Political News

షాకింగ్: ఆ రాష్ట్రంలోనే 1000 మంది పాకిస్థానీలు!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దాయాది దేశం పాకిస్థాన్‌పై నిప్పులు చెరుగుతున్న భార‌త్‌.. మ‌న దేశంలో తిష్ట‌వేసిన పాకిస్థాన్ పౌరుల‌ను దేశం విడిచి పోవాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 30 నాటికి పాకిస్థాన్‌కు చెందిన ఏ ఒక్క‌రూ దేశంలో ఉండ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలో రాష్ట్రాల‌ను కూడా అలెర్ట్ చేసింది. ముఖ్య మంత్రుల‌కు స్వ‌యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్లు కూడా చేశారు.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి నుంచి ఆయా రాష్ట్రాల్లో పాకిస్థాన్ పౌరులు ఉంటున్న‌ట్టుగా భావిస్తున్న ప్రాంతాల‌ను పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో గుజ‌రాత్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. గ‌త రాత్రి నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు నిర్వ‌హించిన సెర్చ్‌లో దాదాపు 1000 మందికి పైగా పాకిస్థాన్ పౌరులు గుర‌జాత్‌లో అన‌ధికారికంగా ఉంటున్న‌ట్టు అధికారులు గుర్తించారు. వీరిని ఇళ్ల బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి భారీ పెరేడ్ నిర్వ‌హించారు. త‌క్ష‌ణ‌మే వీరిని వాఘా స‌రిహ‌ద్దులు దాటిస్తామ‌ని అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే.. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల కంటే కూడా.. గుజ‌రాత్‌లోనే పాకిస్థాన్ పౌరులు ఎక్కువ‌గా ఉండడం ప‌ట్ల‌.. విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావ‌డం.. గ‌త 20 సంవ‌త్స‌రాలుగా బీజేపీ ఇక్క‌డ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఏ మేర‌కు స‌జావుగా ఉన్నాయ‌న్న‌ది ఈ ఘ‌ట‌న రుజువు చేస్తోంద‌ని.. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్య‌క్షులు ఖ‌ర్గే ప్ర‌శ్నించారు. మ‌రోవైపు.. హైద‌రాబాద్‌లోని పాక్‌ బ‌జార్‌లోనూ పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు చేప‌డుతున్నారు.

This post was last modified on April 26, 2025 4:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago