Political News

జగన్ చేసిన తప్పుకు బాబును నిలదీసిన షర్మిల

ఏపీలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు మొక్కుబడిగా కొంత మొత్తం చెల్లించినటప్పటికీ బకాయిలు మాత్రం పూర్తిగా క్లియర్ కాలేదు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఈ భారం పడింది. ఇంకా దాదాపు 3500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. దీంతో, తాజాగా ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు నేటి నుంచి ఆరోగ్య శ్రీ కింద అందించే వైద్య సేవలు నిలిపివేశాయి.

ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయలేదంటూ కూటమి ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. వైద్య సేవలు ఆపే దాకా ఎదురు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయిందని, ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీగా మారిందని విమర్శించారు. పేరుకు రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదని ఎద్దేవా చేశారు. పేదోడి ఆరోగ్యానికి భరోసా లేదని, ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. 9 నెలలుగా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు.

ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు. ఏపీని వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు చెప్పారని, ముందు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని అన్నారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదని షర్మిల చెప్పారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి తక్షణమే వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

అయితే, షర్మిల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అన్న జగన్ హయాంలో 2500 కోట్ల రూపాయల బకాయిలున్నాయని, వాటిపై షర్మిల ఏనాడూ ప్రశ్నించలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఐదేళ్లు సైలెంట్ గా ఉన్న షర్మిల…ఇప్పుడు పది నెలల కూటమి పాలనను తప్పుబట్టడం ఏమిటని నిలదీస్తున్నారు. తన తండ్రి ప్రారంభించిన పథకంపై అన్న జగన్ ను ఆనాడు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తున్నారు.

This post was last modified on April 7, 2025 3:11 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

9 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago