అద్భుత‌మైన జాబ్ నోటిఫికేష‌న్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

పీ-4 కోసం ప‌నిచేయ‌డ‌మే ఈ ఉద్యోగుల ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ నెల 1వ తారీకు నాటికి 40 ఏళ్ల వ‌య‌సు మించ‌ని యువ‌తీయువ‌కులు.. ఈ ఉద్యోగాల్లో చేరొచ్చు. అయితే.. ఏడాదిపాటు మాత్ర‌మే కాంట్రాక్టు ఉంటుంది. ఆ త‌ర్వాత కూడా.. ప్ర‌భుత్వానికి అవ‌స‌రం ఉంద‌ని భావిస్తే.. ప‌నితీరు ఆధారంగా కాంట్రాక్టును పొడిగిస్తారు. ఇక‌, నెల‌నెలా రూ.60000 వేత‌నంగా చెల్లిస్తారు. టీఏ, డీఏలు అద‌నంగా ఉంటాయి.

ఏం చేయాలి?

పీ-4 ఉద్యోగులు.. బంగారు కుటుంబాల‌ను గుర్తించ‌డం.. నిరంత‌రం వారిని మానిట‌రింగ్ చేయ‌డం వంటివి చేయాలి. అదేవిధంగా మార్గ‌ద‌ర్శ‌కుల‌ను కూడా గుర్తించాలి. వారిని ప్ర‌భుత్వంతో క‌లిసి ముందుకు సాగేలా ఒప్పించాలి. ఇదొక ర‌కంగా.. రిప్రెజెంటేష‌న్ త‌ర‌హా ఉద్యోగాలు. ఇవి మాన‌సిక ఆనందంతోపాటు.. పేద‌రిక నిర్మూల‌న‌లోనూ.. ఉద్యోగుల పాత్ర‌ను ప్ర‌ధానంగా మెరిసేలా చేస్తాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. 175 పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ, పీజీ చేసి, 40 ఏళ్లు మించ‌ని వారు.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి రెడీ అవ్వండి!.

This post was last modified on May 3, 2025 8:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

41 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago