Political News

త‌మిళ‌నాడుకు మంచి రోజులు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవ‌డంపై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం రాత్రి పొద్దు పోయాక‌.. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీనిలో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును స్వాగ‌తిస్తున్న‌ట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు. పొత్తు ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు మంచి పాల‌న అందించేందుకు బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ హ‌ర్షిస్తార‌ని తెలిపారు.

అంతేకాదు.. అన్నాడీఎంకే సార‌థ్యంలో బీజేపీ న‌డుస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా త‌మిళుల మ‌న‌సును క‌మ‌లం పార్టీ నాయ‌కు లు చూర‌గొన్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప‌ళ‌ని స్వామిని ఎంచుకోవ‌డం ద్వారా అనుభ‌వంతో కూడిన నాయ‌కుల‌కు బీజేపీ పెద్ద‌పీట వేస్తున్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని అన్నారు. త‌మిళ‌నాడులోని చాలా జిల్లాలు వెనుక బ‌డ్డాయ‌ని.. బీజేపీ సార‌థ్యంలో అన్నాడీఎంకే కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి ఫ‌లాలు అందుతాయ‌ని ప‌వ‌న్ చెప్పారు. ఎన్డీయే విధి విధానాల‌తో కూట‌మి పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో ప‌య‌నిస్తున్నాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు అన్నాడీఎంకేకు.. జాతీ య పార్టీ బీజేపీతో పొత్తు అనివార్య‌మైంది. ఇక‌, త‌మ ద‌క్షిణాది విస్త‌ర‌ణ ఆకాంక్ష‌ను స‌ఫ‌లం చేసుకునేందుకు బీజేపీకి కూడా.. పొత్తు అవ‌స‌రం. 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ ఇలా పొత్తు పెట్టుకునే కొంత మేర‌కు ల‌బ్ధి పొందింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అన్నాడీఎంకేతో హుటాహుటిన పొత్తు పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో ప్ర‌ముఖ ఆడిట‌ర్‌, ఆర్ ఎస్ ఎస్ క్రియాశీల‌క నాయ‌కుడు గురుమూర్తి స‌ల‌హా తీసుకున్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షా ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా పొత్తును ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. అతి పెద్ద జాతీయ పార్టీగా అవ‌త‌రించిన బీజేపీ.. త‌మిళ‌నాడులో మాత్రం అన్నాడీఎంకే సార‌థ్యంలో ప‌నిచేస్తుంద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించి.. అంద‌రినీ ఆశ్చ‌ర్యంలోకి నెట్టారు. వెంట‌నే గ్రామ గ్రామాన‌.. ప‌ర్య‌టించి.. డీఎంకే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను పెంచాల‌ని మీడియా ముఖంగానే బీజేపీ, అన్నాడీఎంకే నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు బీజేపీ అగ్ర‌నేత సూచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ స‌హా ఇత‌ర చిన్నా చిత‌కా పార్టీల‌తో పొత్తులో ఉన్న డీఎంకేను బ‌లంగా ఢీ కొట్టేందుకు.. దాదాపు ఏడాది ముందుగానే బీజేపీ వ్యూహాత్మ‌క అడుగులు వేయ‌డంగ‌మ‌నార్హం.

Satya

Recent Posts

రాజమౌళి లక్ష్యం… సినీ ప్రియుల స్వప్మం

తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…

1 hour ago

సేతుపతి స్థానంలో రాజశేఖర్?

దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…

1 hour ago

అరడజను సినిమాలు ‘పెద్ది’కి పోటీగా

అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…

2 hours ago

తెలంగాణలో పెద్ది టెన్షన్… కానీ ఏపీలో మొదలెట్టేశారు

తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…

2 hours ago

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చు రాజుకుందా…?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…

2 hours ago

‘బీజేపీ ఆడమన్నట్టు పవన్ అడుగుతున్నారు’

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…

3 hours ago