ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే అందుకోసమే కొందరు భామలుండేవారు. వాళ్లే ఆ పాటలు చేసేవారు. కానీ గత దశాబ్ద కాలంలో అంతా మారిపోయింది. స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్లో అదరగొట్టేస్తున్నారు. ఆ పాటలను హీరోయిన్లు తక్కువగా చూసే రోజులు ఎప్పుడో పోయాయి. టాలీవుడ్లో అగ్ర కథానాయికలుగా వెలుగొందిన అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, శ్రుతి హాసన్.. ఇలా అందరూ ఐటెం సాంగ్స్లో మెరిసిన వాళ్లే. ప్రస్తుతం ఈ పాటలకు బాగా పేరుపడ్డ కథానాయిక అంటే తమన్నా అనే చెప్పాలి. ఆల్రెడీ దక్షిణాదిన చెప్పుకోదగ్గ సంఖ్యలో ఐటెం సాంగ్స్ చేసిన మిల్కీ బ్యూటీ.. ఈ మధ్య హిందీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్తో అక్కడి జనాలను ఒక ఊపు ఊపేస్తోంది.
గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ స్త్రీ-2లో తమన్నా పాట ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. అందులో తమన్నా డ్యాన్స్ మూమెంట్స్, తన అందచందాలు కుర్రకారును ఊపేశాయి. ఇప్పుడు మరో ఐటెం సాంగ్తో రచ్చ షురూ చేసింది తమన్నా. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన రైడ్-2 కోసం తమన్నా ఒక ఐటెం సాంగ్ చేసింది. ఇటీవలే ట్రైలర్తో క్లాస్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్ర బృందం.. తాజాగా ఐటెం సాంగ్తో మాస్కు, యూత్కు వల వేసింది.
ఇప్పటిదాకా తమన్నా చేసిన అన్ని ఐటెం సాంగ్స్ కంటే ఇది హాట్ హాట్గా ఉండడం.. కుర్రాళ్లను బాగా కవ్వించేలా తమన్నా లుక్స్, స్టెప్స్ ఉండడంతో సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్లో ఉంది. తమన్నా షార్ట్ వీడియోలు కట్ చేసి కుర్రాళ్లు వైరల్ చేస్తున్నారు. స్త్రీ-2 తరహాలోనే రైడ్-2కు కూడా తమన్నా పాట హైలైట్ అయి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉంది. సూపర్ హిట్ మూవీ రైడ్కు సీక్వెల్గా తెరకెక్కిన రైడ్-2 మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తన కెరీర్లో కల్ట్ క్యారెక్టర్గా నిలిచిపోయిన అమయ్ పట్నాయక్ పాత్రలో అజయ్ మరోసారి అదరగొట్టేలా ఉన్నాడు. రైడ్లో ఇలియానా కథానాయికగా నటించగా.. సీక్వెల్లో వాణి కపూర్ అజయ్కి జంటగా కనిపించనుంది.
This post was last modified on April 14, 2025 11:23 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…