Political News

గిరిజ‌నుల‌కు ప‌వ‌న్ పాద `ర‌క్ష‌లు`.. విష‌యం తెలిస్తే ఫిదా!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. త‌ర‌చుగా ఆయ‌న క‌ష్టాల్లో ఉన్న‌వారికి త‌న సొంత నిధుల నుంచి సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా గిరిజ‌నుల‌కు వినూత్న కానుక‌లు పంపించి.. వారికి `ర‌క్ష‌`గా ఉంటాన‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. ఈ విష‌యం తెలిసిన జ‌న‌సేన పార్టీ అభిమానులు ఫిదా అవుతుంటే.. ఆపార్టీ నాయ‌కులు ప‌వ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

విష‌యం ఏంటి?

ఈ ఏడాది ఉగాది పండుగ సంద‌ర్భంగా 10000మంది పిఠాపురం మ‌హిళ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ చీరు పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌ను ఆద‌రించి గెలిపించిన ప్ర‌తి కుటుంబానికి తాను ప‌సుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. స్వ‌యంగా ఆయ‌న వెళ్ల‌కపోయినా.. పార్టీ నాయ‌కుల‌తో పంపిణీ చేశారు. ఈ ప‌రిణామం స్థానికంగా ప‌వ‌న్ పై మంచి గ్రాఫ్ ను పెంచింది.

తాజాగా.. ఇటీవల గిరిజ‌న ప్రాంతాల్లో అభివృద్ది ప‌నులు ప్రారంభించేందుకు “అడవిత‌ల్లి బాట‌“ పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని కురిడి, పెద‌పాడు గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భం గా ఆయ‌న ర‌చ్చ బండ కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించారు. చ‌దునైన రోడ్లు లేక‌పోవ‌డం.. ఎక్క‌డిక‌క్క‌డ ముళ్లు, రాళ్లు ర‌ప్ప‌లు పేరుకుపోయి ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. వీటిపై రోడ్లు వేయిస్తాన‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో అలాంటి రోడ్ల‌పై పాదాల‌కు చెప్పులు లేకుండా గిరిజ‌న మ‌హిళ‌లు న‌డుస్తున్న తీరును చూసి ఆయ‌న చ‌లించి పోయారు. దీనిపై వారిని ప్ర‌శ్నించారు.

త‌మ‌కు చెప్పులు కొనుక్కునేంత ఆర్థిక స్తోమ‌త లేద‌ని కొంద‌రు చెప్పారు. మ‌రికొంద‌రు త‌మకు అల‌వాటైపోయింద‌న్నారు. అక్క‌డ మౌనంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా త‌న సొంత సొమ్ముతో 300 మంది గిరిజ‌నులకు తాజాగా నాణ్య‌మైన పాద‌ర‌క్ష‌లు పంపిణీ చేశారు. వీటిని తాను వెళ్ల‌క‌పోయినా.. త‌న కార్యాల‌యం అధికారుల‌కు ఇచ్చి పంపించారు. గురువారం ఉద‌యం పెద‌పాడు, కురిడి గ్రామాల్లో ప‌ర్య‌టించిన అధికారులు వాటిని పంచారు.

Kumar

Recent Posts

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

2 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

2 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

4 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

4 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

7 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

10 hours ago