Political News

స‌స్పెండ్ చేసినా.. చింత లేదా…

ఒక నాయ‌కుడిని స‌స్పెండ్ చేస్తే.. చింత ఉండాలి. మార్పు రావాలి. క‌నీసం.. ఆవేద‌న అయినా ఉండాలి. కానీ.. వైసీపీ నుంచి స‌స్పెండ్ అవుతున్న నాయ‌కుల‌కు ఈ త‌ర‌హా చింత లేక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం. తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌ను స‌స్పెండ్ చేశారు. అయితే.. ఆయ‌న‌లో చిన్న‌పాటి ఆవేద‌న కూడా లేక‌పోగా.. పై పెచ్చు.. ఇండిపెండెంటుగా ఉంటేనే బాగుంద‌న్న కామెంట్లు చేయ‌డం మ‌రింత‌గా ఆయ‌న శైలిని.. ఇగోను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది.

నిజానికి.. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు త‌మ ప‌రిధులు తాము తెలుసుకుని ముందుకు సాగాలి. పార్టీకి ప్ర‌యోజన‌క‌రంగా అయినా.. ఉండాలి. ఏదైనా తేడా వ‌చ్చిన‌ప్పుడు త‌మ‌ను తాము స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం అయినా చేయాలి. ఇవేవీ లేకుండానే ఎదురు దాడి చేయ‌డం.. తామంతటి వారు లేర‌న్న వాద‌న‌ను వినిపించడం వంటివి ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. రాజ‌కీయాల్లో విధేయ‌త అన్న‌ది లేక‌పోతే.. చాలా క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

టీడీపీలో కూడా.. చాలా మందిని స‌స్పెండ్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ.. వారు త‌మ‌ను తాము తెలుసుకుని ముందుకు సాగారు. పార్టీ ప‌ట్ల‌, పార్టీ అధినేత ప‌ట్ల విన‌య విధేయ‌త‌లు ప్ర‌ద‌ర్శించారు. తద్వారా పార్టీలో ప‌ద‌వులు పొందిన వారు ఉన్నారు. ఇవ‌న్నీ.. కూడా..నాయ‌కులు చూపించే విధేయ‌త‌, వినయం సంస్కారం వంటి వాటిపై ఆధార‌ప‌డి ఉంటాయి. కానీ.. ఈ త‌ర‌హా సంస్కృతి, సంప్ర‌దాయాలు.. వైసీపీలో కనిపించ‌డ‌మే లేదు.

అధికారంలో ఉంటే దోచుకోవ‌డం.. దాచుకోవ‌డ‌మే ప‌రమావ‌ధిగా మారిన ప‌రిస్థితి నుంచి మార్పు దిశ‌గా నాయకులు అడుగులు వేయాల్సిన ప‌రిస్థితి రావాల్సి ఉంద‌ని అనేక స‌ర్వేలు చెబుతున్నాయి. కానీ.. వైసీపీ నాయ‌కుల్లో ఈ త‌ర‌హా మార్పు క‌నిపించ‌డం లేదు. పార్టీని న‌డిపించ‌డం.. బ‌లోపేతం చేయ‌డం.. వంటి వాటిపై వ్య‌క్తిగ‌తంగా దృష్టి పెట్టే నాయ‌కులు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిస్థితి మారితే త‌ప్ప‌. వైసీపీకి మంచి రోజులు వ‌చ్చే పరిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 25, 2025 2:21 pm

Share
Show comments
Published by
Satya
Tags: Duvvada

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago