Political News

లోక‌ల్ టాక్‌: వైసీపీని వ‌దిలేద్దాం!

గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజయం పాలైన వైసీపీని చాలా మంది వ‌దిలేశారు. కీలక రెడ్డి నాయ‌కుల నుంచి అనేక మంది బీసీల వ‌ర‌కు.. కూడా పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు కీల‌క‌మైన కార్య‌క‌ర్త‌ల వంతు వ‌చ్చింది. ఏ పార్టీకైనా.. నాయ‌కుల‌తోపాటు.. కార్య‌కర్త‌లు చాలా కీల‌కం. నాయ‌కులు జంప్ చేస్తారు..కానీ.. కార్య‌క‌ర్త‌లు మాత్రం ఎంతో కొంత అంకిత భావంతో పార్టీల‌ను అంటిపెట్టుకుని ఉంటారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ..వారే కీల‌కం.

ఈ విష‌యాన్ని గుర్తించే.. దాదాపు అన్ని పార్టీలూ..కార్య‌క‌ర్త‌లే త‌మ‌కు బ‌ల‌మ‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తామ‌ని చెబుతాయి. కార్య‌క‌ర్త‌ల సెంట్రిక్‌గా అనేక కార్య‌క్ర‌మాలు కూడా చేప‌డతాయి. అయితే.. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. కార్య‌క‌ర్త‌ల‌న‌ను ప‌క్క‌న పెట్టిన విష‌యం తెలిసిందే. గ‌త వైసీపీ హ‌యాంలో వలంటీర్లే స‌ర్వ‌స్వంగా అప్ప‌ట్లో సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు. ఇది పార్టీకి మేలు చేయ‌క‌పోగా.. ఓడించేసింది. త‌ద్వారా.. పార్టీ నామ‌రూపాలు లేకుండా పోయింద‌న్న చ‌ర్చ ఉంది.

ఇంత ప‌రాభ‌వం త‌ర్వాత‌.. ఒక‌టి రెండు సార్లు.. కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చా రు. కానీ.. నెలలు గ‌డిచిపోతున్నా.. ఆయ‌న కార్య‌క‌ర్త‌ల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యాలూ తీసుకోవ‌డం లేదు. గుర్తింపు అంత‌క‌న్నా లేదు. పైగా.. టీడీపీ స‌హా కూట‌మి నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌ల‌పై పోరాటాలు చేయాల‌ని పిలుపునిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. జైలుకు వెళ్తోంది.. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులే. కనీసం వారిని పరామ‌ర్శించ‌డంలోనూ.. న్యాయ‌ప‌రంగా ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలోనూ..వైసీపీ అధినేత విఫ‌ల‌మ‌వుతున్నారు.

ఆయా విష‌యాల‌ను గ‌మ‌నిస్తున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. ఇప్పుడు ప్లేట్ మార్చేస్తున్నారు. టీడీపీ కానీ.. జ‌న‌సేన కానీ..కార్య‌క‌ర్త‌ల‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వారు గుర్తించారు. సీఎం చంద్ర‌బాబు సైతం..త‌న ప్రొటోకాల్ ను ప‌క్క‌న పెట్టి మ‌రీ.. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ఇళ్ల‌కు వెళ్లి క‌ష్టాల్లో ఉంటున్న‌వారిని ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో వ‌వైసీపీలో అల‌జ‌డి ర‌రేగింది. ఇంకా పార్టీని న‌మ్ముకుని ఇక్క‌డే ఉంటే క‌ష్ట‌మ‌నిభావిస్తున్న వారు.. జెండా మార్చేసేందుకు రెడీ అయ్యారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అనేక మంది కార్య‌క‌ర్త‌లు.. గ‌త రెండు రోజుల్లోనే టీడీపీ, జ‌న‌సేన‌ల బాట‌ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 24, 2025 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

2 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

46 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago