తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయాక.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును స్వాగతిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. పొత్తు ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తమిళనాడు ప్రజలకు మంచి పాలన అందించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ హర్షిస్తారని తెలిపారు.
అంతేకాదు.. అన్నాడీఎంకే సారథ్యంలో బీజేపీ నడుస్తుందని ప్రకటించడం ద్వారా తమిళుల మనసును కమలం పార్టీ నాయకు లు చూరగొన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళని స్వామిని ఎంచుకోవడం ద్వారా అనుభవంతో కూడిన నాయకులకు బీజేపీ పెద్దపీట వేస్తున్న సంకేతాలు ఇచ్చినట్టు అయిందని అన్నారు. తమిళనాడులోని చాలా జిల్లాలు వెనుక బడ్డాయని.. బీజేపీ సారథ్యంలో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పడితే.. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని పవన్ చెప్పారు. ఎన్డీయే విధి విధానాలతో కూటమి పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో పయనిస్తున్నాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చేందుకు అన్నాడీఎంకేకు.. జాతీ య పార్టీ బీజేపీతో పొత్తు అనివార్యమైంది. ఇక, తమ దక్షిణాది విస్తరణ ఆకాంక్షను సఫలం చేసుకునేందుకు బీజేపీకి కూడా.. పొత్తు అవసరం. 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇలా పొత్తు పెట్టుకునే కొంత మేరకు లబ్ధి పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నాడీఎంకేతో హుటాహుటిన పొత్తు పెట్టుకోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రముఖ ఆడిటర్, ఆర్ ఎస్ ఎస్ క్రియాశీలక నాయకుడు గురుమూర్తి సలహా తీసుకున్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొత్తును ప్రకటించడం గమనార్హం.
అంతేకాదు.. అతి పెద్ద జాతీయ పార్టీగా అవతరించిన బీజేపీ.. తమిళనాడులో మాత్రం అన్నాడీఎంకే సారథ్యంలో పనిచేస్తుందని కూడా ఆయన ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు. వెంటనే గ్రామ గ్రామాన.. పర్యటించి.. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాలని మీడియా ముఖంగానే బీజేపీ, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలకు బీజేపీ అగ్రనేత సూచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర చిన్నా చితకా పార్టీలతో పొత్తులో ఉన్న డీఎంకేను బలంగా ఢీ కొట్టేందుకు.. దాదాపు ఏడాది ముందుగానే బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేయడంగమనార్హం.
This post was last modified on April 12, 2025 10:29 am
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…