Political News

తెలంగాణను మించిన స్పీడుతో ఏపీ

పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలు గానీ, అభిప్రాయ బేధాలు గానీ తలెత్తకుండా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ నిలిస్తే… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏపీ దాదాపుగా లాగేసుకునే దిశగా దూసుకుపోతోందని చెప్పక తప్పదు. ఇరు రాష్ట్రాలకు భౌగోళిక వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి వారుగా తమ రాష్ట్రాలకు సరిపడ రంగాలను ఎంచుకుని ముందుకు సాగుతున్నాయి. ఇక ఇరు రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న రంగాల్లో ఏపీ ఒకింత దూకుడుగా సాగుతోందని చెప్పక తప్పదు.

ప్రస్తుతం మహారాష్ట్ర రాజధాని ముంబైలో దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ జరుగుతోంది. ఈ వర్క్ షాప్ కు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటక శాఖ మంత్రులు హాజరవుతున్నారు. ఈ వర్క్ షాప్ కు హాజరయ్యే విషయంలో తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కంటే ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఒక అడుగు ముందున్నారు. జూపల్లి గురువారం ఈ సమావేశాలకు హాజరు అవుతుండగా.. బుధవారం ప్రారంభమైన ఈ వర్క్ షాప్ తొలిరోజు సమావేశాల్లోనే సందడి చేశారు. తొలి రోజే దుర్గేశ్ 20కి పైగా ప్రముఖ సంస్థలతో భేటీ అయ్యారు. ఈ వర్క్ షాప్ ఆద్యంతం దుర్గేశ్ బృందం కొనసాగనుంది. అయితే తొలి రోజు భేటీకి కారణమేమిటో తెలియదు గానీ జూపల్లి మాత్రం హాజరు కాలేదు. గురువారం జరిగే ఈ వర్క్ షాప్ నకు మాత్రం ఆయన హాజరు అవుతున్నారు.

ఏపీ నుంచి ఈ వర్క్ షాప్ నకు వెళ్లిన బృందానికి దుర్గేశ్ నేతృత్వం వహిస్తుండగా… రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలిలతో పాటు పర్యాటక రంగానికి చెందిన పలువురు కీలక అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో నూతనంగా హోటళ్ల ఏర్పాటుకు గల అవకాశాలను ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులకు ఈ బృందం వివరించింది. ఇప్పటికే అభివృద్ది చెంది పర్యాటకంగా మంచి స్కోప్ ఉన్న విశాఖ, తిరుపతిలతో పాటు నూతనంగా నిర్మితమవుతున్న అమరావతి, అభివృద్దిలో దూసుకుపోతున్న రాజమహేంద్రవరంలలో హోటళ్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ఆయా సంస్థల ముందు పెట్టారు. ఈ వర్క్ షాప్ ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టే దిశగా దుర్గేశ్ బృందం సాగుతోంది.

This post was last modified on April 10, 2025 6:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సోషల్ మీడియా బుడగ పేల్చిన పూజా హెగ్డే

సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే…

60 minutes ago

తిన్న తర్వాత ఈ ఒక్క పని చేస్తే మీ ఆరోగ్యం పదిలం..

మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…

2 hours ago

బాలయ్య పుట్టిన రోజు కానుకలు ఇవేనా?

నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…

5 hours ago

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

7 hours ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

10 hours ago