Political News

షాకింగ్: ఆ రాష్ట్రంలోనే 1000 మంది పాకిస్థానీలు!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దాయాది దేశం పాకిస్థాన్‌పై నిప్పులు చెరుగుతున్న భార‌త్‌.. మ‌న దేశంలో తిష్ట‌వేసిన పాకిస్థాన్ పౌరుల‌ను దేశం విడిచి పోవాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 30 నాటికి పాకిస్థాన్‌కు చెందిన ఏ ఒక్క‌రూ దేశంలో ఉండ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలో రాష్ట్రాల‌ను కూడా అలెర్ట్ చేసింది. ముఖ్య మంత్రుల‌కు స్వ‌యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్లు కూడా చేశారు.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి నుంచి ఆయా రాష్ట్రాల్లో పాకిస్థాన్ పౌరులు ఉంటున్న‌ట్టుగా భావిస్తున్న ప్రాంతాల‌ను పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో గుజ‌రాత్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. గ‌త రాత్రి నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు నిర్వ‌హించిన సెర్చ్‌లో దాదాపు 1000 మందికి పైగా పాకిస్థాన్ పౌరులు గుర‌జాత్‌లో అన‌ధికారికంగా ఉంటున్న‌ట్టు అధికారులు గుర్తించారు. వీరిని ఇళ్ల బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి భారీ పెరేడ్ నిర్వ‌హించారు. త‌క్ష‌ణ‌మే వీరిని వాఘా స‌రిహ‌ద్దులు దాటిస్తామ‌ని అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే.. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల కంటే కూడా.. గుజ‌రాత్‌లోనే పాకిస్థాన్ పౌరులు ఎక్కువ‌గా ఉండడం ప‌ట్ల‌.. విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావ‌డం.. గ‌త 20 సంవ‌త్స‌రాలుగా బీజేపీ ఇక్క‌డ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఏ మేర‌కు స‌జావుగా ఉన్నాయ‌న్న‌ది ఈ ఘ‌ట‌న రుజువు చేస్తోంద‌ని.. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్య‌క్షులు ఖ‌ర్గే ప్ర‌శ్నించారు. మ‌రోవైపు.. హైద‌రాబాద్‌లోని పాక్‌ బ‌జార్‌లోనూ పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు చేప‌డుతున్నారు.

This post was last modified on April 26, 2025 4:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago