వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారే అవకాశం ఉందా? ఇదే జరిగితే.. ఆయన కీలక నేతల పేర్లను బయటకు చెప్పే అవకాశం కనిపిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సాయిరెడ్డిని జగన్ మీడియా నిరంతరం.. ఏకేస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన సాయిరెడ్డి ఇప్పుడు కూటమి పంచన చేరుతున్నారని.. ఆయన త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కూడా వ్యాఖ్యానిస్తోంది.
దీనిలో వాస్తవం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. బీజేపీలోకి వెళ్తున్నారన్నది నిజమే అయినా.. అది ఆయ న పూర్తిగా వ్యక్తిగత విషయం. దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. పైగా.. రాజకీయాల్లో ఉన్నవా రు వారి ఇష్ట ప్రకారం వ్యవహరిస్తారు. లేదా.. మానుకుంటారు. కానీ.. సాయిరెడ్డి వైసీపీని వీడిపోయారన్న ఏకైక కారణంగా.. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వైసీపీ మీడియా వ్యవహరిస్తోందన్నది వాస్తవం. ఆ విషయాన్నే సాయిరెడ్డి తాజాగా ప్రస్తావించారు.
ఈ పరిణామం.. సాయిరెడ్డిని తీవ్రంగా హర్ట్ చేస్తోంది. పైగా.. ఆయనే స్వయంగా చెప్పినట్టు.. తాను వైసీపీ లో ఉండి ఉంటే.. ఇలా వ్యాఖ్యలు చేసేవారా? అని ప్రశ్నించారు. సహజంగా అనుకూలంగా ఉన్నంత వర కు ఎవరూ ఏమీ అనరు. కానీ.. ఇప్పుడు ఆయన వ్యతిరేకంగా మారారు. అలాగని మొత్తం విషయాలను బయటకు చెప్పడం లేదు. ఇక, ఇప్పుడు తన వరకు వచ్చే సరికి.. సాయిరెడ్డి యాంటీ అయితే.. అది వైసీపీకి ఆపార్టీ అధినేతకు కూడాఇబ్బంది కలిగించడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ విషయమే ఇప్పుడు తెరమీదికి వచ్చింది. తనను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని సాయిరెడ్డి చెబుతు న్నారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డియూటర్న్ తీసుకుని.. అన్ని విషయాలు బయటకు చెబితే.. కీలకమైన ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్న జగన్ కానీ.. ఇతర నాయకులు, వ్యాపార వేత్తలు కూడా.. ఇరుకున పడే అవకాశం ఉంది. తనను మోసం చేశారంటూ.. అంటున్న సాయిరెడ్డి.. ఇలా మారే వరకు వైసీపీ లాగితే.. అది మొత్తానికే ఇబ్బంది. మరి ఏం చేస్తారోచూడాలి.
This post was last modified on April 19, 2025 5:40 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…