Political News

గిరిజ‌నుల‌కు ప‌వ‌న్ పాద `ర‌క్ష‌లు`.. విష‌యం తెలిస్తే ఫిదా!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. త‌ర‌చుగా ఆయ‌న క‌ష్టాల్లో ఉన్న‌వారికి త‌న సొంత నిధుల నుంచి సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా గిరిజ‌నుల‌కు వినూత్న కానుక‌లు పంపించి.. వారికి `ర‌క్ష‌`గా ఉంటాన‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. ఈ విష‌యం తెలిసిన జ‌న‌సేన పార్టీ అభిమానులు ఫిదా అవుతుంటే.. ఆపార్టీ నాయ‌కులు ప‌వ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

విష‌యం ఏంటి?

ఈ ఏడాది ఉగాది పండుగ సంద‌ర్భంగా 10000మంది పిఠాపురం మ‌హిళ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ చీరు పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌ను ఆద‌రించి గెలిపించిన ప్ర‌తి కుటుంబానికి తాను ప‌సుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. స్వ‌యంగా ఆయ‌న వెళ్ల‌కపోయినా.. పార్టీ నాయ‌కుల‌తో పంపిణీ చేశారు. ఈ ప‌రిణామం స్థానికంగా ప‌వ‌న్ పై మంచి గ్రాఫ్ ను పెంచింది.

తాజాగా.. ఇటీవల గిరిజ‌న ప్రాంతాల్లో అభివృద్ది ప‌నులు ప్రారంభించేందుకు “అడవిత‌ల్లి బాట‌“ పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని కురిడి, పెద‌పాడు గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భం గా ఆయ‌న ర‌చ్చ బండ కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించారు. చ‌దునైన రోడ్లు లేక‌పోవ‌డం.. ఎక్క‌డిక‌క్క‌డ ముళ్లు, రాళ్లు ర‌ప్ప‌లు పేరుకుపోయి ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. వీటిపై రోడ్లు వేయిస్తాన‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో అలాంటి రోడ్ల‌పై పాదాల‌కు చెప్పులు లేకుండా గిరిజ‌న మ‌హిళ‌లు న‌డుస్తున్న తీరును చూసి ఆయ‌న చ‌లించి పోయారు. దీనిపై వారిని ప్ర‌శ్నించారు.

త‌మ‌కు చెప్పులు కొనుక్కునేంత ఆర్థిక స్తోమ‌త లేద‌ని కొంద‌రు చెప్పారు. మ‌రికొంద‌రు త‌మకు అల‌వాటైపోయింద‌న్నారు. అక్క‌డ మౌనంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా త‌న సొంత సొమ్ముతో 300 మంది గిరిజ‌నులకు తాజాగా నాణ్య‌మైన పాద‌ర‌క్ష‌లు పంపిణీ చేశారు. వీటిని తాను వెళ్ల‌క‌పోయినా.. త‌న కార్యాల‌యం అధికారుల‌కు ఇచ్చి పంపించారు. గురువారం ఉద‌యం పెద‌పాడు, కురిడి గ్రామాల్లో ప‌ర్య‌టించిన అధికారులు వాటిని పంచారు.

This post was last modified on April 17, 2025 3:57 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pawan Kalyan

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

45 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

5 hours ago