కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు.. సోనియా గాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భర్త.. రాబర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి టార్గెట్ చేశారు. విచారణకురావాలంటూ.. తాజాగా ఆయనకు నోటీసులు పంపించారు. ఈ నెల 20న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ.. ఈడీ అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. వచ్చేప్పుడు.. గుర్గావ్లోని భూములకు సంబంధించి ఉన్న ఆధారాలను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు.
కాగా.. గత మూడేళ్ల కిందటే వాద్రాపై కేసులు నమోదయ్యాయి. అయితే.. ఆయన వీటిని గతంలోనే కోర్టులో సవాల్ చేయగా.. కొన్ని కేసుల్లో స్టే లభించినా.. గుర్గావ్ భూములకు సంబంధించి.. మాత్రం కోర్టు విచారణ వాయిదాపడంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈడీ ఈ కేసుల విచారణను ముమ్మరం చేసింది. గత నెలలోనే ఒక నోటీసును జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే.. వాద్రా ఈ విచారణకు రాకుండా..ఈడీ తన పరివారం చెప్పినట్టు వింటోందని రాజకీయ విమర్శలు చేశారు.
ఇక, అసలు విషయానికి వస్తే… కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తొలి దశలో అంటే.. 2004-14 మధ్య ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి దానిని 1000 కోట్లకు విక్రయిం చారన్న ఆరోపణలు వున్నాయి. అయితే.. ఈబూములు ఇచ్చిన వారికి వాద్రా తిరిగి సొమ్ములు చెల్లించ కుండానే.. వాటిని ఆక్రమించారని ఫిర్యాదులు వచ్చాయి. వాస్తవానికి యూపీలో 2 హయాంలోనే ఈ కేసులు వచ్చినా.. అప్పట్లో తొక్కిపెట్టారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుల్లో కదలిక వచ్చింది.
మొత్తం రూ.7.5 కోట్ల విలువైన భూ వ్యవహారంలో కేసులు నమోదై.. విచారణ దశకు కూడా వచ్చాయి. అయితే.. కోర్టుల జోక్యంతో విచారణ మందగించింది. కాగా.. ఇప్పుడు మరోసారి వాద్రాకు వరుస నోటీసులు రావడం గమనార్హం. కాగా.. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. గుజరాత్పై తాము ఫోకస్ చేస్తున్నందుకే.. తమ పార్టీ నాయకుల కుటుంబాలపై కేసులు పెడుతున్నారని విచారణల పేరుతో వేధిస్తున్నారని కేంద్రంపై విమర్శలు ఎక్కు పెట్టారు.
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…