Political News

షాకింగ్: ఆ రాష్ట్రంలోనే 1000 మంది పాకిస్థానీలు!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దాయాది దేశం పాకిస్థాన్‌పై నిప్పులు చెరుగుతున్న భార‌త్‌.. మ‌న దేశంలో తిష్ట‌వేసిన పాకిస్థాన్ పౌరుల‌ను దేశం విడిచి పోవాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 30 నాటికి పాకిస్థాన్‌కు చెందిన ఏ ఒక్క‌రూ దేశంలో ఉండ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలో రాష్ట్రాల‌ను కూడా అలెర్ట్ చేసింది. ముఖ్య మంత్రుల‌కు స్వ‌యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్లు కూడా చేశారు.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి నుంచి ఆయా రాష్ట్రాల్లో పాకిస్థాన్ పౌరులు ఉంటున్న‌ట్టుగా భావిస్తున్న ప్రాంతాల‌ను పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో గుజ‌రాత్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. గ‌త రాత్రి నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు నిర్వ‌హించిన సెర్చ్‌లో దాదాపు 1000 మందికి పైగా పాకిస్థాన్ పౌరులు గుర‌జాత్‌లో అన‌ధికారికంగా ఉంటున్న‌ట్టు అధికారులు గుర్తించారు. వీరిని ఇళ్ల బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి భారీ పెరేడ్ నిర్వ‌హించారు. త‌క్ష‌ణ‌మే వీరిని వాఘా స‌రిహ‌ద్దులు దాటిస్తామ‌ని అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే.. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల కంటే కూడా.. గుజ‌రాత్‌లోనే పాకిస్థాన్ పౌరులు ఎక్కువ‌గా ఉండడం ప‌ట్ల‌.. విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావ‌డం.. గ‌త 20 సంవ‌త్స‌రాలుగా బీజేపీ ఇక్క‌డ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఏ మేర‌కు స‌జావుగా ఉన్నాయ‌న్న‌ది ఈ ఘ‌ట‌న రుజువు చేస్తోంద‌ని.. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్య‌క్షులు ఖ‌ర్గే ప్ర‌శ్నించారు. మ‌రోవైపు.. హైద‌రాబాద్‌లోని పాక్‌ బ‌జార్‌లోనూ పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు చేప‌డుతున్నారు.

This post was last modified on April 26, 2025 4:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

9 minutes ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

44 minutes ago

బాలయ్య మూవీ అంటే కొరటాలకు సవాలే

దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…

1 hour ago

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

‘చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు’

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష(ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు రాష్ట్రంలో అన్యాయంగా…

7 hours ago