ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధానంగా విశాఖకు మణిహారంగా భావిస్తున్న టీసీఎస్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. టీసీఎస్ సంస్థతో రెండు మాసాల కిందట సర్కారు ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ.. విశాఖలో ఏర్పాటుకు మొగ్గు చూపడంతో ఐటీ హిల్స్పై ఏర్పాటుకు సర్కారు అంగీకరించింది. దీనికిగాను 21.66 ఎకరాలను కేటాయించేందుకు పచ్చజెండా ఊపింది.
దీంతో విశాఖ ఐటీ సిటీకి టీసీఎస్ పెద్ద ఎస్సర్ట్ కానుంది. అదేవిదంగా విశాఖలో ఏర్పాటు చేస్తామని సిద్ధమైన ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి కూడా విశాఖ నగర సమీపంలోనే 3.5 ఎకరాల భూమిని కేటాయించింది. లీజు ప్రాతిపదికన ఈ భూములు కేటాయించడం గమనార్హం. ఈ క్లస్టర్కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, మరో కీలకమైన ప్రాజెక్టు విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టు. మావోయిస్టు ప్రభావిత బలిమెల, జోలాపుట్ ప్రాంతాల్లో హైడల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలన్నది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్.
గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం, వైసీపీ సర్కారు ఈ ప్రాజెక్టులపై ఒడిశాతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వమే ఉండడంతో కూటమి సర్కారుకు మరింత అనుకూల పరిస్తితి ఏర్పడింది. దీంతో ఒడిశా పవర్ కన్సార్టియమ్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. దీని వల్ల 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా.. ఉత్తరాంధ్రలోని కీలక గిరిజన ప్రాంతాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక, విశాఖ సహా.. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కూడా చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. తద్వారా విశాఖ స్వరూపం మారిపోతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.
This post was last modified on April 16, 2025 6:44 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…