Political News

2న అమరావతికి మోదీ.. రాజధాని పనుల పున:ప్రారంభం

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… రాజధాని పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ మేరకు అమరావతి పర్యటనకు సంబంధించి మోదీ షెడ్యూల్ మంగళవారం ఖరారు అయ్యింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాటి కేబినెట్ భేటీలో ప్రకటించారు. ప్రధాని పర్యటన తర్వాత అమరావతిలో రాజధాని పనులు శరవేగంగా సాగనున్నాయి.

వాస్తవానికి ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు… ప్రధానికి ఆహ్వానం పలికారు. అయితే పలు దేశాల పర్యటన, ఇతరత్రా ముందుగానే నిర్ణయం అయిన కార్యక్రమాల నేపథ్యంలో ఏప్రిల్ లో ఏపీ పర్యటనకు మోదీ రావడం కుదరలేదు. అయితే రాజధాని పనుల పున:ప్రారంభాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రధాని కార్యాలయం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే 2న మోదీ అమరావతి పర్యటనను ఖరారు చేసింది. అయితే అమరావతి పర్యటనకు మోదీ నుంచి ఇదివరకే సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో… అమరావతిలో రాజధాని పనులను మోదీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లను కూటమి సర్కారు ఇదివరకే ప్రారంభించింది.

టీడీపీ గత పాలనలోనే అమరావతిలో రాజధాని పనులు ప్రారంభం కాగా.. వాటిని ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా, పూర్తి శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొని పనులను ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాజాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే తిరిగి రాజధాని పనులకు ఊపు వచ్చింది. మధ్యలో నిలిచిన పనులను ఇప్పటికే ప్రారంభించిన కూటమి సర్కారు… కొత్తగా చేపట్టే పనులకు మోదీతో శంకుస్థాపన చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని గతంలో కంటే మరింత ఘనంగా నిర్వహించేందుకు చంద్రబాబు సర్కారు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 15, 2025 3:47 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పూరి సినిమా.. అతను గానీ ఒప్పుకుంటే

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు…

47 minutes ago

తీవ్రవాదం – టాలీవుడ్ సినిమాల ఉక్కుపాదం

దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ దుర్ఘటన పట్ల చిన్నా పెద్దా ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ నుంచి…

48 minutes ago

గాడ్జిల్లా చూసాం….ఈ నాగ్జిల్లా ఏంటయ్యా

ప్రేక్షకులను బాలీవుడ్ మేకర్స్ ఎలా ఊహించుకుంటున్నారో కానీ కొన్ని సినిమాలు ప్రకటనల స్టేజి దగ్గరే నవ్వు తెప్పిస్తున్నాయి. నిన్న కార్తీక్…

1 hour ago

ఫౌజీ హీరోయిన్ మీద వివాదమెందుకు

యావత్ దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ సంఘటన తర్వాత ఊహించని కోణాల్లో వివాదాలు తలెత్తున్నాయి. తాజాగా ప్రభాస్ ఫౌజీ ద్వారా హీరోయిన్…

2 hours ago

వీరయ్య చౌదరి హత్య…రంగంలోకి 12 పోలీసు బృందాలు!

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…

2 hours ago

పీఎస్ఆర్ ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్!

బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న…

3 hours ago