పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలు గానీ, అభిప్రాయ బేధాలు గానీ తలెత్తకుండా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ నిలిస్తే… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏపీ దాదాపుగా లాగేసుకునే దిశగా దూసుకుపోతోందని చెప్పక తప్పదు. ఇరు రాష్ట్రాలకు భౌగోళిక వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి వారుగా తమ రాష్ట్రాలకు సరిపడ రంగాలను ఎంచుకుని ముందుకు సాగుతున్నాయి. ఇక ఇరు రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న రంగాల్లో ఏపీ ఒకింత దూకుడుగా సాగుతోందని చెప్పక తప్పదు.
ప్రస్తుతం మహారాష్ట్ర రాజధాని ముంబైలో దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ జరుగుతోంది. ఈ వర్క్ షాప్ కు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటక శాఖ మంత్రులు హాజరవుతున్నారు. ఈ వర్క్ షాప్ కు హాజరయ్యే విషయంలో తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కంటే ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఒక అడుగు ముందున్నారు. జూపల్లి గురువారం ఈ సమావేశాలకు హాజరు అవుతుండగా.. బుధవారం ప్రారంభమైన ఈ వర్క్ షాప్ తొలిరోజు సమావేశాల్లోనే సందడి చేశారు. తొలి రోజే దుర్గేశ్ 20కి పైగా ప్రముఖ సంస్థలతో భేటీ అయ్యారు. ఈ వర్క్ షాప్ ఆద్యంతం దుర్గేశ్ బృందం కొనసాగనుంది. అయితే తొలి రోజు భేటీకి కారణమేమిటో తెలియదు గానీ జూపల్లి మాత్రం హాజరు కాలేదు. గురువారం జరిగే ఈ వర్క్ షాప్ నకు మాత్రం ఆయన హాజరు అవుతున్నారు.
ఏపీ నుంచి ఈ వర్క్ షాప్ నకు వెళ్లిన బృందానికి దుర్గేశ్ నేతృత్వం వహిస్తుండగా… రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలిలతో పాటు పర్యాటక రంగానికి చెందిన పలువురు కీలక అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో నూతనంగా హోటళ్ల ఏర్పాటుకు గల అవకాశాలను ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులకు ఈ బృందం వివరించింది. ఇప్పటికే అభివృద్ది చెంది పర్యాటకంగా మంచి స్కోప్ ఉన్న విశాఖ, తిరుపతిలతో పాటు నూతనంగా నిర్మితమవుతున్న అమరావతి, అభివృద్దిలో దూసుకుపోతున్న రాజమహేంద్రవరంలలో హోటళ్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ఆయా సంస్థల ముందు పెట్టారు. ఈ వర్క్ షాప్ ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టే దిశగా దుర్గేశ్ బృందం సాగుతోంది.
This post was last modified on April 10, 2025 6:19 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…