Political News

షాకింగ్: ఆ రాష్ట్రంలోనే 1000 మంది పాకిస్థానీలు!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దాయాది దేశం పాకిస్థాన్‌పై నిప్పులు చెరుగుతున్న భార‌త్‌.. మ‌న దేశంలో తిష్ట‌వేసిన పాకిస్థాన్ పౌరుల‌ను దేశం విడిచి పోవాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 30 నాటికి పాకిస్థాన్‌కు చెందిన ఏ ఒక్క‌రూ దేశంలో ఉండ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలో రాష్ట్రాల‌ను కూడా అలెర్ట్ చేసింది. ముఖ్య మంత్రుల‌కు స్వ‌యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్లు కూడా చేశారు.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి నుంచి ఆయా రాష్ట్రాల్లో పాకిస్థాన్ పౌరులు ఉంటున్న‌ట్టుగా భావిస్తున్న ప్రాంతాల‌ను పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో గుజ‌రాత్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. గ‌త రాత్రి నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు నిర్వ‌హించిన సెర్చ్‌లో దాదాపు 1000 మందికి పైగా పాకిస్థాన్ పౌరులు గుర‌జాత్‌లో అన‌ధికారికంగా ఉంటున్న‌ట్టు అధికారులు గుర్తించారు. వీరిని ఇళ్ల బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి భారీ పెరేడ్ నిర్వ‌హించారు. త‌క్ష‌ణ‌మే వీరిని వాఘా స‌రిహ‌ద్దులు దాటిస్తామ‌ని అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే.. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల కంటే కూడా.. గుజ‌రాత్‌లోనే పాకిస్థాన్ పౌరులు ఎక్కువ‌గా ఉండడం ప‌ట్ల‌.. విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావ‌డం.. గ‌త 20 సంవ‌త్స‌రాలుగా బీజేపీ ఇక్క‌డ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఏ మేర‌కు స‌జావుగా ఉన్నాయ‌న్న‌ది ఈ ఘ‌ట‌న రుజువు చేస్తోంద‌ని.. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్య‌క్షులు ఖ‌ర్గే ప్ర‌శ్నించారు. మ‌రోవైపు.. హైద‌రాబాద్‌లోని పాక్‌ బ‌జార్‌లోనూ పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు చేప‌డుతున్నారు.

This post was last modified on April 26, 2025 4:23 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

2 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

2 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

3 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

3 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

4 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

4 hours ago