Political News

సోనియా అల్లుడికి ఈడీ న‌జ‌ర్‌.. ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు.. సోనియా గాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భ‌ర్త‌.. రాబ‌ర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు మ‌రోసారి టార్గెట్ చేశారు. విచార‌ణ‌కురావాలంటూ.. తాజాగా ఆయ‌న‌కు నోటీసులు పంపించారు. ఈ నెల 20న ఢిల్లీలోని త‌మ‌ కార్యాల‌యానికి రావాలంటూ.. ఈడీ అధికారులు నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు. వ‌చ్చేప్పుడు.. గుర్గావ్‌లోని భూములకు సంబంధించి ఉన్న ఆధారాల‌ను కూడా తీసుకురావాల‌ని పేర్కొన్నారు.

కాగా.. గ‌త మూడేళ్ల కింద‌టే వాద్రాపై కేసులు న‌మోద‌య్యాయి. అయితే.. ఆయ‌న వీటిని గ‌తంలోనే కోర్టులో స‌వాల్ చేయ‌గా.. కొన్ని కేసుల్లో స్టే ల‌భించినా.. గుర్గావ్ భూముల‌కు సంబంధించి.. మాత్రం కోర్టు విచార‌ణ వాయిదాప‌డంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఈడీ ఈ కేసుల విచార‌ణ‌ను ముమ్మ‌రం చేసింది. గ‌త నెల‌లోనే ఒక నోటీసును జారీ చేసింది. ఈ నెల 8న విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించింది. అయితే.. వాద్రా ఈ విచార‌ణ‌కు రాకుండా..ఈడీ త‌న ప‌రివారం చెప్పిన‌ట్టు వింటోంద‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేశారు.

ఇక‌, అస‌లు విష‌యానికి వ‌స్తే… కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం తొలి ద‌శ‌లో అంటే.. 2004-14 మ‌ధ్య ఢిల్లీకి స‌మీపంలోని గుర్గావ్‌లో రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వేసి దానిని 1000 కోట్ల‌కు విక్ర‌యిం చార‌న్న ఆరోప‌ణ‌లు వున్నాయి. అయితే.. ఈబూములు ఇచ్చిన వారికి వాద్రా తిరిగి సొమ్ములు చెల్లించ కుండానే.. వాటిని ఆక్ర‌మించార‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. వాస్త‌వానికి యూపీలో 2 హ‌యాంలోనే ఈ కేసులు వ‌చ్చినా.. అప్ప‌ట్లో తొక్కిపెట్టారు. మోడీ అధికారంలోకి వ‌చ్చాక ఈ కేసుల్లో క‌ద‌లిక వ‌చ్చింది.

మొత్తం రూ.7.5 కోట్ల విలువైన భూ వ్యవహారంలో కేసులు న‌మోదై.. విచార‌ణ ద‌శ‌కు కూడా వ‌చ్చాయి. అయితే.. కోర్టుల జోక్యంతో విచార‌ణ మంద‌గించింది. కాగా.. ఇప్పుడు మ‌రోసారి వాద్రాకు వ‌రుస నోటీసులు రావ‌డం గ‌మ‌నార్హం. కాగా.. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. గుజ‌రాత్‌పై తాము ఫోక‌స్ చేస్తున్నందుకే.. త‌మ పార్టీ నాయ‌కుల కుటుంబాల‌పై కేసులు పెడుతున్నార‌ని విచార‌ణ‌ల పేరుతో వేధిస్తున్నార‌ని కేంద్రంపై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు.

This post was last modified on April 15, 2025 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago