Political News

గిరిజ‌నుల‌కు ప‌వ‌న్ పాద `ర‌క్ష‌లు`.. విష‌యం తెలిస్తే ఫిదా!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. త‌ర‌చుగా ఆయ‌న క‌ష్టాల్లో ఉన్న‌వారికి త‌న సొంత నిధుల నుంచి సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా గిరిజ‌నుల‌కు వినూత్న కానుక‌లు పంపించి.. వారికి `ర‌క్ష‌`గా ఉంటాన‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. ఈ విష‌యం తెలిసిన జ‌న‌సేన పార్టీ అభిమానులు ఫిదా అవుతుంటే.. ఆపార్టీ నాయ‌కులు ప‌వ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

విష‌యం ఏంటి?

ఈ ఏడాది ఉగాది పండుగ సంద‌ర్భంగా 10000మంది పిఠాపురం మ‌హిళ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ చీరు పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌ను ఆద‌రించి గెలిపించిన ప్ర‌తి కుటుంబానికి తాను ప‌సుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. స్వ‌యంగా ఆయ‌న వెళ్ల‌కపోయినా.. పార్టీ నాయ‌కుల‌తో పంపిణీ చేశారు. ఈ ప‌రిణామం స్థానికంగా ప‌వ‌న్ పై మంచి గ్రాఫ్ ను పెంచింది.

తాజాగా.. ఇటీవల గిరిజ‌న ప్రాంతాల్లో అభివృద్ది ప‌నులు ప్రారంభించేందుకు “అడవిత‌ల్లి బాట‌“ పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని కురిడి, పెద‌పాడు గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భం గా ఆయ‌న ర‌చ్చ బండ కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించారు. చ‌దునైన రోడ్లు లేక‌పోవ‌డం.. ఎక్క‌డిక‌క్క‌డ ముళ్లు, రాళ్లు ర‌ప్ప‌లు పేరుకుపోయి ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. వీటిపై రోడ్లు వేయిస్తాన‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో అలాంటి రోడ్ల‌పై పాదాల‌కు చెప్పులు లేకుండా గిరిజ‌న మ‌హిళ‌లు న‌డుస్తున్న తీరును చూసి ఆయ‌న చ‌లించి పోయారు. దీనిపై వారిని ప్ర‌శ్నించారు.

త‌మ‌కు చెప్పులు కొనుక్కునేంత ఆర్థిక స్తోమ‌త లేద‌ని కొంద‌రు చెప్పారు. మ‌రికొంద‌రు త‌మకు అల‌వాటైపోయింద‌న్నారు. అక్క‌డ మౌనంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా త‌న సొంత సొమ్ముతో 300 మంది గిరిజ‌నులకు తాజాగా నాణ్య‌మైన పాద‌ర‌క్ష‌లు పంపిణీ చేశారు. వీటిని తాను వెళ్ల‌క‌పోయినా.. త‌న కార్యాల‌యం అధికారుల‌కు ఇచ్చి పంపించారు. గురువారం ఉద‌యం పెద‌పాడు, కురిడి గ్రామాల్లో ప‌ర్య‌టించిన అధికారులు వాటిని పంచారు.

This post was last modified on April 17, 2025 3:57 pm

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

7 minutes ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

43 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

1 hour ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

14 hours ago