ఒక్క దెబ్బకు రెండు షాకులు అంటే.. ఎలా ఉంటుందో చంద్రబాబు చేసి చూపించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు సౌండ్ లేకుండా చేశారు. కీలకమైన రెండు విషయాల్లో చంద్రబాబు చేసిన రాజకీ యం వైసీపీ నేతలకు నోట మాట రాకుండా… లేకుండా కూడా చేసింది. 1) మత్య్సకారులకు ఇచ్చే భృతి. 2) పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనం. ఈ రెండు విషయాలను వైసీపీ తనఖాతాలో వేసుకుంది. ఈ రెండు కూడా.. చంద్రబాబు అమలు చేయలేదని ప్రచారం చేస్తోంది.
వాస్తవానికి 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు పథకాలను కూడా.. కూటమి సర్కారు పట్టించుకోలే దనే చెప్పాలి. గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో భృతిఇవ్వాల్సి ఉంది. కానీ, అప్పటికి ప్రభుత్వం ఏర్పడకపోవడంతో కూటమి సర్కారు నేతలు మౌనంగా ఉన్నారు. దీంతో అప్పట్లోనే వైసీపీ యాగీ చేసింది. మత్స్యకారులకు వైసీపీ మేలు చేసిందని.. కూటమిపట్టించుకోవడం లేదని పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా సంధించింది.
ఇక, పాస్టర్ల విషయాన్ని కూడా.. వైసీపీ రాజకీయం చేసింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు వారికి కూడా .. కూటమి సర్కారు రూపాయి ఇవ్వలేదు. వైసీపీ హయాంలో నెలకు రూ.5000 చొప్పున గౌరవ వేతనంగా అందించారు. అయితే.. కూటమి ఏర్పడ్డాక.. పింఛన్ల పెంపుదలకు ప్రాదాన్యం ఇచ్చారే తప్ప.. ఇతర విషయాల జోలికి పోలేదు. దీంతో ఇది కూడా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అయింది. దీంతో పాస్టర్ల విషయాన్ని కూడా ప్రస్తావించాలని భావించారు.
కానీ, వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్కు అవకాశం ఇవ్వకుండా.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది నుంచి బకాయి ఉన్న పాస్టర్ల గౌరవ వేతనాన్ని గురువారంరాత్రి రూ.30 కోట్ల వరకు విడుదల చేశారు. అంతేకాదు.. మత్స్యకార భరోసా కింద.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.20000 చొప్పున ఈ నెల 26న సీఎం చంద్రబాబు అందించేందుకు రెడీ అయ్యారు. ఈ రెండు విషయాల్లోనూ కూటమి సర్కారు జాగ్రత్తగా అడుగులు వేసింది. దీంతో వైసీపీనాయకులకు విమర్శించే ఛాన్స్ లేకుండా చేసుకున్నారు.
This post was last modified on April 19, 2025 10:55 am
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…