Movie News

మళ్లీ టాలీవుడ్‌కు రాధికా ఆప్టే

బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన రాధికా.. తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ‘లయన్’, ‘లెజెండ్’ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ‘లెజెండ్’ తర్వాత రాధిక మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఈ సంగతి పక్కన పెడితే తాను దక్షిణాదిన నటించిన ఓ చిత్రం షూట్ సందర్భంగా హీరో తనతో అనుచితంగా ప్రవర్తించడం గురించి రాధికా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఆ హీరో ఎవరనే విషయంలో డిస్కషన్లు బాగానే జరిగాయి.

ఆ చేదు అనుభవం వల్లేనేమో మళ్లీ సౌత్ సినిమాల్లో రాధికా నటించనే లేదు. ఆమెకూ ఇక్కడి వాళ్లు ఛాన్సులివ్వలేదు. ఐతే చాలా గ్యాప్ తర్వాత రాధికా ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించనున్న చిత్రంలో రాధికా కీలక పాత్ర చేయబోతోందట. ఇది పాన్ ఇండియా మూవీనే అయినప్పటికీ.. బేసిగ్గా తెలుగు చిత్రమే.

ఇందులో ఇప్పటికే టబు ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. ఐతే ఆమెది సేతుపతికి జోడీగా ఉండే పాత్ర కాదట. రాధికాకే ఆ ఛాన్స్ ఇచ్చాడట పూరి. సేతుపతి, టబు, రాధికా లాంటి కాస్టింగ్ అంటే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. కాస్టింగ్‌గా క్యూరియాసిటీ పెంచడంలో పూరి బాగానే విజయవంతం అవుతున్నాడు. ఇక స్క్రిప్టులోనూ బలం ఉండి, టేకింగ్‌లోనూ ఒకప్పటిలా మెరుపులు మెరిపించగలిగితే పూరి ఖాతాలో మళ్లీ ఓ హిట్ పడబోతున్నట్లే. జూన్‌లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Kumar

Recent Posts

బాలకృష్ణ లైనప్ స్పష్టంగా ఉంది

సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…

5 minutes ago

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

52 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

8 hours ago