ఏడాది తర్వాత.. సీఎం చంద్రబాబు సహా.. అధికారులంతా ఎక్కడ నుంచి పనిచేస్తారు? ఎక్కడ ఉంటారు? అంటే.. తాజాగా ప్రభుత్వం చెబుతున్న సమాచారం ప్రకారం.. అమరావతిలోని ఐకానిక్ టవర్ల నుంచే అని! ప్రస్తుతం కాంట్రాక్టులు.. బిడ్డింగుల పనుల్లో ఉన్న ఈ వ్యవహారంపై తాజాగా బ్లూప్రింట్ విడుదల చేశారు. దీని ప్రకారం.. ఏడాదిలో ఉన్నతాధికారుల భవనాలు పూర్తికానున్నాయి. దీనికి సంబంధించి.. పక్కా లెక్కలు వేసుకున్నారు.
ప్రస్తుతం మూడు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి.. షెడ్యూల్ ఖరారు చేశారు. దీని ప్రకారం.. ఉన్నతాధికారులై న ఐఏఎస్, ఐపీఎస్ల నివాస సముదాయాలు.. కార్యాలయాలను కూడా.. రెడీ చేస్తున్నారు. అలానే.. సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా కార్యాలయం.. ఉప ముఖ్యమంత్రి భవనాలు.. వంటివి కూడా.. దీనిలో చేర్చారు . వీటిని బహుళ అంతస్థులలో నిర్మిస్తున్నారు. ఒక్కొక్క భవనం 40 అంతస్థులకు తక్కువ కాకుండా ఉంటుంది. అంతేకాదు.. ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి.
వీటికి సంబంధించిన.. అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. అంతేకాదు.. నిధులు కూడా రెడీ చేసుకు న్నారు. ఫలితంగా పనుల వేగం పుంజుకోనుంది. గతంలో మాదిరిగా కాకుండా.. అవసరమైతే.. ప్రత్యేక సాయం చేసేలా దేశీయ బ్యాంకులతోనూ.. ఒప్పందాలు చేసుకున్నారు. గతంలో కొన్ని నిధులు ఆగిపోయిన దరిమిలా.. మధ్యలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పైగా.. క్లారిటీ కూడా మిస్ అయింది. ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తకుండా.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
మంత్రి నారాయణ చెప్పినట్టుగా ఒక టైమ్ బౌండ్ ప్రకారం పనులు చేయనున్నారు. ఇదే జరిగితే.. ఏడాది లోగా ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తి అవుతుంది. తద్వారా.. అమరావతికి స్పష్టమైన రూపు రేఖలు రానున్నా యి. ఫలితంగా.. సీఎం కార్యాలయం నుంచి ఇతర మంత్రులు, అధికారుల కార్యాలయాల వరకు కూడా.. అన్నీ.. అమరావతిలోని ఐకానిక్ టవర్ల నుంచే జరగనున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా.. స్పష్టతతో ఉండడం గమనార్హం.
This post was last modified on April 24, 2025 8:40 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…