“విచారణకు రండి. ఈ నెల 18న హాజరై మాకు సహకరించండి. వచ్చేప్పుడు మీ వద్ద ఉన్న ఆధారాలు వివరాలు కూడా తీసుకురండి!” అని వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డికి వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తాజాగా నోటీసులు పంపించారు. ఆయన ఈమెయిల్ సహావాట్సాప్లకు ఈ నోటీసులు పంపించారని అధికారులు తెలిపారు.
ఈ నెల 18న విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం కార్యాలయం(విజయవాడలోని పోలీసు కమిషనరేట్)లో హాజరు కావాలని సాయిరెడ్డికి తేల్చిచెప్పారు. కాగా.. ఈ కేసులో సాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. గతంలో మరో కేసులో ఆయనను ఏపీ సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. ఇప్పుడు మద్యంకుంభకోణంలో విచారణకు హాజరు కావాలని తాఖీదులు ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరు లో సొంత మీడియా ఛానెల్ పనులపై బిజీగా ఉన్న సాయిరెడ్డి ఏమేరకు సిట్కు సహకరిస్తారో చూడాలి.
ఇదిలావుంటే.. వైసీపీ హయాంలో నకిలీ బ్రాండ్లు తయారు చేసి.. ప్రజలకు ఎక్కువ మొత్తాలకు లిక్కర్ విక్రయించి.. సొమ్ములు చేసుకున్నారన్న అభియోగాలు ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు నకు ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఈ కుంభకోణానికి కర్త-కర్మ-క్రియగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని వెంటాడుతోంది. ఇప్పటకే మూడు సార్లు విచారణకు పిలిచినా ఆయన తప్పించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, రాయదుర్గం వంటి చోట్ల ఉన్న ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించి.. విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సాయిరెడ్డికి కూడా.. నోటీసులు ఇచ్చా రు. ఈయనకు చెందిన బంధువుల ప్రమేయం లిక్కర్ కుంభకోణంలో ఉందని అధికారులు చెబుతున్నారు.
This post was last modified on April 15, 2025 3:35 pm
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…