Political News

ఏప్రిల్ 27… బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్‌?

ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి(టీఆర్ ఎస్‌) 25 సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగ‌ల్లు.. ఓరుగ‌ల్లు వేదిక‌గా.. బీఆర్ఎస్ ర‌జతోత్స‌వ స‌భను నిర్వ‌హిస్తోంది. 2023 నాటి ఎన్నిక ల్లో పార్టీ అధికారం కోల్పోవ‌డం.. గ‌త ఏడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగ‌గా ప‌రాజ‌యం కావ‌డం ద‌రిమిలా.. ఇప్పుడు పార్టీలో చేత‌న‌త్వాన్ని నింపాల‌న్న ప్ర‌ధాన ఉద్దేశంతో ఈ నెల 27న క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఈ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌కు పార్టీ రెడీ అయింది.

అయితే.. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ అప్ర‌మ‌త్త‌మైంది. బీఆర్ఎస్ స‌భ పెట్టుకుంటే.. అధికార పార్టీ అలెర్ట్ కావ‌డం ఏంట‌న్న చ‌ర్చ సాధార‌ణంగానే ఉంటుంది. కానీ.. ఈ స‌భ ద్వారా.. రెండు కీల‌క‌ విష‌యాల‌పై బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. 1) పార్టీని పున‌ర్నిర్మించ‌డం. 2) త‌మ పార్టీలోకి.. కాంగ్రెస్ అసంతృప్తుల‌ను ఆహ్వానించ‌డం. ఈ రెండు విష‌యాలు కాంగ్రెస్ పార్టీని క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. బీఆర్ఎస్ పున‌ర్నిర్మాణం..అంటే.. ఇది ఆపార్టీ వ్య‌క్తిగ‌త‌ వ్య‌వ‌హారంకావొచ్చు.

కానీ, చేరిక‌ల విష‌యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్ట‌డం.. మాత్రం కాంగ్రెస్‌కు ఇబ్బందిగానే మార‌నుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. గ‌త 2023 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. బీఆర్ఎస్ నుంచి సుమారు 13 మంది వ‌ర‌కు నాయ‌కుల‌ను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. వీరంతా.. బ‌ల‌మైన నాయ‌కులు.. వీరిలో ఓడిన వారు గెలిచిన వారు కూడా ఉన్నారు. కొంద‌రు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులు కూడా. వీరంతా.. ఇప్పుడు కాంగ్రెస్ పంచ‌న చేరారు.

ఈ క్ర‌మంలో త‌మ పార్టీని దెబ్బేసిన‌.. కాంగ్రెస్‌కు అంతే దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్‌లో చేరిన నాయ‌కుల‌తో .. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు పొస‌గడం లేదు. కీల‌క‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత‌ల‌తో హ‌స్తం పార్టీ నేత‌లు విభేదిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారిలో గూడుక‌ట్టుకున్న అసంతృప్తి.. కాంగ్రెస్‌పై ప‌గ‌ను పెంచుతోంది.

దీనిని ప‌రిశీలించిన కేసీఆర్‌.. ఇలాంటి కీల‌క నాయ‌కుల‌ను త‌న వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న‌ది ప్ర‌స్తుతం వినిపిస్తున్న టాక్‌. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ స‌ద‌రు అసంతృప్తులను గుర్తించి.. బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలిసింది. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు నాయ‌కులు మాత్రం.. స‌సేమిరా అంటున్నార‌ని.. వారు బీఆర్ఎస్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 27న ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఇరు పార్టీల సీనియ‌ర్లు..ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Satya

Recent Posts

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…

2 minutes ago

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

1 hour ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

1 hour ago

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

2 hours ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

2 hours ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

2 hours ago