Political News

త‌మిళ‌నాడుకు మంచి రోజులు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవ‌డంపై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం రాత్రి పొద్దు పోయాక‌.. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీనిలో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును స్వాగ‌తిస్తున్న‌ట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు. పొత్తు ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు మంచి పాల‌న అందించేందుకు బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ హ‌ర్షిస్తార‌ని తెలిపారు.

అంతేకాదు.. అన్నాడీఎంకే సార‌థ్యంలో బీజేపీ న‌డుస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా త‌మిళుల మ‌న‌సును క‌మ‌లం పార్టీ నాయ‌కు లు చూర‌గొన్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప‌ళ‌ని స్వామిని ఎంచుకోవ‌డం ద్వారా అనుభ‌వంతో కూడిన నాయ‌కుల‌కు బీజేపీ పెద్ద‌పీట వేస్తున్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని అన్నారు. త‌మిళ‌నాడులోని చాలా జిల్లాలు వెనుక బ‌డ్డాయ‌ని.. బీజేపీ సార‌థ్యంలో అన్నాడీఎంకే కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి ఫ‌లాలు అందుతాయ‌ని ప‌వ‌న్ చెప్పారు. ఎన్డీయే విధి విధానాల‌తో కూట‌మి పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో ప‌య‌నిస్తున్నాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు అన్నాడీఎంకేకు.. జాతీ య పార్టీ బీజేపీతో పొత్తు అనివార్య‌మైంది. ఇక‌, త‌మ ద‌క్షిణాది విస్త‌ర‌ణ ఆకాంక్ష‌ను స‌ఫ‌లం చేసుకునేందుకు బీజేపీకి కూడా.. పొత్తు అవ‌స‌రం. 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ ఇలా పొత్తు పెట్టుకునే కొంత మేర‌కు ల‌బ్ధి పొందింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అన్నాడీఎంకేతో హుటాహుటిన పొత్తు పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో ప్ర‌ముఖ ఆడిట‌ర్‌, ఆర్ ఎస్ ఎస్ క్రియాశీల‌క నాయ‌కుడు గురుమూర్తి స‌ల‌హా తీసుకున్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షా ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా పొత్తును ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. అతి పెద్ద జాతీయ పార్టీగా అవ‌త‌రించిన బీజేపీ.. త‌మిళ‌నాడులో మాత్రం అన్నాడీఎంకే సార‌థ్యంలో ప‌నిచేస్తుంద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించి.. అంద‌రినీ ఆశ్చ‌ర్యంలోకి నెట్టారు. వెంట‌నే గ్రామ గ్రామాన‌.. ప‌ర్య‌టించి.. డీఎంకే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను పెంచాల‌ని మీడియా ముఖంగానే బీజేపీ, అన్నాడీఎంకే నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు బీజేపీ అగ్ర‌నేత సూచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ స‌హా ఇత‌ర చిన్నా చిత‌కా పార్టీల‌తో పొత్తులో ఉన్న డీఎంకేను బ‌లంగా ఢీ కొట్టేందుకు.. దాదాపు ఏడాది ముందుగానే బీజేపీ వ్యూహాత్మ‌క అడుగులు వేయ‌డంగ‌మ‌నార్హం.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

34 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

40 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

54 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago