పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలు గానీ, అభిప్రాయ బేధాలు గానీ తలెత్తకుండా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ నిలిస్తే… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏపీ దాదాపుగా లాగేసుకునే దిశగా దూసుకుపోతోందని చెప్పక తప్పదు. ఇరు రాష్ట్రాలకు భౌగోళిక వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి వారుగా తమ రాష్ట్రాలకు సరిపడ రంగాలను ఎంచుకుని ముందుకు సాగుతున్నాయి. ఇక ఇరు రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న రంగాల్లో ఏపీ ఒకింత దూకుడుగా సాగుతోందని చెప్పక తప్పదు.
ప్రస్తుతం మహారాష్ట్ర రాజధాని ముంబైలో దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ జరుగుతోంది. ఈ వర్క్ షాప్ కు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటక శాఖ మంత్రులు హాజరవుతున్నారు. ఈ వర్క్ షాప్ కు హాజరయ్యే విషయంలో తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కంటే ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఒక అడుగు ముందున్నారు. జూపల్లి గురువారం ఈ సమావేశాలకు హాజరు అవుతుండగా.. బుధవారం ప్రారంభమైన ఈ వర్క్ షాప్ తొలిరోజు సమావేశాల్లోనే సందడి చేశారు. తొలి రోజే దుర్గేశ్ 20కి పైగా ప్రముఖ సంస్థలతో భేటీ అయ్యారు. ఈ వర్క్ షాప్ ఆద్యంతం దుర్గేశ్ బృందం కొనసాగనుంది. అయితే తొలి రోజు భేటీకి కారణమేమిటో తెలియదు గానీ జూపల్లి మాత్రం హాజరు కాలేదు. గురువారం జరిగే ఈ వర్క్ షాప్ నకు మాత్రం ఆయన హాజరు అవుతున్నారు.
ఏపీ నుంచి ఈ వర్క్ షాప్ నకు వెళ్లిన బృందానికి దుర్గేశ్ నేతృత్వం వహిస్తుండగా… రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలిలతో పాటు పర్యాటక రంగానికి చెందిన పలువురు కీలక అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో నూతనంగా హోటళ్ల ఏర్పాటుకు గల అవకాశాలను ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులకు ఈ బృందం వివరించింది. ఇప్పటికే అభివృద్ది చెంది పర్యాటకంగా మంచి స్కోప్ ఉన్న విశాఖ, తిరుపతిలతో పాటు నూతనంగా నిర్మితమవుతున్న అమరావతి, అభివృద్దిలో దూసుకుపోతున్న రాజమహేంద్రవరంలలో హోటళ్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ఆయా సంస్థల ముందు పెట్టారు. ఈ వర్క్ షాప్ ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టే దిశగా దుర్గేశ్ బృందం సాగుతోంది.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…