Political News

పవన్ కాన్వాయ్ కారణంగా ఎగ్జామ్ మిస్.. డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో కొందరు విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరు కాలేకపోయారన్న వార్తలు రావటం తెలిసిందే. పెందుర్తి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆపేయటం.. చివరకుసర్వీస్ రోడ్డులోనూ రాకపోకల్ని నిలువరించటంతో నలుగురు విద్యార్థులు పరీక్షకు మిస్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఏపీ డిఫ్యూటీ సీఎం స్పందించారు. విచారణకు ఆదేశించారు. తన కాన్వాయ్ కారణంగా పెందుర్తి విద్యార్థులు జేఈఈ ఎగ్జామ్ హాజరు కాకపోవటంపై విచారణ జరిపి.. తనకు నివేదిక అందించాలని ఆదేశించారు.

నా కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ నిలిపారు? పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులు వెళ్లే వేళలో ఆ మార్గంలో ట్రాఫిక్ పరిస్థితేంటి? సర్వీసు రోడ్డులోనూ ట్రాఫిక్ ను నియంత్రించారా? లాంటి అంశాలపై విచారణ జరపాల్సిందిగా విశాఖ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జేఈఈ మొయిన్స్ పరీక్ష విశాఖ నగరంలోని చినముషిడివాడ ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ రాసే విద్యార్థులు సోమవారం ఉదయం ఎనిమిదిన్నరకు హాజరు కావాల్సి ఉంటుంది.

అయితే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కారణంగా తాము పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోయినట్లుగా నలుగురు విద్యార్థులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ వాదనను విశాఖ పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో బీఆర్టీఎస్ సర్వీస్ రోడ్డులోని ఏ ప్రాంతంలోనూ ట్రాఫిక్ నిలిపివేయలేదన్నారు. ట్రాఫిక్ నిలిపివేయటం వల్ల పరీక్షకు సరైన టైంకు చేరుకోలేదని కొందరు అభ్యర్థులు చేసిన ఆరోపణలు తప్పు అంటూ విశాఖపట్నం వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ ప్రథ్వీతేజ్ వెల్లడించారు. పవన్ కాన్వాయ్ వెళ్లే వేళలోనూ సర్వీస్ రోడ్డలో రాకపోకలు నిలువరించలేదని స్పష్టం చేశారు.

This post was last modified on April 8, 2025 11:49 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

28 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago