కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు.. సోనియా గాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భర్త.. రాబర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి టార్గెట్ చేశారు. విచారణకురావాలంటూ.. తాజాగా ఆయనకు నోటీసులు పంపించారు. ఈ నెల 20న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ.. ఈడీ అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. వచ్చేప్పుడు.. గుర్గావ్లోని భూములకు సంబంధించి ఉన్న ఆధారాలను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు.
కాగా.. గత మూడేళ్ల కిందటే వాద్రాపై కేసులు నమోదయ్యాయి. అయితే.. ఆయన వీటిని గతంలోనే కోర్టులో సవాల్ చేయగా.. కొన్ని కేసుల్లో స్టే లభించినా.. గుర్గావ్ భూములకు సంబంధించి.. మాత్రం కోర్టు విచారణ వాయిదాపడంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈడీ ఈ కేసుల విచారణను ముమ్మరం చేసింది. గత నెలలోనే ఒక నోటీసును జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే.. వాద్రా ఈ విచారణకు రాకుండా..ఈడీ తన పరివారం చెప్పినట్టు వింటోందని రాజకీయ విమర్శలు చేశారు.
ఇక, అసలు విషయానికి వస్తే… కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తొలి దశలో అంటే.. 2004-14 మధ్య ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి దానిని 1000 కోట్లకు విక్రయిం చారన్న ఆరోపణలు వున్నాయి. అయితే.. ఈబూములు ఇచ్చిన వారికి వాద్రా తిరిగి సొమ్ములు చెల్లించ కుండానే.. వాటిని ఆక్రమించారని ఫిర్యాదులు వచ్చాయి. వాస్తవానికి యూపీలో 2 హయాంలోనే ఈ కేసులు వచ్చినా.. అప్పట్లో తొక్కిపెట్టారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుల్లో కదలిక వచ్చింది.
మొత్తం రూ.7.5 కోట్ల విలువైన భూ వ్యవహారంలో కేసులు నమోదై.. విచారణ దశకు కూడా వచ్చాయి. అయితే.. కోర్టుల జోక్యంతో విచారణ మందగించింది. కాగా.. ఇప్పుడు మరోసారి వాద్రాకు వరుస నోటీసులు రావడం గమనార్హం. కాగా.. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. గుజరాత్పై తాము ఫోకస్ చేస్తున్నందుకే.. తమ పార్టీ నాయకుల కుటుంబాలపై కేసులు పెడుతున్నారని విచారణల పేరుతో వేధిస్తున్నారని కేంద్రంపై విమర్శలు ఎక్కు పెట్టారు.
This post was last modified on April 15, 2025 4:00 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…