విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. గోడపై టెంట్ పడడంతో అది కూలి దాని కింద భక్తులు సజీవ సమాధి అయ్యారు. ఈ క్రమంలోనే ఆ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని, ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడానని చంద్రబాబు తెలిపారు.
సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబసభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగావకాశం కల్పించాలని ఆదేశించారు. మంత్రులు అనిత డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ భరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్, సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ దుర్ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో గాయపడిన వారికి చికిత్స జరుగుతోందని, బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు లోకేశ్. మరోవైపు, శిథిలాలను తొలగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఆలయ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on April 30, 2025 10:45 am
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…