ఎవరైనా నాయకులు ఎన్నికలకు ముందు ఏదైనా హామీ ఇస్తే.. దానిని నెరవేర్చేందుకు సమయం పడుతుంది. పైగా గెలిచిన తర్వాత.. వారిచ్చిన హామీలను అమలు చేయాలంటూ.. ప్రజలు గుర్తు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే.. నాయకులు ఇచ్చే హామీల్లో సగానికి పైగా అమలుకు నోచుకోవడం కష్టమనే టాక్ ఉంది. అయితే.. ఈ వాదనను కొట్టి పారేస్తూ.. మంత్రి నారా లోకేష్.. తన తండ్రి చంద్రబాబుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఆదివారం నారా లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి మిత్ర పక్షాల నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సహా.. టీడీపీ నాయకులను కూడా ఆహ్వానించారు. ఎలాంటి అట్టహాసం లేకుండా.. సాధారణంగానే ఈ కార్యక్రమానికి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది ఇదే సమయానికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని ఈ సందర్భంగా నారా లోకేష్ చెప్పారు.
అయితే.. వాస్తవానికి గత ఏడాది ఎన్నికలకు ముందు మంగళగిరిలో పర్యటించి యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్.. తనను గెలిపిస్తే.. ఏడాదిలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. అయితే..ఎప్పటిలాగానే.. అందరిలాగానే.. నారా లోకేష్ కూడా.. తన పనుల్లో పడి ఈ విషయం మరిచిపోతారని.. మంగళగిరి ప్రజలు అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా.. తాను ఇచ్చిన ఏడాది గడువుకు రెండు మాసాల ముందే శంకుస్థాపన చేశారు.
అంటే.. కేవలం 10 మాసాల్లోనే సర్కారు నుంచి అనుమతులు తెచ్చుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. ప్రస్తుతం మంగళగిరి ప్రజలు సాధారణ వైద్యానికి ఎయిమ్స్ను ఆశ్రయిస్తున్నారు. అయితే.. ఇక్కడ పడకలు ఉన్నా.. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడి వారికి ప్రత్యేకంగాఆసుపత్రి అవసరమని భావించిన నారా లోకేష్.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు కార్యాచరణకు పూనుకొన్నారు.
This post was last modified on April 14, 2025 3:56 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…