తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయాక.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును స్వాగతిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. పొత్తు ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తమిళనాడు ప్రజలకు మంచి పాలన అందించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ హర్షిస్తారని తెలిపారు.
అంతేకాదు.. అన్నాడీఎంకే సారథ్యంలో బీజేపీ నడుస్తుందని ప్రకటించడం ద్వారా తమిళుల మనసును కమలం పార్టీ నాయకు లు చూరగొన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళని స్వామిని ఎంచుకోవడం ద్వారా అనుభవంతో కూడిన నాయకులకు బీజేపీ పెద్దపీట వేస్తున్న సంకేతాలు ఇచ్చినట్టు అయిందని అన్నారు. తమిళనాడులోని చాలా జిల్లాలు వెనుక బడ్డాయని.. బీజేపీ సారథ్యంలో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పడితే.. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని పవన్ చెప్పారు. ఎన్డీయే విధి విధానాలతో కూటమి పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో పయనిస్తున్నాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చేందుకు అన్నాడీఎంకేకు.. జాతీ య పార్టీ బీజేపీతో పొత్తు అనివార్యమైంది. ఇక, తమ దక్షిణాది విస్తరణ ఆకాంక్షను సఫలం చేసుకునేందుకు బీజేపీకి కూడా.. పొత్తు అవసరం. 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇలా పొత్తు పెట్టుకునే కొంత మేరకు లబ్ధి పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నాడీఎంకేతో హుటాహుటిన పొత్తు పెట్టుకోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రముఖ ఆడిటర్, ఆర్ ఎస్ ఎస్ క్రియాశీలక నాయకుడు గురుమూర్తి సలహా తీసుకున్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొత్తును ప్రకటించడం గమనార్హం.
అంతేకాదు.. అతి పెద్ద జాతీయ పార్టీగా అవతరించిన బీజేపీ.. తమిళనాడులో మాత్రం అన్నాడీఎంకే సారథ్యంలో పనిచేస్తుందని కూడా ఆయన ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు. వెంటనే గ్రామ గ్రామాన.. పర్యటించి.. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాలని మీడియా ముఖంగానే బీజేపీ, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలకు బీజేపీ అగ్రనేత సూచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర చిన్నా చితకా పార్టీలతో పొత్తులో ఉన్న డీఎంకేను బలంగా ఢీ కొట్టేందుకు.. దాదాపు ఏడాది ముందుగానే బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేయడంగమనార్హం.
This post was last modified on April 12, 2025 10:29 am
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…
మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…
సినిమా నచ్చితే మరోసారి చూడటం, టికెట్లు దొరకకపోతే మరో షోకు వెళ్లడం చూస్తుంటాం. కానీ తమకు కావాల్సిన సినిమాను థియేటర్…