తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. “అడవుల్లోకి బుల్ డోజర్లు పంపిస్తున్నారు“ అంటూ.. ఆయన ఎద్దేవా చేశారు. తాజాగా హరియాణాలో పర్యటించిన ప్రధాని మోడీ… అక్కడి వన్యప్రాణుల సంరక్షణపై నిర్వహిం చిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రస్తావనను తీసుకువచ్చారు.
కాంగ్రెస్ పాలిత తెలంగాణలో అడవుల్లోకి బుల్ డోజర్లు పంపిస్తున్నారని.. తద్వారా వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయని విమర్శించారు. అటవీ సంపదను కొల్లగొట్టేందుకు సాధ్యం కాదని.. అందుకే ధ్వంసం చేస్తున్నారని.. నేరుగా కాంగ్రెస్ పేరు పెట్టి విమర్శలు గుప్పించారు. “అడవుల్లోకి బుల్ డోజర్లు పంపడంలోనూ.. వన్యప్రాణుల ప్రాణాలను హరించడంలోనూ.. తెలంగాణ ప్రభుత్వం చాలా బిజీబిజీగా ఉంది. “ అని ఎద్దేవా చేశారు.
ఎందుకిలా?
ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున రచ్చ రేగింది. ఈ 400 ఎకరాల్లోనూ దట్టమైన చెట్లు పెరిగిపోయి.. వన్య ప్రాణులుకూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక, దీనిని పరిశుభ్రం చేసే క్రమంలో 100 ఎకరాల్లో అటవీ భూములలోని చెట్లను నరికేశారు. దీనిపై బీఆర్ ఎస్ సహా కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
ఈలోగా.. ఇదే ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఓ లేడి కూనను కుక్కలు తరిమి తరిమి చంపేశాయి. ఈ పరిణామాలను ఉటంకిస్తూ.. ప్రధాని తాజాగా హరియాణాలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యాఖ్యలు చేయ డం గమనార్హం. మరి ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on April 14, 2025 5:32 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…