బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన రాధికా.. తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ‘లయన్’, ‘లెజెండ్’ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ‘లెజెండ్’ తర్వాత రాధిక మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఈ సంగతి పక్కన పెడితే తాను దక్షిణాదిన నటించిన ఓ చిత్రం షూట్ సందర్భంగా హీరో తనతో అనుచితంగా ప్రవర్తించడం గురించి రాధికా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఆ హీరో ఎవరనే విషయంలో డిస్కషన్లు బాగానే జరిగాయి.
ఆ చేదు అనుభవం వల్లేనేమో మళ్లీ సౌత్ సినిమాల్లో రాధికా నటించనే లేదు. ఆమెకూ ఇక్కడి వాళ్లు ఛాన్సులివ్వలేదు. ఐతే చాలా గ్యాప్ తర్వాత రాధికా ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించనున్న చిత్రంలో రాధికా కీలక పాత్ర చేయబోతోందట. ఇది పాన్ ఇండియా మూవీనే అయినప్పటికీ.. బేసిగ్గా తెలుగు చిత్రమే.
ఇందులో ఇప్పటికే టబు ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. ఐతే ఆమెది సేతుపతికి జోడీగా ఉండే పాత్ర కాదట. రాధికాకే ఆ ఛాన్స్ ఇచ్చాడట పూరి. సేతుపతి, టబు, రాధికా లాంటి కాస్టింగ్ అంటే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. కాస్టింగ్గా క్యూరియాసిటీ పెంచడంలో పూరి బాగానే విజయవంతం అవుతున్నాడు. ఇక స్క్రిప్టులోనూ బలం ఉండి, టేకింగ్లోనూ ఒకప్పటిలా మెరుపులు మెరిపించగలిగితే పూరి ఖాతాలో మళ్లీ ఓ హిట్ పడబోతున్నట్లే. జూన్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
This post was last modified on April 13, 2025 4:46 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…