Political News

అమరావతికి గట్టి భద్రత కావాల్సిందే!

తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా నవ్యాంధ్రప్రదేశ్ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ తరహా పరిస్థితి శత్రు రాజ్యాలకు కూడా రాకూడదు. ఎందుకంటే… రాజధాని లేకుండా పాలన సాగించేదెలా? వ్యవస్థలను పకడ్బందీగా నిర్వహించేదెలా? రాజధాని లేని రాజ్యం తల లేని మొండెం మాదిరే కదా. ఇదే భావనతో సాగిన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన తొలి పాలనలో ఏడాది వ్యవధిలోనే ఏపీకి నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. ఐధేళ్లు తిరక్కుండానే… దానికో రూపూ తీసుకువచ్చారు. అయితే జగన్ వచ్చి రాజధాని కలను చిధ్రం చేశారు. ఇలాంటి విధ్వంసాలు జరక్కూడదంటే…అమరావతికి గట్టి భద్రత కావాల్సిందే. అంటే.,. రాజధానిగా అమరావతికి చట్టబద్ధతను తీసుకురావాల్సిందే.

ఇదే మాట చంద్రబాబు నోటా సోమవారం వినిపించింది. మే 2న రాజదాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు రాజధాని రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రాజధానిగా అమరావతికి గట్టి భద్రత కావాల్సిందేనని, జగన్ లాంటి విధ్వంసకారులు అదికారంలోకి వచ్చినా… అమరావతికి ఎలాంటి నష్టం వాటిల్లని రీతిలో పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని బాబుకు తెలిపారు. జగనే కాదు… ఇంకెవరు వచ్చినా కూడా అమరావతికి కించిత్ కూడా నష్టం జరగరాదని కూడా వారు అభిలషించారు. రైతుల వాదన విన్న చంద్రబాబు తన మదిలోని మాటను బయటపెట్టారు.

వాస్తవానికి ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం నుంచి ఓ నోటిఫికేషన్ జారీ చేయించే దిశగా ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం విభజన చట్టంలో ఎలాంటి అనుకూలతలు ఉన్నాయన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా కేంద్రం నోటిఫికేషన్ ద్వారా అమరావతికి చట్టబద్ధత దక్కేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రం వద్ద ప్రతిపాదించామన్న బాబు… తాజాగా అమరావతికి వస్తున్న మోదీ వద్ద కూడా మరోమారు ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పదేళ్ల పాటు కేంద్రం ప్రకటిస్తే.. ఆ గడువు కూడా ఇప్పటికే ముగిసిపోయిందని… ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు కేంద్రానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని ఎక్కడికక్కడే నిలిపేశారు. రాజధానిగా అమరావతిని కనుమరుగు చేసే దిశగానూ ఆయన యత్నించారు. అమరావతి స్థానంలో విశాఖను అభివృద్ధి చేసే దిశగా కుట్రలూ చేశారు. అయితే రాజధాని రైతులు ఏళ్ల తరబడి నిరసనలు చేపట్టారు. కోర్టుల్లో న్యాయ పోరాటం చేశారు. అందుబాటులో ఉన్న అన్ని అంశాలనూ వినియోగించుకుని జగన్ దూకుడుకు కళ్లెం వేశారు. అలాంటి ప్రమాదమే మరోమారు ఉద్భవించకుండా ఉండాలంటే… చంద్రబాబు, రాజధాని రైతులు చెబుతున్నట్లుగా ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసి తీరాల్సిందేనన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. ఇది జరిగితేనే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లబిస్తుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

This post was last modified on April 29, 2025 5:55 pm

Share
Show comments
Published by
Satya
Tags: Amaravati

Recent Posts

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

2 hours ago

తమ్ముళ్ళూ… బాబు గారి రెండో వైపు చూసి తట్టుకోగలరా?

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఆ పార్టీ నాయ‌కులు ఒకే కోణంలో చూస్తున్నారా?  బాబుకు రెండో కోణం కూడా ఉంద‌న్న విష‌యాన్ని…

3 hours ago

పెమ్మ‌సానికి కీల‌క బాధ్య‌త‌.. భారీ హోంవ‌ర్క్‌.. !

గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…

4 hours ago

ఇక‌… బీజేపీపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే జ‌గ‌న్‌.. !

కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుంద‌న్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…

5 hours ago

నాటి `ప్రాభ‌వం` కోల్పోతున్న బీఆర్ ఎస్‌.. రీజ‌నేంటి?

భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్‌).. ఈ పేరుకు పెద్ద ప్రాభ‌వమే ఉంది. ఒక్కొక్క‌పార్టీకి నాయ‌కుల పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…

8 hours ago

కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగి.. క‌విత గెలవగలరా?

సెంటిమెంటుకు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య స‌యామీ క‌వ‌ల‌ల‌కు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాద‌ని నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రా?  సాధ్యంకాదు. సో..…

8 hours ago