Political News

“ఎన్టీఆర్ భవన్ కాదండోయ్… ఛార్లెస్ శోభరాజ్ భవన్‌” – నాని

విజ‌య‌వాడ ప్ర‌స్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివ‌నాథ్‌), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్ద‌రూ తోడ‌బుట్టిన అన్న‌ద‌మ్ములు. రాజ‌కీయంగా వైరం లేక‌పోయినా.. ఆస్తులు.. అప్పుల వివాదాలు, వ్యాపారాల ఘ‌ర్ష‌ణ ల నేప‌థ్యంలో ఇరువురూ విభేదించుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఇది.. రాజ‌కీయ యుద్ధంగా మారింది. అన్న‌కు వ్య‌తిరేకంగా త‌మ్ముడు.. త‌మ్ముడికి వ్య‌తిరేకంగాఅన్న రాజ‌కీయాలు చేసుకుంటూ… పొలిటిక‌ల్ స‌మ‌రంలో దూకుడుగా ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కేశినేని చిన్నికి చంద్ర‌బాబు ఎంపీ సీటును ఇచ్చారు. ఇక‌, దీనిని ముందుగానే ఊహించిన నాని.. టీడీపీపై నింద‌లు మోపి.. చంద్ర‌బాబు, నారా లోకేష్‌ల‌ను.. తీవ్రంగా తిట్టిపోసి.. బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ వెంట‌నే వైసీపీ పంచ‌న చేరారు. ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసి.. విజ‌య‌వాడ ఎంపీగా ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత కూడా.. కొన్నాళ్లు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య రాజ‌కీయ వ్యాఖ్యలు .. వివాదాలు.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

తాజాగా కేశినేని నాని.. త‌మ్ముడు చిన్నిపై మ‌రింత తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. విజ‌య‌వాడ‌లో ఎంపీ చిన్ని త‌న కార్యాల‌యానికి ఎన్టీఆర్ భ‌వ‌న్ అని పేరు పెట్టుకున్నారు. అయితే.. దీనిని త‌ప్పుబ‌డుతూ.. నాని తాజాగా సుదీర్ఘ పోస్టు పెట్టారు.

“విజ‌య‌వాడ ప్ర‌జ‌లు త‌న‌ను ఘ‌నంగా గెలిపించుకున్నార‌ని చెప్పుకొనే వ్య‌క్తి కార్యాల‌యానికి ఉన్న పేరు ఎన్టీఆర్ భ‌వ‌న్‌. కానీ. ఇక్క‌డ కూర్చుని ఆయ‌న‌(ఎంపీ చిన్ని) చేసేది.. ఇసుక దందాలు, ఫ్లైయాష్ తోల‌కాలు, గ్రావెల్ అక్ర‌మాలు. భూ దందాలు బ్రోక‌రేజీలు. వాస్త‌వానికి ఎన్టీఆర్ అంటే.. పేద‌ల పెన్నిధి. తెలుగు వారి ఆత్మ గౌర‌వం. అలాంటి నాయ‌కుడి పేరును దందాలు చేసే కార్యాల‌యానికి పెట్టాడు. కానీ.. ఈ కార్యాల‌యానికి “ఛార్లెస్ శోభ‌రాజ్ భ‌వ‌న్‌” అని పేరు పెట్టాల‌ని విజ‌య‌వాడ ప్ర‌జ‌లు కోరుతున్నారు” అని మాజీ ఎంపీ నానీ విరుచుకుప‌డ్డారు.

This post was last modified on April 23, 2025 6:52 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

37 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

53 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago