Political News

2న అమరావతికి మోదీ.. రాజధాని పనుల పున:ప్రారంభం

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… రాజధాని పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ మేరకు అమరావతి పర్యటనకు సంబంధించి మోదీ షెడ్యూల్ మంగళవారం ఖరారు అయ్యింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాటి కేబినెట్ భేటీలో ప్రకటించారు. ప్రధాని పర్యటన తర్వాత అమరావతిలో రాజధాని పనులు శరవేగంగా సాగనున్నాయి.

వాస్తవానికి ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు… ప్రధానికి ఆహ్వానం పలికారు. అయితే పలు దేశాల పర్యటన, ఇతరత్రా ముందుగానే నిర్ణయం అయిన కార్యక్రమాల నేపథ్యంలో ఏప్రిల్ లో ఏపీ పర్యటనకు మోదీ రావడం కుదరలేదు. అయితే రాజధాని పనుల పున:ప్రారంభాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రధాని కార్యాలయం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే 2న మోదీ అమరావతి పర్యటనను ఖరారు చేసింది. అయితే అమరావతి పర్యటనకు మోదీ నుంచి ఇదివరకే సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో… అమరావతిలో రాజధాని పనులను మోదీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లను కూటమి సర్కారు ఇదివరకే ప్రారంభించింది.

టీడీపీ గత పాలనలోనే అమరావతిలో రాజధాని పనులు ప్రారంభం కాగా.. వాటిని ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా, పూర్తి శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొని పనులను ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాజాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే తిరిగి రాజధాని పనులకు ఊపు వచ్చింది. మధ్యలో నిలిచిన పనులను ఇప్పటికే ప్రారంభించిన కూటమి సర్కారు… కొత్తగా చేపట్టే పనులకు మోదీతో శంకుస్థాపన చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని గతంలో కంటే మరింత ఘనంగా నిర్వహించేందుకు చంద్రబాబు సర్కారు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 15, 2025 3:47 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

3 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

6 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

6 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

7 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

7 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

8 hours ago