ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్గా పేర్కొనే ‘పీ-4’ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని 20 లక్షల మంది పేదలను ధనికులుగా చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత నెలలో విస్తృతంగా ఈ కార్యక్రమానికి ప్రచారం కూడా కల్పించారు.
సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు.. పేదల కుటుంబాలకు సాయం చేయడం ద్వారా రా ష్ట్రంలో పేదరికాన్ని తగ్గించవచ్చన్నది చంద్రబాబు సంకల్పం. సాయం పొందే కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా, సాయం చేసేవారిని ‘మార్గదర్శకులు’గా చంద్రబాబు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
పీ-4 కోసం పనిచేయడమే ఈ ఉద్యోగుల ప్రధాన లక్ష్యం. ఈ నెల 1వ తారీకు నాటికి 40 ఏళ్ల వయసు మించని యువతీయువకులు.. ఈ ఉద్యోగాల్లో చేరొచ్చు. అయితే.. ఏడాదిపాటు మాత్రమే కాంట్రాక్టు ఉంటుంది. ఆ తర్వాత కూడా.. ప్రభుత్వానికి అవసరం ఉందని భావిస్తే.. పనితీరు ఆధారంగా కాంట్రాక్టును పొడిగిస్తారు. ఇక, నెలనెలా రూ.60000 వేతనంగా చెల్లిస్తారు. టీఏ, డీఏలు అదనంగా ఉంటాయి.
ఏం చేయాలి?
పీ-4 ఉద్యోగులు.. బంగారు కుటుంబాలను గుర్తించడం.. నిరంతరం వారిని మానిటరింగ్ చేయడం వంటివి చేయాలి. అదేవిధంగా మార్గదర్శకులను కూడా గుర్తించాలి. వారిని ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగేలా ఒప్పించాలి. ఇదొక రకంగా.. రిప్రెజెంటేషన్ తరహా ఉద్యోగాలు. ఇవి మానసిక ఆనందంతోపాటు.. పేదరిక నిర్మూలనలోనూ.. ఉద్యోగుల పాత్రను ప్రధానంగా మెరిసేలా చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. 175 పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ, పీజీ చేసి, 40 ఏళ్లు మించని వారు.. దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అవ్వండి!.
This post was last modified on May 3, 2025 8:01 pm
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…