మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ రాజధానికి సంబంధించిన కొన్ని డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చింది. రాజధాని కోసం ఏం అడగాలి అనే విధివిధానాల కోసం ‘అమరావతి క్యాపిటల్ కమిటీ’ ప్రకటించింది. ఈ క్రమంలోనే 2015లో ప్రధాని మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంను సందర్శించేందుకు వెళుతున్న షర్మిల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో, పోలీసులకు షర్మిలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. షర్మిల నివాసం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. తనను పట్టుకున్న మహిళా పోలీసులపై షర్మిల ఫైర్ అయ్యారు. చేయి తీయ్..నా మీద చేయి వేసే అధికారం మీకు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ కమిటీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకుండానే కూటమి ప్రభుత్వం భయపడుతోందని, పోలీసులతో అడ్డుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు. బయటకు రానీయకుండా ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
షర్మిల ఇంటి నుంచి బయటకు వెళ్లే దారిలో బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. అయితే, తాను కచ్చితంగా ఉద్దండరాయునిపాలెం వెళ్లి తీరుతానని, తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని షర్మిల చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో, అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…